Political News

బీజేపీలో మాధవీలతకు ఎందుకంత ప్రాధాన్యం ?

దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న పార్లమెంటు స్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ 1984 నుండి 1999 వరకు ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుండి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం ఆధీనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ ఇక్కడి నుండి నిలబెట్టిన అభ్యర్థి కొంపెల్లి మాధవీలత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

హిందుత్వ ప్రచారంతో గత కొన్ని నెలలుగా మీడియా, సోషల్ మీడియా ప్రచారంలో అనూహ్యంగా ముందుకు వచ్చిన మాధవీలత తెలంగాణ బీజేపీ నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో టికెట్ సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మాధవీలత మీద గుర్రుగా ఉన్నా నేరుగా మోడీ కార్యాలయం నుండి మాధవీలత ప్రచార కార్యక్రమాలు, అందులో పాల్గొంటున్న నేతల గురించి ఆరా తీస్తున్న నేపథ్యంలో కిక్కురుమనకుండా ఆమెతో స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది.

13 రోజుల క్రితం ఇండియా టీవీ ఆప్ కి ఆదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొన్నది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునివ్వడంతో మాధవీలత పేరు మార్మోగిపోయింది. ఈ కార్యక్రమానికి 3.6 మిలియన్ల వీక్షణలు రావడం ఈ సంధర్భంగా ప్రస్తావనార్హం. ఎంఐఎంను కట్టడి చేయడం అంత తేలిక కాదు. ఓవైసీని ఢీ కొట్టే స్థానంలో ఉన్నందునే మాధవీలతకు బీజేపీ పెద్దలు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ స్థానం గెలవాలన్న బీజేపీ పెద్దల ఆశలు ఎంత వరకు నెరవేరతాయో వేచిచూడాలి.

This post was last modified on April 21, 2024 11:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

15 minutes ago

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

6 hours ago