దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తున్న పార్లమెంటు స్థానాలలో హైదరాబాద్ ఒకటి. ఎంఐఎం కంచుకోట అయిన ఈ స్థానంలో ఎంఐఎం అధినేత సుల్తాన్ సలాఉద్దీన్ ఓవైసీ 1984 నుండి 1999 వరకు ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004 నుండి 2019 వరకు అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా ఈ స్థానం ఎంఐఎం ఆధీనంలోనే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ సారి బీజేపీ ఇక్కడి నుండి నిలబెట్టిన అభ్యర్థి కొంపెల్లి మాధవీలత అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
హిందుత్వ ప్రచారంతో గత కొన్ని నెలలుగా మీడియా, సోషల్ మీడియా ప్రచారంలో అనూహ్యంగా ముందుకు వచ్చిన మాధవీలత తెలంగాణ బీజేపీ నేతలతో సంబంధం లేకుండా నేరుగా ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో టికెట్ సాధించుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక నేతలు మాధవీలత మీద గుర్రుగా ఉన్నా నేరుగా మోడీ కార్యాలయం నుండి మాధవీలత ప్రచార కార్యక్రమాలు, అందులో పాల్గొంటున్న నేతల గురించి ఆరా తీస్తున్న నేపథ్యంలో కిక్కురుమనకుండా ఆమెతో స్థానిక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తున్నది.
13 రోజుల క్రితం ఇండియా టీవీ ఆప్ కి ఆదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొన్నది. స్వయంగా ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని ట్విట్టర్ ద్వారా పిలుపునివ్వడంతో మాధవీలత పేరు మార్మోగిపోయింది. ఈ కార్యక్రమానికి 3.6 మిలియన్ల వీక్షణలు రావడం ఈ సంధర్భంగా ప్రస్తావనార్హం. ఎంఐఎంను కట్టడి చేయడం అంత తేలిక కాదు. ఓవైసీని ఢీ కొట్టే స్థానంలో ఉన్నందునే మాధవీలతకు బీజేపీ పెద్దలు అంత ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్ స్థానం గెలవాలన్న బీజేపీ పెద్దల ఆశలు ఎంత వరకు నెరవేరతాయో వేచిచూడాలి.
This post was last modified on April 21, 2024 11:59 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…