Political News

మ‌ల్కాజిగిరిలో రేవంత్‌కు ప‌రీక్ష‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్ల‌మెంట్ ఎల‌క్ష‌న్స్ స‌వాలుగా నిలిచాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండ‌టంతో ఇక్క‌డ మెజారిటీ లోక్‌స‌భ స్థానాలు గెలిచి హైక‌మాండ్‌కు బ‌హుమ‌తి ఇవ్వాల‌నే సీఎం రేవంత్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే 17కి గాను 15 స్థానాల్లో గెల‌వాల్సిందేన‌నే ల‌క్ష్యంతో పీసీసీ అధ్య‌క్షుడిగానూ ఉన్న రేవంత్ సాగుతున్నారు. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టి పార్టీ గెలుపు కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే మ‌ల్కాజిగిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం రేవంత్‌కు ప‌రీక్ష‌గా నిలుస్తోంది. ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం ఆయ‌న‌కు ఎంతో ఇంపార్టెంట్‌గా మారింది.

మ‌ల్కాజిగిరిలో ఈ సారి కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే అది రేవంత్‌కు డ్యామేజీగా మారే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే 2019 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెలిచింది రేవంత్ రెడ్డే. గ‌త ఎన్నిక‌ల్లో తాను గెలిచిన స్థానాన్ని ఇప్పుడు కాపాడుకోలేక‌పోతే అది రేవంత్‌కు దెబ్బే అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన రేవంత్‌.. ఇక్క‌డ బీఆర్ఎస్‌, బీజేపీని వెన‌క్కినెట్టి కాంగ్రెస్‌ను గెలిపించే ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌.. మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు 10,919 ఓట్ల మెజారిటీతో గ‌ట్టెక్కారు.

అతిపెద్ద లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ల్కాజిరిగిలో ఈ సారి కూడా హోరాహోరీ పోరు త‌ప్పేలా లేదు. బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ త‌ర‌పున రాగిడి ల‌క్ష్మారెడ్డి పోటీప‌డుతున్నారు. దీంతో రేవంత్కు ట‌ఫ్ టెస్టుగా ఈ ఎన్నిక నిలుస్తోంది. ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో (ఇప్పుడు కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక‌)నూ బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులే గెలిచారు. ఇక్క‌డ బీఆర్ఎస్‌కు ఉన్న బ‌లానికి ఇదే నిద‌ర్శ‌నం. ఇక బీజేపీ కూడా పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి గెల‌వాలంటే తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సిందే. ఈ విష‌యం తెలిసిన రేవంత్ కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌నాల‌ను తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Satya

Recent Posts

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 minutes ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

2 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

5 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

10 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

13 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

13 hours ago