Political News

మ‌ల్కాజిగిరిలో రేవంత్‌కు ప‌రీక్ష‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు పార్ల‌మెంట్ ఎల‌క్ష‌న్స్ స‌వాలుగా నిలిచాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండ‌టంతో ఇక్క‌డ మెజారిటీ లోక్‌స‌భ స్థానాలు గెలిచి హైక‌మాండ్‌కు బ‌హుమ‌తి ఇవ్వాల‌నే సీఎం రేవంత్ ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అందుకే 17కి గాను 15 స్థానాల్లో గెల‌వాల్సిందేన‌నే ల‌క్ష్యంతో పీసీసీ అధ్య‌క్షుడిగానూ ఉన్న రేవంత్ సాగుతున్నారు. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ పెట్టి పార్టీ గెలుపు కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అయితే మ‌ల్కాజిగిరి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం రేవంత్‌కు ప‌రీక్ష‌గా నిలుస్తోంది. ఇక్క‌డ విజ‌యం సాధించ‌డం ఆయ‌న‌కు ఎంతో ఇంపార్టెంట్‌గా మారింది.

మ‌ల్కాజిగిరిలో ఈ సారి కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే అది రేవంత్‌కు డ్యామేజీగా మారే ప్ర‌మాదం ఉంది. ఎందుకంటే 2019 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా గెలిచింది రేవంత్ రెడ్డే. గ‌త ఎన్నిక‌ల్లో తాను గెలిచిన స్థానాన్ని ఇప్పుడు కాపాడుకోలేక‌పోతే అది రేవంత్‌కు దెబ్బే అని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గంపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన రేవంత్‌.. ఇక్క‌డ బీఆర్ఎస్‌, బీజేపీని వెన‌క్కినెట్టి కాంగ్రెస్‌ను గెలిపించే ప్ర‌య‌త్నాల్లో మునిగిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌.. మ‌ల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పుడు 10,919 ఓట్ల మెజారిటీతో గ‌ట్టెక్కారు.

అతిపెద్ద లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ‌మైన మ‌ల్కాజిరిగిలో ఈ సారి కూడా హోరాహోరీ పోరు త‌ప్పేలా లేదు. బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ పోటీలో నిలిచారు. బీఆర్ఎస్ త‌ర‌పున రాగిడి ల‌క్ష్మారెడ్డి పోటీప‌డుతున్నారు. దీంతో రేవంత్కు ట‌ఫ్ టెస్టుగా ఈ ఎన్నిక నిలుస్తోంది. ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో (ఇప్పుడు కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక‌)నూ బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థులే గెలిచారు. ఇక్క‌డ బీఆర్ఎస్‌కు ఉన్న బ‌లానికి ఇదే నిద‌ర్శ‌నం. ఇక బీజేపీ కూడా పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప‌ట్నం సునీత మ‌హేంద‌ర్ రెడ్డి గెల‌వాలంటే తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సిందే. ఈ విష‌యం తెలిసిన రేవంత్ కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహాల్లో మునిగిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంద‌నే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ జ‌నాల‌ను తిప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

This post was last modified on April 20, 2024 3:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

1 hour ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

3 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

4 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago