Political News

యూపీ ఎన్నికల బరిలో తెలుగు మహిళ

ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికలలో జౌన్ పూర్ స్థానం నుండి బీఎస్పీ తరపున బరిలోకి దిగిన తెలుగు మహిళ శ్రీ కళారెడ్డి కలంకలం రేపుతున్నారు. ఆమె గతంలోనే 2004లో కోదాడ నుండి టీడీపీ తరపున, 2019లో బీజేపీ నుండి హజూర్ నగర్ నుండి బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా యూపీలో తన భర్త ధనుంజయ్ సింగ్ కు జైలు శిక్ష పడడంతో ఆమె బరిలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి కీసర జితేందర్ రెడ్డి ఏకైక కుమార్తె శ్రీ కళారెడ్డి. ప్రముఖ నిప్పో బ్యాటరీల కంపెనీ వీరి కుటుంబానిదే కావడం విశేషం. చెన్నై కేంద్రంగా వ్యాపారం నేపథ్యంలో శ్రీ కళారెడ్డి ఇంటర్మీడియట్ అక్కడే చదివింది. ఆ తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసి యూఎస్ లో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు చదివింది. 2017లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో యూపీకి చెందిన మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ మూడో భార్యగా వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య ఆత్మహత్య చేసుకోగా రెండో భార్యకు విడాకులు ఇచ్చాక శ్రీకళారెడ్డిని మూడో భార్యగా స్వీకరించాడు.

2021లో జౌన్ పూర్ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికై జడ్పీ చైర్మన్ గా శ్రీ కళారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టింది. కిడ్నాప్, అక్రమ వసూళ్ల కేసులో ధనుంజయ్ సింగ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో బీఎస్పీ శ్రీ కళారెడ్డిని బరిలోకి దింపింది. బీజేపీ, ఎస్పీలను తట్టుకుని ఆమె ఎంత వరకు నిలబడుతుందో అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే శ్రీకళారెడ్డి పేరు మీద రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు, 1.74 కోట్ల ఆభరణాలు ఉండగా, భర్త ధనుంజయ్ సింగ్ పేరు మీద రూ.5.31 కోట్ల స్థిరాస్తులు, రూ.3.56 కోట్ల చరాస్తులు మాత్రమే ఉండడం గమనార్హం.

This post was last modified on April 19, 2024 2:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

34 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago