“వివేకా పేరు ఎత్తకండి.. ఆయన గురించి మాట్లాడకండి.. ఇది చాలా సీరియస్ విషయం!” అని కడప జిల్లా కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. కొందరు పేర్లను కూడా తన తీర్పులో ప్రస్తావించింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి.. చివరకు వివేకా కుమార్తె డాక్టర్ సునీతలకు కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలోకానీ.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కానీ.. వివేకా పేరు, ఆయన హత్యకు సంబంధించిన ఆరోపణలు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
ఏం జరిగింది?
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, జనసేన సహా బీజేపీలు.. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ కడప ఎంపీ అవినాష్రెడ్డిలను టార్గెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదే పదే వివేకానందరెడ్డి దారుణ హత్య కేసును వారు ప్రస్తావిస్తున్నారు. హంతకుడు అని, హంతకుడికి టికెట్ ఇచ్చారని.. ఇలా పదేపదే అనేక సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. అదేసమయంలో వివేకాను దారుణంగా చంపేశారంటూ.. సునీత కూడా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో మీడియా మరింత హైలెట్ చేసింది. ఈ పరిణామాలు వైసీపికి ప్రాణసంకటంగా మారాయి.
మరీ ముఖ్యంగా వైఎస్ షర్మిల, సునీతలు కడపలో చేసిన ప్రచారంలో ఏకంగా.. తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు.. కడప కోర్టులో పిటిషన్ వేశారు. దీనిని అత్యవసరంగా విచారించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ విన్నపం మేరకు అత్యవసరంగా కేసును విచారించిన కోర్టు.. పైవిధంగా తీర్పు ఇచ్చింది. వివేకా కేసు ప్రస్తుతం న్యాయ పరిధిలో ఉందన్న పిటిషనర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. అదేసమయంలో 2019లోనూ ఇదే విధంగా ఎన్నికల్లో వివేకా అంశాన్ని ప్రచారానికి తెచ్చారని.. కానీ, హైకోర్టు నిలువరించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు పైవిధంగా ఆయా పార్టీల నాయకులకు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on April 18, 2024 9:24 pm
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…