రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు గతంలో.! కానీ, ఇప్పుడు ఇద్దరూ కలిశారు, బీజేపీని కూడా కలుపుకున్నారు. కూటమిగా ముందుకు వెళుతున్నారు.
మొదట్లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య అస్సలు సయోధ్య లేదు. ఈ కూటమి వర్కవుట్ అయ్యేది కాదంటూ సోషల్ మీడియాలో స్పేసులు పెట్టి మరీ, నానా యాగీ చేసుకున్నారు.
అందుకే, అధినేతలు జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. పలుమార్లు కలిశారు, కలిసి మాట్లాడుకున్నారు. తమ తమ శ్రేణులకు ‘పొత్తు’పై కీలకమైన సందేశం తమ కలయిక ద్వారా స్పష్టంగా ఇచ్చారు.
ఇక, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కనిపిస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర పొగడ్తలు ఓ స్థాయి దాటి మరీ గుప్పించుకుంటుండడం గమనార్హం. ‘మరీ ఇంతలా పొగుడుకోవాలా.?’ అని కొందరు అనుకోవచ్చుగాక.!
కూటమి గెలుపుని చారిత్రక అవసరంగా భావిస్తున్న టీడీపీ, జనసేన.. అందుకు తగ్గట్టుగా పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. బీజేపీని కూడా టీడీపీ, జనసేన అలాగే కలుపుకుపోతున్నాయి. అయితే, బీజేపీ కొంత ప్రచారంలో వెనకబడినమాట వాస్తవం.
నామినేషన్ల పర్వం మొదలైంది గనుక, బీజేపీ నుంచి కూడా పూర్తిస్థాయిలో టీడీపీ, జనసేనకి సహాయ సహకారాలు ప్రచారం పరంగా అందే అవకాశాల్లేకపోలేదు.
గతంలో చేసుకున్న విమర్శల సంగతెలా వున్నా, నామినేషన్ పర్వం దగ్గరకొచ్చేసరికి మూడు పార్టీల శ్రేణుల మధ్య పొరపచ్చాలు పూర్తిగా తొలగిపోయాయి. మూడు పార్టీల కార్యకర్తలూ కూటమి జెండాల్ని రెపరెపలాడిస్తున్న వైనం.. చూసే జనానికి కూడా ముచ్చటేస్తోందనడం అతిశయోక్తి కాదు.
This post was last modified on April 18, 2024 5:29 pm
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…