రాజకీయాలన్నాక విమర్శలు మామూలే.! చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు గతంలో.! కానీ, ఇప్పుడు ఇద్దరూ కలిశారు, బీజేపీని కూడా కలుపుకున్నారు. కూటమిగా ముందుకు వెళుతున్నారు.
మొదట్లో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య అస్సలు సయోధ్య లేదు. ఈ కూటమి వర్కవుట్ అయ్యేది కాదంటూ సోషల్ మీడియాలో స్పేసులు పెట్టి మరీ, నానా యాగీ చేసుకున్నారు.
అందుకే, అధినేతలు జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. పలుమార్లు కలిశారు, కలిసి మాట్లాడుకున్నారు. తమ తమ శ్రేణులకు ‘పొత్తు’పై కీలకమైన సందేశం తమ కలయిక ద్వారా స్పష్టంగా ఇచ్చారు.
ఇక, ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి కనిపిస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర పొగడ్తలు ఓ స్థాయి దాటి మరీ గుప్పించుకుంటుండడం గమనార్హం. ‘మరీ ఇంతలా పొగుడుకోవాలా.?’ అని కొందరు అనుకోవచ్చుగాక.!
కూటమి గెలుపుని చారిత్రక అవసరంగా భావిస్తున్న టీడీపీ, జనసేన.. అందుకు తగ్గట్టుగా పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. బీజేపీని కూడా టీడీపీ, జనసేన అలాగే కలుపుకుపోతున్నాయి. అయితే, బీజేపీ కొంత ప్రచారంలో వెనకబడినమాట వాస్తవం.
నామినేషన్ల పర్వం మొదలైంది గనుక, బీజేపీ నుంచి కూడా పూర్తిస్థాయిలో టీడీపీ, జనసేనకి సహాయ సహకారాలు ప్రచారం పరంగా అందే అవకాశాల్లేకపోలేదు.
గతంలో చేసుకున్న విమర్శల సంగతెలా వున్నా, నామినేషన్ పర్వం దగ్గరకొచ్చేసరికి మూడు పార్టీల శ్రేణుల మధ్య పొరపచ్చాలు పూర్తిగా తొలగిపోయాయి. మూడు పార్టీల కార్యకర్తలూ కూటమి జెండాల్ని రెపరెపలాడిస్తున్న వైనం.. చూసే జనానికి కూడా ముచ్చటేస్తోందనడం అతిశయోక్తి కాదు.
This post was last modified on April 18, 2024 5:29 pm
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…