Political News

ఔను.. జ‌గ‌న్‌కు త‌గిలింది గుల‌క‌రాయే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారు ప్రాంతం సింగ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌కు సంబంధిం చి దాదాపు విచార‌ణ పూర్త‌యిన‌ట్టు తెలిసింది. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరిలో దుర్గారావు, స‌తీష్ అనే ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన రాయి.. “సున్న‌పు రాయి” లేదా “గుల‌క రాయి”గా నిర్ధారించారు. అందుకే.. ఇది విసిర‌న‌ప్పుడు.. కంట్లో కూడా.. ఇసుక పడింద‌ని చెబుతున్నారు.

ఇక‌, ఈ కేసులో టీడీపీ నేత‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. దీనికి సంబంధించి ప‌క్కా ఆధారాలు మాత్రం పోలీసుల‌కు ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నిందితుల‌ను రెండు రోజుల పాటు ర‌హ‌స్య ప్రాంతం లో విచారించిన పోలీసులు.. గురువారం స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టేందుకు రెడీ చేశారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు, టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి మ‌రోసారి ఫిర్యాదులు చేశారు. త‌మ పాత్ర‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా మీడియాకు లీకులు ఇస్తున్నార‌ని వారు చెబుతున్నారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సానుభూతి పొందేందుకు వైసీపీ నేత‌లు చేస్తున్న నాట‌కంలో పోలీసులు పాత్ర ధారులుగా మారార‌ని.. పార్టీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. నిజాలు తెలుసుకునేందుకు నిష్ప‌క్ష పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. మ‌రోవైపు.. రాయి దాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌ల‌లో వినియోగించుకోకుండా.. పార్టీల‌ను ఆదేశించాల‌ని కోరుతూ.. ప్ర‌జాసంఘాలు ఎన్నిక‌ల సంఘానికి లిఖిత పూర్వ‌క విజ్ఞ‌ప్తి చేశాయి. మొత్తంగా గుల‌క‌రాయి ఘ‌ట‌న దాదాపు ముగిసి పోయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 18, 2024 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

49 minutes ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

1 hour ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

2 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

2 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

4 hours ago