ఏపీ సీఎం జగన్పై విజయవాడ శివారు ప్రాంతం సింగ్నగర్లో జరిగిన రాయి దాడి ఘటనకు సంబంధిం చి దాదాపు విచారణ పూర్తయినట్టు తెలిసింది. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో దుర్గారావు, సతీష్ అనే ఇద్దరు యువకులు ప్రధాన నిందితులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక, సీఎం జగన్పై దాడి చేసేందుకు ఉపయోగించిన రాయి.. “సున్నపు రాయి” లేదా “గులక రాయి”గా నిర్ధారించారు. అందుకే.. ఇది విసిరనప్పుడు.. కంట్లో కూడా.. ఇసుక పడిందని చెబుతున్నారు.
ఇక, ఈ కేసులో టీడీపీ నేతలపై అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు మాత్రం పోలీసులకు లభించలేదు. ఈ నేపథ్యంలో నిందితులను రెండు రోజుల పాటు రహస్య ప్రాంతం లో విచారించిన పోలీసులు.. గురువారం స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టేందుకు రెడీ చేశారు. ఇదిలావుంటే.. మరోవైపు, టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదులు చేశారు. తమ పాత్రపై పోలీసులు అనవసరంగా మీడియాకు లీకులు ఇస్తున్నారని వారు చెబుతున్నారు.
కీలకమైన ఎన్నికల సమయంలో సానుభూతి పొందేందుకు వైసీపీ నేతలు చేస్తున్న నాటకంలో పోలీసులు పాత్ర ధారులుగా మారారని.. పార్టీ నాయకుడు వర్ల రామయ్య ఆరోపించారు. నిజాలు తెలుసుకునేందుకు నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని కోరారు. మరోవైపు.. రాయి దాడి ఘటనను ఎన్నికలలో వినియోగించుకోకుండా.. పార్టీలను ఆదేశించాలని కోరుతూ.. ప్రజాసంఘాలు ఎన్నికల సంఘానికి లిఖిత పూర్వక విజ్ఞప్తి చేశాయి. మొత్తంగా గులకరాయి ఘటన దాదాపు ముగిసి పోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 18, 2024 2:41 pm
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…