Political News

ఔను.. జ‌గ‌న్‌కు త‌గిలింది గుల‌క‌రాయే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారు ప్రాంతం సింగ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌కు సంబంధిం చి దాదాపు విచార‌ణ పూర్త‌యిన‌ట్టు తెలిసింది. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరిలో దుర్గారావు, స‌తీష్ అనే ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన రాయి.. “సున్న‌పు రాయి” లేదా “గుల‌క రాయి”గా నిర్ధారించారు. అందుకే.. ఇది విసిర‌న‌ప్పుడు.. కంట్లో కూడా.. ఇసుక పడింద‌ని చెబుతున్నారు.

ఇక‌, ఈ కేసులో టీడీపీ నేత‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. దీనికి సంబంధించి ప‌క్కా ఆధారాలు మాత్రం పోలీసుల‌కు ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నిందితుల‌ను రెండు రోజుల పాటు ర‌హ‌స్య ప్రాంతం లో విచారించిన పోలీసులు.. గురువారం స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టేందుకు రెడీ చేశారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు, టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి మ‌రోసారి ఫిర్యాదులు చేశారు. త‌మ పాత్ర‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా మీడియాకు లీకులు ఇస్తున్నార‌ని వారు చెబుతున్నారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సానుభూతి పొందేందుకు వైసీపీ నేత‌లు చేస్తున్న నాట‌కంలో పోలీసులు పాత్ర ధారులుగా మారార‌ని.. పార్టీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. నిజాలు తెలుసుకునేందుకు నిష్ప‌క్ష పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. మ‌రోవైపు.. రాయి దాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌ల‌లో వినియోగించుకోకుండా.. పార్టీల‌ను ఆదేశించాల‌ని కోరుతూ.. ప్ర‌జాసంఘాలు ఎన్నిక‌ల సంఘానికి లిఖిత పూర్వ‌క విజ్ఞ‌ప్తి చేశాయి. మొత్తంగా గుల‌క‌రాయి ఘ‌ట‌న దాదాపు ముగిసి పోయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 18, 2024 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago