Political News

ఔను.. జ‌గ‌న్‌కు త‌గిలింది గుల‌క‌రాయే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారు ప్రాంతం సింగ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌కు సంబంధిం చి దాదాపు విచార‌ణ పూర్త‌యిన‌ట్టు తెలిసింది. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరిలో దుర్గారావు, స‌తీష్ అనే ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన రాయి.. “సున్న‌పు రాయి” లేదా “గుల‌క రాయి”గా నిర్ధారించారు. అందుకే.. ఇది విసిర‌న‌ప్పుడు.. కంట్లో కూడా.. ఇసుక పడింద‌ని చెబుతున్నారు.

ఇక‌, ఈ కేసులో టీడీపీ నేత‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. దీనికి సంబంధించి ప‌క్కా ఆధారాలు మాత్రం పోలీసుల‌కు ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నిందితుల‌ను రెండు రోజుల పాటు ర‌హ‌స్య ప్రాంతం లో విచారించిన పోలీసులు.. గురువారం స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టేందుకు రెడీ చేశారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు, టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి మ‌రోసారి ఫిర్యాదులు చేశారు. త‌మ పాత్ర‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా మీడియాకు లీకులు ఇస్తున్నార‌ని వారు చెబుతున్నారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సానుభూతి పొందేందుకు వైసీపీ నేత‌లు చేస్తున్న నాట‌కంలో పోలీసులు పాత్ర ధారులుగా మారార‌ని.. పార్టీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. నిజాలు తెలుసుకునేందుకు నిష్ప‌క్ష పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. మ‌రోవైపు.. రాయి దాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌ల‌లో వినియోగించుకోకుండా.. పార్టీల‌ను ఆదేశించాల‌ని కోరుతూ.. ప్ర‌జాసంఘాలు ఎన్నిక‌ల సంఘానికి లిఖిత పూర్వ‌క విజ్ఞ‌ప్తి చేశాయి. మొత్తంగా గుల‌క‌రాయి ఘ‌ట‌న దాదాపు ముగిసి పోయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 18, 2024 2:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

42 minutes ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

1 hour ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

2 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

2 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

3 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

3 hours ago