టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండో సారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే.. ఆయన గుంటూరు జిల్లాలో తొలి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బయలు దేరి వెళ్లారు. ఈ క్రమంలో మంగళగిరి ప్రధాన రహదారులు పసుపు జెండాలో మూసుకు పోయాయి. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్కు మద్దతు తెలిపారు.
అదేసమయంలో కూటమి పార్టీలైన బీజేపీ, జనసేనల నుంచి కూడా కీలక నాయకులు హాజరయ్యరు. సీతారామస్వామి కోవెల, మిద్దె సెంటర్ నడుమ భారీగా జనసందోహం హాజరై.. నారా లోకేష్కు ముందస్తు అభినందనలు తెలిపారు. అనంతరం.. నారా లోకేష్.. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ తో కలిసి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆయన తరఫున ఎస్సీ,ఎస్టీ,బిసి , మైనారిటీ నేతలు కూడా.. మరో రెండు నామినేషన్ సెట్లను అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో మంగళగిరి మిద్దె సెంటర్ మీదుగా ప్రధాన రహదారికి ర్యాలీ చేరుకుంది. ర్యాలీకి అడుగడగునా సంఘీభావం కనిపించింది. భారీ సంఖ్యలో హాజరైన మంగళగిరి ప్రజలు, మహిళలు, యువతీ యువకులు పలువురు.. నారా లోకేష్కు హారతులు పట్టారు. కాగా, నారా లోకేష్ నామినేషన్ ఘట్టానికి తమిళనాడులోని శ్రీరంగ నాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం పెట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
This post was last modified on April 18, 2024 2:42 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…