టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నియోజకవర్గం నుంచి రెండో సారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గురువారం నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే.. ఆయన గుంటూరు జిల్లాలో తొలి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పాతమంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాదిమందితో ర్యాలీగా బయలు దేరి వెళ్లారు. ఈ క్రమంలో మంగళగిరి ప్రధాన రహదారులు పసుపు జెండాలో మూసుకు పోయాయి. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్కు మద్దతు తెలిపారు.
అదేసమయంలో కూటమి పార్టీలైన బీజేపీ, జనసేనల నుంచి కూడా కీలక నాయకులు హాజరయ్యరు. సీతారామస్వామి కోవెల, మిద్దె సెంటర్ నడుమ భారీగా జనసందోహం హాజరై.. నారా లోకేష్కు ముందస్తు అభినందనలు తెలిపారు. అనంతరం.. నారా లోకేష్.. ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ తో కలిసి మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. ఆయన తరఫున ఎస్సీ,ఎస్టీ,బిసి , మైనారిటీ నేతలు కూడా.. మరో రెండు నామినేషన్ సెట్లను అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో మంగళగిరి మిద్దె సెంటర్ మీదుగా ప్రధాన రహదారికి ర్యాలీ చేరుకుంది. ర్యాలీకి అడుగడగునా సంఘీభావం కనిపించింది. భారీ సంఖ్యలో హాజరైన మంగళగిరి ప్రజలు, మహిళలు, యువతీ యువకులు పలువురు.. నారా లోకేష్కు హారతులు పట్టారు. కాగా, నారా లోకేష్ నామినేషన్ ఘట్టానికి తమిళనాడులోని శ్రీరంగ నాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం పెట్టినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
This post was last modified on April 18, 2024 2:42 pm
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…