జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత అసహనానికి గురవుతున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీరియస్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు.. ఇవన్నీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తన నేపథ్యంలోనే.!
విషయమేంటంటే, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అత్యంత జుగుప్సాకరమైన రీతిలో మాటల దాడి చేస్తున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. బాధ్యతగల ముఖ్యమంత్రి పదవిలో వున్నారాయన. ఓ పార్టీ అధినేత కూడా.!
‘కార్లను మార్చినట్లు భార్యల్ని మార్చుతాడు..’, ‘నలుగురు నలుగురు పెళ్ళాలు..’ అంటూ పదే పదే వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తల్లోనే కొందరికి రుచించడంలేదు. ‘ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ జగన్ పెళ్ళాం గురించి మాట్లాడితే ఎలా వుంటుంది.?’ అన్న చర్చ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తల్లోనే జరుగుతోంది.
‘వైఎస్ జగన్ ఈ పద్ధతి మార్చుకోకపోతే, మహిళా ఓటు బ్యాంకు వైసీపీకి దూరమవుతుంది..’ అన్న భావన వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతుండడం గమనార్హం. ఆ సెక్షన్ వైసీపీ మద్దతుదారుల్ని తన దార్లోకి తెచ్చుకోవడానికా.. అన్నట్లు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి సంయమనం పాటిస్తున్నారు.
‘నేను కూడా నీ విషయంలో అలాంటి మాటలే మాట్లాడటం ఎంత సేపు జగన్.? కానీ, మాకు సంస్కారం వుంది. మేం, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంతలా దిగజారుడు వ్యాఖ్యలు చేయలేం..’ అని నిన్నటి మచిలీపట్నం ఎన్నికల ప్రచారం సందర్భంగా నిర్వహించిన సభ వేదికగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
వైఎస్ జగన్ ఏ వ్యూహంతో పవన్ కళ్యాణ్ మీద అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారోగానీ, అవి ఓ రకంగా పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతున్నాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారంటే, దానర్థం.. వైఎస్ జగన్ వ్యాఖ్యల విషయమై జనసేనానికి సింపతీ పెరుగుతోందనే కదా.!
This post was last modified on April 18, 2024 12:26 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…