Political News

కేంద్రం మాట‌.. ఫేక్ న్యూస్ వ‌ల్లే ఆ ప్రాణాలు పోయాయ‌ట‌

లాక్ డౌన్ మొద‌లైన ఆరంభంలో వ‌ల‌స కూలీలు ఎన్నెన్ని క‌ష్టాలు ప‌డ్డారో అంద‌రూ చూశారు. ఉన్న చోట ఉపాధి లేక‌.. త‌ట్టా బుట్టా చేత ప‌ట్టుకుని పిల్ల‌ల్ని క‌టిక ఎండ‌లో పిల్ల‌ల్ని న‌డిపించుకుంటూ.. స‌రైన తిండి కూడా లేకుండా వంద‌ల కిలోమీట‌ర్లు న‌డిచి వెళ్లిన ద‌య‌నీయ ప‌రిస్థితులు చూసి అంద‌రికీ క‌న్నీళ్లొచ్చాయి. ఈ క్ర‌మంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.

ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు బాధ్య‌తారాహిత్యంగా వ్య‌వ‌హ‌రించాయ‌న్న‌ది స్ప‌ష్టం. సోనూ సూద్ లాంటి వాళ్లు చొర‌వ తీసుకుని ముంబ‌యి లాంటి న‌గ‌రాల నుంచి వ‌ల‌స కార్మికుల్ని గ‌మ్య స్థానాల‌కు చేర్చ‌డం తెలిసిన సంగ‌తే. కానీ అంత‌కంటే ముందు ఎన్నో ఘోరాలు జ‌రిగాయి.

ఐతే అప్పుడు వ‌లస కూలీలు చ‌నిపోవ‌డానికి కార‌ణం కేవ‌లం ఫేక్ న్యూస్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పేయ‌డం గ‌మ‌నార్హం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల రాయ్ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ ఈవిధంగా సమాధానం ఇచ్చారు. ‘‘లాక్‌డౌన్ సమయంలో అనేక మంది వలస కూలీలు చనిపోయిన మాట నిజ‌మే. అయితే ఆ సమయంలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఆ భయంతోనే చాలా మంది చనిపోయారు.వారిపై ఆ ఫేక్ న్యూస్ చాలా ప్రభావాన్ని చూపించింది. కాగా, ఆ సమయంలో ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలను తగినంతగా సరఫరా చేయకపోయామని విచారం వ్యక్తం చేస్తున్నాం. ఐతే లాక్‌డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా అప్రమత్తమై ఉంది. జ‌నాల‌కు ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం’’ అని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు.

లాక్‌డౌన్ సమయంలో చనిపోయిన వారి డేటా తమ వద్ద లేదని కొద్ది రోజుల క్రితం అన్న కేంద్రం.. ఇప్పుడీ ప్ర‌క‌ట‌న‌తో మ‌రోసారి విమ‌ర్శ‌లెదుర్కొంటోంది.

This post was last modified on September 16, 2020 9:31 am

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

4 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

6 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

7 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

7 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

8 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

8 hours ago