లాక్ డౌన్ మొదలైన ఆరంభంలో వలస కూలీలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో అందరూ చూశారు. ఉన్న చోట ఉపాధి లేక.. తట్టా బుట్టా చేత పట్టుకుని పిల్లల్ని కటిక ఎండలో పిల్లల్ని నడిపించుకుంటూ.. సరైన తిండి కూడా లేకుండా వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన దయనీయ పరిస్థితులు చూసి అందరికీ కన్నీళ్లొచ్చాయి. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఈ విషయంలో ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాయన్నది స్పష్టం. సోనూ సూద్ లాంటి వాళ్లు చొరవ తీసుకుని ముంబయి లాంటి నగరాల నుంచి వలస కార్మికుల్ని గమ్య స్థానాలకు చేర్చడం తెలిసిన సంగతే. కానీ అంతకంటే ముందు ఎన్నో ఘోరాలు జరిగాయి.
ఐతే అప్పుడు వలస కూలీలు చనిపోవడానికి కారణం కేవలం ఫేక్ న్యూస్ అంటూ కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేయడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మల రాయ్ అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ ఈవిధంగా సమాధానం ఇచ్చారు. ‘‘లాక్డౌన్ సమయంలో అనేక మంది వలస కూలీలు చనిపోయిన మాట నిజమే. అయితే ఆ సమయంలో ఒక ఫేక్ న్యూస్ వైరల్ అయింది. ఆ భయంతోనే చాలా మంది చనిపోయారు.వారిపై ఆ ఫేక్ న్యూస్ చాలా ప్రభావాన్ని చూపించింది. కాగా, ఆ సమయంలో ఆహారం, తాగునీరు, ఆరోగ్య సేవలు, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలను తగినంతగా సరఫరా చేయకపోయామని విచారం వ్యక్తం చేస్తున్నాం. ఐతే లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా అప్రమత్తమై ఉంది. జనాలకు ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు.
లాక్డౌన్ సమయంలో చనిపోయిన వారి డేటా తమ వద్ద లేదని కొద్ది రోజుల క్రితం అన్న కేంద్రం.. ఇప్పుడీ ప్రకటనతో మరోసారి విమర్శలెదుర్కొంటోంది.
This post was last modified on September 16, 2020 9:31 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…