Political News

నా భార్య‌ను కూడా క‌ష్టపెట్టారు: చంద్ర‌బాబు

నా భార్య గురించి నేను ఎప్పుడూ చెప్ప‌లేదు. ఏనాడూ ఆమె గురించి బ‌హిరంగ వేదిక‌పై చెప్పుకొనే ప‌రిస్థితి రాలేదు. దీనికి కార‌ణం.. ఆమె ఇంటి గ‌డ‌ప దాటి ఏనాడూ రాజ‌కీయాలు మాట్లాడ‌లేదు. అలాంటింది జ‌గ‌న్ మూక‌లు.. నా భార్య‌ను కూడా క‌ష్ట‌పెట్టారు. ఆమె క‌న్నీరు పెట్టుకునే ప‌రిస్థితిని క‌ల్పించారు. అసెంబ్లీలోనూ.. బ‌య‌టా నానా మాట‌లు అన్నారు. దీంతో ఆమె ఎంత బాధ‌ప‌డిందో నాకు తెలుసు. ఇలాంటివాళ్లా మ‌హిళ‌ల గురించి.. వారి అభివృద్ధి గురించి మాట్లాడేది. ఇలాంటి వాళ్లా.. మ‌హిళ‌ల అభ్యున్న‌తి కోసం ఏదో చేస్తామ‌ని చెప్పేది! అని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. ఇక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ ప్ర‌జాగ‌ళంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తిని చూపిస్తూ.. ఈమెకు తెలుసు. నా భార్య భువ‌నేశ్వ‌రి ఎప్పుడూ గ‌డ‌ప దాట‌లేదు. కానీ, జ‌గ‌న్ మూక‌లు.. నా భార్య‌ని నానా మాట‌లు అన్నారు. క‌డాన‌.. అసెంబ్లీలోనూ అవ‌మానిం చారు. నారా లోకేష్ గురించి కూడా మాట్లాడారు. ఎన్టీఆర్ బిడ్డ‌గా ఆమె ఏ రోజూ ఇలాంటి మాట‌లు విన‌లేదు. అలాంటిది ఆమెనే అనే స‌రికి త‌ట్టుకోలేక పోయింది. క‌న్నీరు పెట్టుకుంది అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

గ‌త ఏడాది త‌న‌ను అక్ర‌మంగా అరెస్టు చేసిన స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 3 మంది పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు.. అభిమా నులు గుండెలు ప‌గిలి చ‌నిపోయారు. ఇక‌, అప్పుడు నారా భువ‌నేశ్వ‌రి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని తెలిపారు. ప్ర‌తి కుటుంబాన్నీ ఓదార్చార‌ని.. నునున్నానంటూ.. ఆమె ధైర్యం చెప్పి.. తండ్రి ఇచ్చిన డ‌బ్బులు.. తాను సంపాయించుకున్న డ‌బ్బుల నుంచి ఒక్కొక్క కుటుంబాన్నీ ఆదుకుంద‌న్నారు. ఇంటి నుంచి బ‌య‌టకే అడుగు పెట్ట‌ని భువ‌నేశ్వ‌రి.. రాష్ట్రంలోని మొత్తం 25 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌ర్య‌టించి.. 9 వేల కిలో మీట‌ర్ల మేర‌కు ప్ర‌యాణించి.. పార్టీ అభిమాన కుటుంబాల‌కు ద‌న్నుగా నిలిచార‌ని చంద్ర‌బాబు వివ‌రించారు.

మ‌హిళ‌ల‌కు ఎవ‌రు ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఎవ‌రు ఏడిపిస్తున్నారో.. ఎవ‌రు వారికి అభివృద్ధి ప‌థ‌కాలు అందించాల‌ని భావిస్తు న్నారో.. ఎవ‌రు ఆట వ‌స్తువుల‌గా భావిస్తున్నారో గుర్తించాల‌ని ఈ సంద‌ర్భంగా పేరు చెప్పకుండానే వైసీపీని దుయ్య‌బ‌ట్టారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌హిళ‌లు కూడా పార్టీకి అండ‌గా ఉండాల‌న్నారు. వారిని ల‌క్షాధికారుల‌ను చేసే బాధ్య‌త తాను తీసుకుంటాన న్నారు. మ‌హిళ‌ల‌కు ఉచిత ర‌వాణా సౌక‌ర్యంతోపాటు.. 15 వేల రూపాయ‌ల అమ్మ‌కు వంద‌నం నిధులు ఇస్తామ‌న్నారు.

This post was last modified on April 15, 2024 9:23 pm

Share

Recent Posts

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

8 minutes ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

17 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

44 minutes ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

1 hour ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago