ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బిజెపితో టిడిపి పొత్తు పెట్టుకుందని, కానీ మోడీకి జగన్ తొత్తుగా మారారని షాకింగ్ కామెంట్లు చేశారు.
నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలను జగన్ మోసం చేశారని షర్మిల విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని, ప్రత్యేక హోదా తెస్తామని రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆరోపించారు.
22 మంది ఎంపీలను పెట్టుకొని ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేదని జగన్ ను షర్మిల ప్రశ్నించారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటిలో ప్రసంగించిన షర్మిల ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణస్వామిపై విమర్శలు గుప్పించారు. నాసిరకం లిక్కర్ వ్యాపారం లో ఆయన బాగా సంపాదించుకున్నారని, నాసిరకం మద్యంతో వైసిపి నేతలు ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
అయితే వైసిపి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చే డబ్బు తీసుకోవాలని, ఓటు మాత్రం కాంగ్రెస్ కు వేయాలని షర్మిల కోరారు. వైసిపి ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని షర్మిల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని షర్మిల చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వైయస్సార్ ఆకాంక్షించారని, ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే తాను ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు.
This post was last modified on April 15, 2024 6:31 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…