ఏపీ సీఎం జగన్పై రాయి వేసిన ఘటన నుంచి ఇంకా రాజకీయాలు కోలుకోక ముందే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఒక వ్యక్తి రాయి విసిరాడు. అయితే.. అది తృటిలో తప్పిపోయి. సిబ్బంది చేతికి తగిలింది. అయితే.. పట్టపగలే కావడంతో రాయి విసిరిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో పెద్ద గందరగోళం చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
ఎన్నికల ప్రచారం కోసం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెనాలిలో పర్యటించారు. వారాహి వాహనంపై ఆయన తెనాలిలో ప్రచారం ప్రారంభించారు. స్థానిక అభ్యర్థి, పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ .. ఇతర నాయకులు.. వారాహిపై ప్రచారం చేస్తున్న సమయంలో ఆగంతకుడు ఒకరు గుంపులో నుంచి రాయి విసిరాడు. అయితే.. ఈరాయి.. తృటిలో పవన్ కళ్యాణ్కు ఎడమ వైపు నుంచి దూసుకుపోయి.. సిబ్బందికి తగిలింది.
దీంతో వారాహి యాత్రలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే.. ఈ ఘటన సాయంత్రం 6 గంటలకు జరగడంతో రాయి విసిరిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు వెంటనే గుర్తించి.. పట్టుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు అప్పగించారు. అయితే.. అతను వైసీపీ సానుభూతిపరుడని జనసేన నాయకులు చెబుతున్నారు. పోలీసులు అతనిని స్టేషన్కు తరలించారు.
బాక్సాఫీస్ వద్ద సునామిలాగా విరుచుకుపడుతున్న ది ఒడిస్సి షూటింగ్ కేవలం 93 రోజుల్లో అయిపోయిందంటే నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.…
వచ్చే నెల ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమా వారణాసి ఒకటే కాబట్టి…
తాను కథానాయికగా నటించే రోజుల్లో ప్యాడెడ్ బ్రాలు, బంప్ బ్రాలు పెట్టుకోమని ఫిలిం మేకర్స్ విపరీతంగా ఒత్తిడి తెచ్చేవాళ్లని సమీరా…
దేశ రాజధాని ఢిల్లీ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ హుటాహుటిన రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రులతో…
కొలువులు అడిగితే యువతను పోలీసులతో కొట్టిస్తున్నారని.. కాంగ్రెస్కు డెత్ డిక్లరేషన్ రాసే సమయం వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదల శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి…