ఏపీ సీఎం జగన్పై రాయి వేసిన ఘటన నుంచి ఇంకా రాజకీయాలు కోలుకోక ముందే.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఒక వ్యక్తి రాయి విసిరాడు. అయితే.. అది తృటిలో తప్పిపోయి. సిబ్బంది చేతికి తగిలింది. అయితే.. పట్టపగలే కావడంతో రాయి విసిరిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో పెద్ద గందరగోళం చోటు చేసుకుంది.
ఏం జరిగింది?
ఎన్నికల ప్రచారం కోసం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తెనాలిలో పర్యటించారు. వారాహి వాహనంపై ఆయన తెనాలిలో ప్రచారం ప్రారంభించారు. స్థానిక అభ్యర్థి, పార్టీ కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ .. ఇతర నాయకులు.. వారాహిపై ప్రచారం చేస్తున్న సమయంలో ఆగంతకుడు ఒకరు గుంపులో నుంచి రాయి విసిరాడు. అయితే.. ఈరాయి.. తృటిలో పవన్ కళ్యాణ్కు ఎడమ వైపు నుంచి దూసుకుపోయి.. సిబ్బందికి తగిలింది.
దీంతో వారాహి యాత్రలో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే.. ఈ ఘటన సాయంత్రం 6 గంటలకు జరగడంతో రాయి విసిరిన వ్యక్తిని జనసేన కార్యకర్తలు వెంటనే గుర్తించి.. పట్టుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు అప్పగించారు. అయితే.. అతను వైసీపీ సానుభూతిపరుడని జనసేన నాయకులు చెబుతున్నారు. పోలీసులు అతనిని స్టేషన్కు తరలించారు.
This post was last modified on April 14, 2024 7:14 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…