ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెను కుదుపుగా మారిన సీఎం జగన్పై రాళ్ల దాడి.. ఔను ఒకటి కాదు.. ఆయనపై రెండు దఫాలుగా రాళ్లు పడ్డాయి. ఒకటి గజ మాల వేస్తున్న సమయంలో తర్వాత.. కొంత దూరం వెళ్లిన తర్వాత.. ఈ రెండు దాడుల్లో మొదటి దాన్ని లైట్ తీసుకున్నారు. దండలో ఏదో తగిలి ఉంటుందని అనుకున్నారు. కానీ.. తర్వాత.. గట్టిగానే రాయి నేరుగా వచ్చి తగిలింది. దీంతో సీఎం జగన్ తలకు స్వల్ప గాయం అయింది. అయితే.. వైద్యులు చెబుతున్న మేరకు.. నరానికి బలంగానే తగిలింది.
కట్ చేస్తే.. ఇది రాజకీయ హంగామాకు దారి తీసింది. జగన్ కావాలనే నాటకం ఆడుతున్నారని టీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇది కోడికత్తి దాడి 2.0గా అభివర్ణించారు. ఎన్నికల సమయంలో కావాలనే దాడులు చేయించుకుని.. దీనిని సానుభూతి కోణంలో చూపించి విజయం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నదివారి ఆరోపణ. దీనికి 2019 ఘటనను తెరమీదికి తెచ్చారు. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా చేయించుకున్న దాడేనని చెబుతూ.. కొన్ని రీజన్లు కూడా తెరమీదికి తెచ్చారు.
మరి ఇది నిజమా? రాళ్లు వేయించుకునే స్థాయికి జగన్ దిగజారిపోయారా? అనేది ప్రశ్న. ఇదే నిజమని అనుకుంటే.. 2.63 లక్షల కోట్లను ప్రజలకు ఆయన పంచాల్సిన అవసరం ఏముంది? అప్పులు చేసి.. ప్రతిపక్షాల నేతలతో విమర్శలు ఎదుర్కొనాల్సిన అవసరం ఏముంటుంది. ఏదో ఒక రకంగా.. కాలం గడిపేసి.. ఎన్నికలకు ముందు రాళ్లు – రప్పలతో దాడులు చేయించుకుని.. దానిని ఎన్నికల సానుభూతిగా చూపించి గెలుపు గుర్రం ఎక్కొచ్చుకదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఒక కాకికి ఏదైనా హాని జరిగినప్పుడు.. ఇతర కాకులు.. అన్నీ పోగై.. అరుపులు కేకలతో సానుభూతి చూపిస్తాయి. కానీ, మారిన రాజకీయ పరిణామాలతో ఏం జరిగినా.. దానిని మరో కోణంలో చూసే పరిస్థితి దేశవ్యాప్తంగా మారిపోయింది. దీంతో విపక్షాల విమర్శలను ఈ కోణంలోనే చూడాల్సి వస్తోంది. సానుభూతి రాజకీయాలు రాజ్యమేలుతున్నంత వరకు.. నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు ఎదుర్కొనక తప్పదు. కానీ, ఎవరూ కూడా.. ఉద్దేశ పూర్వకంగా రాళ్లు వేయించుకోరు.. క్లెమోర్ మైన్లతో దాడులు చేయించుకోరు. ఒకవేళ రాళ్లు వేయించుకోవడం అనేది ఉద్దేశ పూర్వకమేనని అనుకుంటే.. 2008లో చంద్రబాబుపై జరిగిన క్లెమోర్ మైన్ దాడి.. అనంతరం జరిగిన ముందస్తు ఎన్నికలను కూడా.. ఇలానే భావించాల్సి ఉంటుంది. కాబట్టి .. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
This post was last modified on April 14, 2024 11:18 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…