Political News

సెంచరీ కొట్టగలిగితే చాలనుకుంటున్న వైసీపీ?

2019 ఎన్నికల్లో వైసీపీకి ల్యాండ్ స్లైడ్ విక్టరీ లభించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను, ఏకంగా 151 నియోజకవర్గాల్ని వైసీపీ గెలిచింది. మళ్ళీ అలాంటి విక్టరీ సమీప భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పార్టీకి సాధ్యమా.? అంటే, ఏమో.. చెప్పలేం.!

కానీ, ఆంధ్ర ప్రదేశ్‌లోని అధికార వైసీపీ, వై నాట్ 175 అంటోంది.! అదే దిశగా ఎన్నికల కార్యాచరణని, దాదాపు ఏడాది క్రితమే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగులతో మొదలైంది ఈ ప్రసహనం. గడప గడపకీ వైసీపీ సహా అనేక కార్యక్రమాలు ఈ కోవలో ప్రారంభమైనవే.

అయితే, ఇంటింటికీ వైసీపీ ప్రజా ప్రతినిథులు వెళుతోంటే, ఎదురైన చీత్కారాల నేపథ్యంలో వైసీపీలో కొంత నీరసం ఆవరించింది. ఈలోగా ఎన్నికలు ముంచుకొచ్చేశాయ్.! ఇప్పటికీ వైసీపీ నేతలు కొందరు ‘వై నాట్ 175’ అంటున్నా, లోలోపల వంద గెలిస్తే చాలనుకుంటున్నారు.

వంద కూడా కాదు, 90 సీట్లు గెలిచి, అధికార పీఠమెక్కితే, ఆ తర్వాత టీడీపీ శాశ్వతంగా సమాధి అయిపోతుందనే భావన వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఇంతకీ, ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్ ఎలా వుంది.? అంటే, వైసీపీకి ఏమంత ఆశాజనకంగా కనిపించడంలేదు.

వైసీపీ నుంచి ఎప్పుడైతే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లోకి దూకెయ్యడం ప్రారంభమైందో, అప్పుడే వైసీపీ పతనంపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది రాజకీయ పరిశీలకులకి. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి వల్ల వైసీపీకి రాజకీయంగా చావు దెబ్బ తగలబోతోందన్నది నిర్వివాదాంశం.

ఎవరు గెలిచినా, పార్టీ ఫిరాయింపులు అధికార పార్టీలోకి ఎన్నికల తర్వాత అనూహ్యంగా వుండబోతున్నాయి. తెలంగాణలో రాజకీయాల్ని చూస్తున్నాం కదా.! ఎన్నికల వరకు అసలు కాంగ్రెస్ పార్టీ గేమ్‌లోనే లేదు. గులాబీ పార్టీకి తిరుగులేదని అంతా అనుకున్నారు. లోక్ సభ ఎన్నికలొచ్చేసరికి గులాబీ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి.

అదే పరిస్థితి, ఆంధ్ర ప్రదేశ్‌లో వైసీపీకి రాబోతోందా.? అంటే, ఔననే అభిప్రాయాలు అన్ని వైపుల నుంచీ వినిపిస్తున్నాయి. అందుకే, ‘ఎలాగోలా వంద గెలిస్తే చాలు..’ అన్న స్థాయికి వైసీపీ శ్రేణుల ఆలోచనలు పడిపోతున్నాయి.

This post was last modified on April 14, 2024 7:19 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మంత్రులు సైలెంట్‌.. అన్నింటికీ రేవంత్ కౌంట‌ర్‌

కాంగ్రెస్ హైక‌మాండ్ ఎంత చెప్పినా తెలంగాణ‌లోని ఆ పార్టీకి చెందిన కొంత‌మంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావ‌డం లేద‌ని తెలిసింది.…

2 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఫ‌స్ట్ టైం మోడీ.. రాజీవ్ జ‌పం!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నోటి వెంట కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కుడు, దివంగ‌త ప్ర‌ధాని రాజీవ్ గాంధీ జపం వినిపించింది.…

4 hours ago

సినీ ప్రపంచం కళ్ళన్నీ కల్కి వేడుక మీదే

రేపు సాయంత్రం కల్కి 2898 ఏడి ఈవెంట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. సుమారు…

5 hours ago

కవితకు బెయిల్ ఎందుకు రావడం లేదు ?

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయ్యారు.…

6 hours ago

వెంకటేష్ సినిమాలో మంచు మనోజ్

ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి వరస సూపర్ హిట్ల తర్వాత వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో…

6 hours ago

బొత్స ‘ముహూర్తం’ పెట్టారు.. వైవీ ‘స‌మ‌యం’ నిర్ణ‌యించారు!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాట‌లే కాదు.. ఆశ‌లు కూడా కోట‌లు దాటుతున్నాయి. ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్‌లో…

7 hours ago