Political News

అన్న‌కు షాకిచ్చి.. చెల్లికి జై కొట్టి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూసుకెళ్తున్నారు. క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తూ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప‌దునైన మాట‌ల‌తో సాగిపోతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్ర‌జ‌లకు చేరువ చేస్తూనే.. మ‌రోవైపు పార్టీ బ‌లాన్ని కూడా పెంచే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా అన్న జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేలా ష‌ర్మిల ప‌టిష్ఠ‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి టికెట్ ద‌క్క‌ని నేత‌లు.. ఇప్పుడు జ‌గ‌న్‌కు షాకిచ్చి చెల్లి ష‌ర్మిల చెంత‌కు వెళ్లిపోతున్నారు. తాజాగా పి.గ‌న్న‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా కాంగ్రెస్‌లో చేర‌డం హాట్ టాపిక్‌గా మారింది.

2019 ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లా పి.గ‌న్న‌వ‌రం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిట్టిబాబు విజ‌యం సాధించారు. ఈ సారి కూడా టికెట్ ఆశించారు. కానీ జ‌గ‌న్ ఆయ‌న‌కు మొండిచెయ్యే చూపించారు. అక్క‌డ సిటింగ్ ఎమ్మెల్యేను కాద‌ని విప్ప‌ర్తి వేణుగోపాల్‌కు జ‌గ‌న్ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అనంత‌రం ష‌ర్మిల ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి ఆయ‌న పి.గ‌న్న‌వ‌రంలో పోటీ చేసే అవ‌కాశ‌ముంది.

ఇప్ప‌టికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఉన్న‌మ‌ట్ల ఎలిజా కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆర్థ‌ర్‌కు కాకుండా సుధీర్‌కు, ఎలిజాను కాద‌ని కుంభం విజ‌య‌రాజ‌కు జ‌గ‌న్ టికెట్లు కేటాయించారు. దీంతో టికెట్లు ద‌క్క‌ని వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లోకి వెళ్లిపోగా.. మ‌రికొంద‌రు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గ‌తంలో వైఎస్ కార‌ణంగా కాంగ్రెస్‌పై ఉన్న అభిమానం, వైఎస్ కుటుంబంతో స‌త్సంబంధాల కార‌ణంగా చాలా మంది జ‌గ‌న్‌కు వ‌దిలి ష‌ర్మిల వెంట న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలూ ష‌ర్మిల‌కు చెంత చేర‌తార‌ని టాక్‌. 

This post was last modified on April 13, 2024 4:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దుర్గేశ్ ప్లాన్ సక్సెస్ .. ‘సూర్యలంక’కు రూ.97 కోట్లు

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక…

4 hours ago

బాబుకు జయమంగళ పాదాభివందనం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ…

5 hours ago

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే…

6 hours ago

చివరి నిమిషం టెన్షన్లకు ఎవరు బాధ్యులు

అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా…

7 hours ago

టాస్క్ ఫోర్స్ ఎంట్రీ.. గేట్స్ సహకారానికి రూట్ క్లియర్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే…

7 hours ago

గురువుని ఇంత ఫాలో అవ్వాలా శిష్యా

ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి…

8 hours ago