ఏ రాజకీయ పార్టీకి అయినా ట్రబుల్ షూటర్ తప్పనిసరి.! అధినేత కనుసన్నల్లో, అధినేత ఆదేశాల్ని తు.చ. తప్పకుండా పాటించేలా ఆ ట్రబుల్ షూటర్ పనిచేయాల్సి వుంటుంది. పార్టీలో ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే, అధినేత వరకూ ఆ సమస్య వెళ్ళకుండా పరిష్కరించగలిగేంత చాతుర్యం ఆ ట్రుబల్ షూటర్కి వుండి తీరాలి.
ఔను, జనసేన పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఓ ట్రబుల్ షూటర్ అవసరం.! ఎన్నికల వేళ టిక్కెట్ల పంచాయితీ నేపథ్యంలో, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అన్ని నియోజకవర్గాల్లోనూ సమస్యల్ని అధినేతే పరిష్కరించాలంటే, అది కుదిరే పని కాదు.!
21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తోంది. అన్ని చోట్లా సమస్యలు లేవు. కొన్ని చోట్ల సమస్యలు తీవ్రంగా వున్నాయి. ఒకటొకటిగా ఆ సమస్యల్ని జనసేనాని పరిష్కరించుకుంటూ వెళుతున్నారు.
తిరుపతిలో పంచాయితీ ఒకింత ఇబ్బందికరంగా మారడంతో, నిన్ననే జనసేనాని తిరుపతికి వెళ్ళి, అక్కడి వ్యవహారాన్ని ‘సెట్’ చేసిన సంగతి తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయడంలేదు కదా.? ఆయనైనా సమస్యని పరిష్కరించి వుండాలి కదా.? అదే జరగలేదిక్కడ.
వాస్తవానికి, నిన్న మొన్నటిదాకా నాదెండ్ల మనోహర్ అన్నీ చూసుకునేవారు. కానీ, ఆయనిప్పుడు, ఎన్నికల బరిలో వున్నారు గనుక, తన ప్రచార వ్యవహారాల్లో తాను బిజీగా వున్నారు. పైగా, పోతిన మహేష్ లాంటి చాలామంది నాయకులు, నాదెండ్ల మనోహర్ మీద తీవ్ర విమర్శలు చేసి, పార్టీకి దూరమయ్యారు.
పదేళ్ళ జనసేన ప్రస్తానంలో, నిఖార్సయిన ట్రబుల్ షూటర్ని ఇంకా తయారు చేసుకోలేకపోవడం కాస్త ఆశ్చర్యకరమే.!
This post was last modified on April 13, 2024 1:22 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…