ఏపీలో కూటమి పార్టీలకు కొత్త చిక్కు వచ్చింది. వైసీపీని గద్దె నుంచి దించాలన్న లక్ష్యంతో జనసేన-టీడీపీ-బీజేపీలు జతకట్టాయి. ఓటు బ్యాంకు చీలకుండా చూడాలని నిర్ణయించాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. అసంతృప్త జ్వాలలు ఎగిసి పడినా.. కూటమిగానే ముందుకు సాగుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. లైన్లో ఉంది. ఏముందిలే.. అని ఈ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు, నిలబెట్టిన నాయకులను గమనిస్తే.. లైట్ తీసుకునే అవకాశం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా కాకపోయినా.. దాదాపు 50 నుంచి 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకన్నా వ్యక్తుల బలమే ఎక్కువగా ఉంది. వీరిపట్ల ప్రజలకు ఉన్న సానుభూతి.. ఇక్కడ ప్రభావితం చూపించే అవకాశం కనిపిస్తోంది. ఉదాహరణకు తిరువూరు నియోజకవర్గంలో(ఎస్సీ) తాంతియా కుమారి కాంగ్రెస్ తరఫున పోటీచేస్తున్నారు. ఈమెకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈమె తండ్రి మాజీ మంత్రి కోనేరు రంగారావు.. సానుభూతి ఆమెకు గెలిచేంత కాకపోయినా.. కనీసం 30 వేల వరకు ఓట్లను వేయిస్తుంది.
అదేవిధంగా శింగనమల ఎస్సీ నియోజకవర్గంలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బరిలో ఉన్నారు. ఈయనకు కూడా సానుభూతి ఉంది. పార్టీ విషయాన్ని పక్కన పెడితే.. సాకేకు సొంతగా ఇక్కడ ఓటు బ్యాంకు ఉంది.. ఇది కూడా.. 25-35 వేల ఓట్లను ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కిల్లి కృపారాణి రంగంలో ఉన్నారు. కళింగ సామాజిక వర్గం ఓట్లు చీల్చడంలో ఈమెను మించిన వారు లేరనే టాక్ అందరికీ తెలిసిందే.
ఇది.. కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న అచ్చెన్నాయుడిపై ప్రభావం చూపించనుంది. ఇక, విజయవాడ సెంట్రల్లో కాంగ్రెస్ -వామపక్షాల పొత్తులోభాగంగా సీపీఎం నాయకుడు చిగురుపాటి బాబూరావు బరిలో ఉన్నారు. ఈయన గత ఎన్నికల్లోనే 25 వేల ఓట్లు చీల్చి.. టీడీపీ అభ్యర్థి పరాజయానికి పరోక్షంగా కారణమయ్యారు. ఇప్పుడు మరో 30 వేల వరకు ఈయన ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇది కూడా.. కూటమికి ఎఫెక్టే.
అదేవిధంగా బాపట్ల ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.. జేడీ శీలం, కాకినాడ ఎంపీగా బరిలో ఉన్న పల్లంరాజు వంటివారు.. కూడా కూటమి ఓట్లను ప్రభావితం చేయడంలో ముందున్నారనేది అందరికీ తెలిసిందే. వీరికి ఉన్న చరిష్మా.. స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకు వంటివి.. వీరి గెలుపునకు దోహదపడకపోయినా.. ఓట్లను చీల్చడంలో మాత్రం.. ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అదికూటమికే ఎఫెక్ట్ అవుతుందనేది పరిశీలకులు చెబుతున్న మాట.
This post was last modified on April 13, 2024 12:00 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…