Political News

కాంగ్రెస్‌ను లైట్ తీసుకుంటే క‌ష్ట‌మే!

ఏపీలో కూట‌మి పార్టీల‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. వైసీపీని గ‌ద్దె నుంచి దించాల‌న్న ల‌క్ష్యంతో జ‌న‌సేన‌-టీడీపీ-బీజేపీలు జ‌త‌క‌ట్టాయి. ఓటు బ్యాంకు చీల‌కుండా చూడాల‌ని నిర్ణ‌యించాయి. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. అసంతృప్త జ్వాల‌లు ఎగిసి ప‌డినా.. కూట‌మిగానే ముందుకు సాగుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. లైన్‌లో ఉంది. ఏముందిలే.. అని ఈ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు, నిల‌బెట్టిన నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తే.. లైట్ తీసుకునే అవ‌కాశం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా కాక‌పోయినా.. దాదాపు 50 నుంచి 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీక‌న్నా వ్య‌క్తుల బ‌ల‌మే ఎక్కువ‌గా ఉంది. వీరిప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న సానుభూతి.. ఇక్క‌డ ప్ర‌భావితం చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో(ఎస్సీ) తాంతియా కుమారి కాంగ్రెస్‌ త‌ర‌ఫున పోటీచేస్తున్నారు. ఈమెకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఈమె తండ్రి మాజీ మంత్రి కోనేరు రంగారావు.. సానుభూతి ఆమెకు గెలిచేంత కాక‌పోయినా.. క‌నీసం 30 వేల వ‌ర‌కు ఓట్ల‌ను వేయిస్తుంది.

అదేవిధంగా శింగ‌న‌మ‌ల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ బ‌రిలో ఉన్నారు. ఈయనకు కూడా సానుభూతి ఉంది. పార్టీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. సాకేకు సొంత‌గా ఇక్క‌డ ఓటు బ్యాంకు ఉంది.. ఇది కూడా.. 25-35 వేల ఓట్ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి కిల్లి కృపారాణి రంగంలో ఉన్నారు. క‌ళింగ సామాజిక వ‌ర్గం ఓట్లు చీల్చ‌డంలో ఈమెను మించిన వారు లేర‌నే టాక్ అంద‌రికీ తెలిసిందే.

ఇది.. కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న అచ్చెన్నాయుడిపై ప్ర‌భావం చూపించ‌నుంది. ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో కాంగ్రెస్ -వామ‌ప‌క్షాల పొత్తులోభాగంగా సీపీఎం నాయ‌కుడు చిగురుపాటి బాబూరావు బ‌రిలో ఉన్నారు. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనే 25 వేల ఓట్లు చీల్చి.. టీడీపీ అభ్య‌ర్థి ప‌రాజ‌యానికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రో 30 వేల వ‌ర‌కు ఈయ‌న ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇది కూడా.. కూట‌మికి ఎఫెక్టే.

అదేవిధంగా బాప‌ట్ల ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. జేడీ శీలం, కాకినాడ ఎంపీగా బ‌రిలో ఉన్న ప‌ల్లంరాజు వంటివారు.. కూడా కూట‌మి ఓట్ల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో ముందున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. వీరికి ఉన్న చ‌రిష్మా.. స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకు వంటివి.. వీరి గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ‌క‌పోయినా.. ఓట్ల‌ను చీల్చ‌డంలో మాత్రం.. ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపిస్తుంది. అదికూట‌మికే ఎఫెక్ట్ అవుతుంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

This post was last modified on April 13, 2024 12:00 pm

Share

Recent Posts

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

5 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

7 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

7 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

7 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

8 hours ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

8 hours ago