Political News

కాంగ్రెస్‌ను లైట్ తీసుకుంటే క‌ష్ట‌మే!

ఏపీలో కూట‌మి పార్టీల‌కు కొత్త చిక్కు వ‌చ్చింది. వైసీపీని గ‌ద్దె నుంచి దించాల‌న్న ల‌క్ష్యంతో జ‌న‌సేన‌-టీడీపీ-బీజేపీలు జ‌త‌క‌ట్టాయి. ఓటు బ్యాంకు చీల‌కుండా చూడాల‌ని నిర్ణ‌యించాయి. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. అసంతృప్త జ్వాల‌లు ఎగిసి ప‌డినా.. కూట‌మిగానే ముందుకు సాగుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా.. లైన్‌లో ఉంది. ఏముందిలే.. అని ఈ పార్టీని లైట్ తీసుకుంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టికెట్లు, నిల‌బెట్టిన నాయ‌కుల‌ను గ‌మ‌నిస్తే.. లైట్ తీసుకునే అవ‌కాశం లేదు.

రాష్ట్ర వ్యాప్తంగా కాక‌పోయినా.. దాదాపు 50 నుంచి 70 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీక‌న్నా వ్య‌క్తుల బ‌ల‌మే ఎక్కువ‌గా ఉంది. వీరిప‌ట్ల ప్ర‌జ‌ల‌కు ఉన్న సానుభూతి.. ఇక్క‌డ ప్ర‌భావితం చూపించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో(ఎస్సీ) తాంతియా కుమారి కాంగ్రెస్‌ త‌ర‌ఫున పోటీచేస్తున్నారు. ఈమెకు బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఈమె తండ్రి మాజీ మంత్రి కోనేరు రంగారావు.. సానుభూతి ఆమెకు గెలిచేంత కాక‌పోయినా.. క‌నీసం 30 వేల వ‌ర‌కు ఓట్ల‌ను వేయిస్తుంది.

అదేవిధంగా శింగ‌న‌మ‌ల ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి సాకే శైల‌జానాథ్ బ‌రిలో ఉన్నారు. ఈయనకు కూడా సానుభూతి ఉంది. పార్టీ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. సాకేకు సొంత‌గా ఇక్క‌డ ఓటు బ్యాంకు ఉంది.. ఇది కూడా.. 25-35 వేల ఓట్ల‌ను ప్ర‌భావితం చేస్తుంది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి కిల్లి కృపారాణి రంగంలో ఉన్నారు. క‌ళింగ సామాజిక వ‌ర్గం ఓట్లు చీల్చ‌డంలో ఈమెను మించిన వారు లేర‌నే టాక్ అంద‌రికీ తెలిసిందే.

ఇది.. కూట‌మి అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న అచ్చెన్నాయుడిపై ప్ర‌భావం చూపించ‌నుంది. ఇక‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో కాంగ్రెస్ -వామ‌ప‌క్షాల పొత్తులోభాగంగా సీపీఎం నాయ‌కుడు చిగురుపాటి బాబూరావు బ‌రిలో ఉన్నారు. ఈయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనే 25 వేల ఓట్లు చీల్చి.. టీడీపీ అభ్య‌ర్థి ప‌రాజ‌యానికి ప‌రోక్షంగా కార‌ణ‌మ‌య్యారు. ఇప్పుడు మ‌రో 30 వేల వ‌ర‌కు ఈయ‌న ఓటు బ్యాంకు పెంచుకున్నారు. ఇది కూడా.. కూట‌మికి ఎఫెక్టే.

అదేవిధంగా బాప‌ట్ల ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. జేడీ శీలం, కాకినాడ ఎంపీగా బ‌రిలో ఉన్న ప‌ల్లంరాజు వంటివారు.. కూడా కూట‌మి ఓట్ల‌ను ప్ర‌భావితం చేయ‌డంలో ముందున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. వీరికి ఉన్న చ‌రిష్మా.. స్థానికంగా ఉన్న ఓటు బ్యాంకు వంటివి.. వీరి గెలుపున‌కు దోహ‌ద‌ప‌డ‌క‌పోయినా.. ఓట్ల‌ను చీల్చ‌డంలో మాత్రం.. ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపిస్తుంది. అదికూట‌మికే ఎఫెక్ట్ అవుతుంద‌నేది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

3 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

29 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

30 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

60 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago