పగిలే కొద్దీ గ్లాసు పదునెక్కుతుంది అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నుండి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయాడు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గెలవడం తప్పనిసరి పరిస్థితి. అయితే రాజకీయాలు అంటేనే ఎత్తులు, పై ఎత్తులు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ గెలుపుకు నవరంగ్ నేషనల్ కాంగ్రెస పార్టీ తలనొప్పిగా మారబోతుందా ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ప్రతి ఎన్నికల్లో రోడ్డు రోలర్, రోటీ మేకర్, ట్రక్కు గుర్తులు తలనొప్పిగా మారేవి. ఇవి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలి ఉండడమే దీనికి కారణం. అనేక ఎన్నికల్లో ఈ గుర్తుల మూలంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. అందుకే తెలంగాణలో ఆ గుర్తులు కేటాయించవద్దని ప్రతి సారి బీఆర్ఎస్ కోర్టులను, ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించడం పరిపాటిగా మారింది.
సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అదే పరిస్థితి ఎదురవుతున్నది. నవరంగ్ నేషనల్ కాంగ్రెస పార్టీ ఎన్నికల గుర్తు బకెట్. ఇది జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును పోలి ఉండడం ఇప్పుడు జనసేన పార్టీ శ్రేణులకు గుబులు రేపుతున్నది. జనసేనకు ఓటు వేయాలనుకున్నవారు గ్లాసు అనుకుని బకెట్ గుర్తుకు ఓటేస్తే పవన్ కళ్యాణ్ కు చిక్కులు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అసలే పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య. బకెట్ గుర్తుకు తోడు కొణిదెల పవన్ కళ్యాణ్ మాదిరిగా ఇంటి పేరు కె అక్షరం వచ్చే పలువురు పవన్ కళ్యాణ్ లను ఎన్నికల బరిలోకి దింపాలన్న ప్రయత్నాలు నడుస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో పిఠాపురం బరినుండి పవన్ గట్టెక్కుతాడా ? లేక బకెట్ తన్నేస్తాడా ? అన్నది వేచిచూడాలి.
This post was last modified on April 13, 2024 10:38 am
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…