హిందూపురంలో నందమూరి బాలకృష్ణకు తిరుగు లేదు.. ఈ సారి ఆయన హ్యాట్రిక్ కొట్టడం పక్కా.. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన టాపిక్. అధికార వైసీపీ ఏం చేసినా బాలయ్యను మాత్రం ఓడించలేదనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే వరుసగా మూడో సారి గెలిచేందుకు బాలయ్య రంగం సిద్ధం చేసుకుంటున్నారనే చెప్పాలి. హిందూపురం నియోజకవర్గం అంటే టీడీపీకి కంచు కోట. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఓడిపోయిన చరిత్రే లేదు. ఇక్కడ ఆ పార్టీకి ఉన్న బలం అలాంటిది.
2014 ఎన్నికల్లో ఇక్కడ భారీ విజయం సాధించిన బాలయ్య.. 2019లోనూ అదరగొట్టారు. జగన్ వేవ్ను దాటి మరీ హిందూపురంలో ఘన విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన విజయంపై ధీమాతో ఉన్నారు. త్వరలోనే ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ సారి బాలయ్యకు చెక్ పెట్టేందుకు వైసీపీ అన్ని ప్రయత్నాలూ చేస్తోందనే చెప్పాలి. అయితే అక్కడి వైసీపీలో అసంతృప్తితో పార్టీకి షాక్ తప్పేలా లేదు. హిందూపురంలో బాలయ్యను ఓడించే టాస్క్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. ఈ సారి అక్కడ అభ్యర్థిని వైసీపీ మార్చింది. హిందూపురానికి సంబంధం లేని దీపికారెడ్డికి టికెట్ కేటాయించింది.
దీపికారెడ్డికి టికెట్ ఇవ్వడం పట్ల హిందూపురంలోని వైసీపీ నాయకులు భగ్గుమన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఇక్బాల్ టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇక ఇతర వైసీపీ నాయకుల్లో ఒకరంటే మరొకరికి పడటం లేదు. ఈ నేపథ్యంలో దీపికరెడ్డికి కఠిన సవాళ్లు ఎదురవుతున్నాయనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పెద్దిరెడ్డి ఎంతగా కష్టపడ్డా, ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి బాలయ్య హ్యాట్రిక్ విజయం సాధించడమే కాదు మరింత మెజారిటీ దక్కించుకుంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 11, 2024 2:34 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…