రాయలసీమలోని ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు కలిశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. నంద్యాల, ఆళ్లగడ్డలో రాజకీయం అంటే భూమా కుటుంబం పేరే వినిపిస్తోంది. కానీ వీళ్లకు ప్రత్యర్థిగా ఇరిగెల కుటుంబం కూడా ఉండేది. కానీ ఇప్పుడు భూమా, ఇరిగెల వర్గాలు కలిసిపోయాయి. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియను గెలిపించేందుకు సిద్ధమయ్యాయి.
ఆళ్లగడ్డలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. దాడులు కూడా చేసుకున్నారనే చెబుతారు. 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి ఇరిగెల వర్గం మద్దతిచ్చింది. కానీ ఆ తర్వాత రాజకీయ విభేదాల కారణంగా వీళ్లు విడిపోయారు. అప్పటి నుంచి భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆ కుటుంబం మద్దతునిచ్చింది.
కానీ గత ఎన్నికల తర్వాత వైసీపీకి ఇరిగెల కుటుంబం దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇరిగెల బ్రదర్స్ జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ టికెట్ భూమా అఖిలప్రియకే దక్కింది. టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పొత్తు ధర్మంలో భాగంగా భూమా అఖిల ప్రియకు మద్దతుగా నిలిచేందుకు ఇరిగెల వర్గం ముందుకొచ్చింది. ఈ రెండు కుటుంబాలను కలపడంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఏదైతేనేం 33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు కలిశాయని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అఖిల ప్రియ విజయం కోసం పని చేస్తామని, నంద్యాల పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించుకుంటామని రాంపుల్లారెడ్డి చెప్పడం విశేషం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…