రాయలసీమలోని ఆళ్లగడ్డలో దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు కలిశాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. నంద్యాల, ఆళ్లగడ్డలో రాజకీయం అంటే భూమా కుటుంబం పేరే వినిపిస్తోంది. కానీ వీళ్లకు ప్రత్యర్థిగా ఇరిగెల కుటుంబం కూడా ఉండేది. కానీ ఇప్పుడు భూమా, ఇరిగెల వర్గాలు కలిసిపోయాయి. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియను గెలిపించేందుకు సిద్ధమయ్యాయి.
ఆళ్లగడ్డలో గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు వర్గాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచాయి. దాడులు కూడా చేసుకున్నారనే చెబుతారు. 1991లో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి ఇరిగెల వర్గం మద్దతిచ్చింది. కానీ ఆ తర్వాత రాజకీయ విభేదాల కారణంగా వీళ్లు విడిపోయారు. అప్పటి నుంచి భూమా కుటుంబానికి వ్యతిరేకంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు పోటీ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఆ కుటుంబం మద్దతునిచ్చింది.
కానీ గత ఎన్నికల తర్వాత వైసీపీకి ఇరిగెల కుటుంబం దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇరిగెల బ్రదర్స్ జనసేనలో చేరారు. ఆళ్లగడ్డ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆళ్లగడ్డ టికెట్ భూమా అఖిలప్రియకే దక్కింది. టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పొత్తు ధర్మంలో భాగంగా భూమా అఖిల ప్రియకు మద్దతుగా నిలిచేందుకు ఇరిగెల వర్గం ముందుకొచ్చింది. ఈ రెండు కుటుంబాలను కలపడంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఏదైతేనేం 33 ఏళ్ల తర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు కలిశాయని రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అఖిల ప్రియ విజయం కోసం పని చేస్తామని, నంద్యాల పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని గెలిపించుకుంటామని రాంపుల్లారెడ్డి చెప్పడం విశేషం.
This post was last modified on April 11, 2024 2:32 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…