Political News

ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు వ‌దిలి.. ఒక్క‌టిగా క‌దిలి

రాయ‌ల‌సీమ‌లోని ఆళ్ల‌గ‌డ్డ‌లో ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న రెండు కుటుంబాలు క‌లిశాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ అభ్య‌ర్థి గెలుపు కోసం క‌లిసి ప‌నిచేసేందుకు సిద్ధ‌మ‌య్యాయి. నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డలో రాజ‌కీయం అంటే భూమా కుటుంబం పేరే వినిపిస్తోంది. కానీ వీళ్ల‌కు ప్ర‌త్య‌ర్థిగా ఇరిగెల కుటుంబం కూడా ఉండేది. కానీ ఇప్పుడు భూమా, ఇరిగెల వ‌ర్గాలు క‌లిసిపోయాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో భూమా అఖిల ప్రియ‌ను గెలిపించేందుకు సిద్ధ‌మయ్యాయి.

ఆళ్ల‌గ‌డ్డ‌లో గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు న‌డిచాయి. దాడులు కూడా చేసుకున్నార‌నే చెబుతారు. 1991లో ఆళ్ల‌గ‌డ్డ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి ఇరిగెల వ‌ర్గం మ‌ద్ద‌తిచ్చింది. కానీ ఆ త‌ర్వాత రాజ‌కీయ విభేదాల కార‌ణంగా వీళ్లు విడిపోయారు. అప్ప‌టి నుంచి భూమా కుటుంబానికి వ్య‌తిరేకంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మూడు సార్లు పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి ఆ కుటుంబం మ‌ద్ద‌తునిచ్చింది.

కానీ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీకి ఇరిగెల కుటుంబం దూరమ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే ఇరిగెల బ్ర‌ద‌ర్స్ జ‌న‌సేన‌లో చేరారు. ఆళ్ల‌గ‌డ్డ టికెట్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. కానీ పొత్తులో భాగంగా ఆళ్ల‌గ‌డ్డ టికెట్ భూమా అఖిల‌ప్రియ‌కే ద‌క్కింది. టీడీపీ త‌ర‌పున పోటీ చేసేందుకు ఆమె సిద్ధ‌మ‌య్యారు. దీంతో పొత్తు ధ‌ర్మంలో భాగంగా భూమా అఖిల ప్రియ‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ఇరిగెల వ‌ర్గం ముందుకొచ్చింది. ఈ రెండు కుటుంబాల‌ను క‌ల‌ప‌డంలో బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కీల‌క పాత్ర పోషించారని తెలిసింది. ఏదైతేనేం 33 ఏళ్ల త‌ర్వాత భూమా, ఇరిగెల కుటుంబాలు క‌లిశాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అఖిల ప్రియ విజయం కోసం ప‌ని చేస్తామ‌ని, నంద్యాల పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్య‌ర్థి బైరెడ్డి శ‌బ‌రిని గెలిపించుకుంటామ‌ని రాంపుల్లారెడ్డి చెప్ప‌డం విశేషం.

This post was last modified on April 11, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

1 hour ago

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

3 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

4 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

5 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

5 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

6 hours ago