Political News

నాడు అన్నాక్యాంటీన్లు.. నేడు వ‌లంటీర్లు!

కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల వ‌ల‌కు టీడీపీ చిక్కుకుంటోంద‌నే వాద‌న వినిపిస్తోంది. స‌హ‌జంగానే ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. ఒక దానిని ఒక‌టి డైల్యూట్ చేసుకునేలా రాజ‌కీయాలు చేస్తుంటాయి. ఇవి కామ‌న్‌. అందుకే రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. స్పందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌ల్పించేలా చేయ‌డం వంటివి రాజ‌కీయంగా ఎప్పుడూ తెర‌మీదికి వ‌స్తుంటాయి. అయితే.. ఇలాంటి స‌మ‌యంలో కాస్త సంయ‌మ నం పాటించి.. ప్ర‌త్య‌ర్థుల ఉచ్చులో చిక్కుకోకుండా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో చంద్ర‌బాబు తొంద‌ర‌ప‌డుతున్నారు.

గత 2019లో జ‌రిగిన అసెంబ్లీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధికారంలో ఉంది. ఈ స‌మ‌యం లో అన్నా క్యాంటీన్ల వ్య‌వ‌హారాన్ని టీడీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు. అప్ప‌టికి ఆరు మాసాల ముందు మాత్ర‌మే క్యాంటీన్ల‌ను తెరిచిన నేప‌థ్యంలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. అన్నా క్యాంటీన్లు ఉండ‌వ‌ని.. పేద‌లు ఆక‌లితో మాడి పోతార‌ని.. టీడీపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. ఎందుకంటే.. రూ.5 కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్నాం, రాత్రి భోజ‌నం అందించాయి.

ఇది ప్ర‌జ‌ల‌కు బాగానే క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా రోజు వారి ప‌నులు చేసుకునే కార్మికుల‌కు, ఆటో డ్రైవ‌ర్ల కు, నిరుద్యోగుల‌కు, విద్యార్థుల‌కు.. ఉద్యోగుల‌కు కూడా అన్నక్యాంటీన్లు చేరువ‌య్యాయి. దీనిని టీడీపీ కార్న‌ర్ చేస్తూ.. ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి తీసుకుంది. అయితే.. ఎంత రెచ్చ‌గొట్టినా.. వైసీపీ అన్నాక్యాంటీన్ల జోలికి మాత్రం పోలేదు. ఉంచుతామ‌ని కానీ, తీసేస్తామ‌ని కానీ, చెప్ప‌లేదు. ఒక‌రిద్ద‌రు మాత్రం ఉంచుతామ‌ని చెప్పినా.. దీనిపై పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌మాట మాట్లాడ‌లేదు.

ఇక‌, అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అన్నా క్యాంటీన్ల‌ను మూసేయించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ్య‌వ‌హారంలో వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. తాము లేక‌పోతే..ఈ వ్య‌వ‌స్థ ఉండ‌ద‌ని.. చంద్ర‌బాబు అధికారంలోకివ‌స్తే.. మూసేస్తార‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌చారంలోకి తెచ్చారు. దీంతో ఆదుర్దా ప‌డిన చంద్ర‌బాబు వెంట‌నే రియాక్ట్ అయిపోయారు. తాము వ‌చ్చినప్ప‌టికీ.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఉంటుంద‌ని.. వారి జీతాల‌ను రూ.10 ల‌కు పెంచుతామ‌ని చెప్పారు.

అయితే.. ఇది మంచిదే క‌దా! అని అనుకోవ‌చ్చు. కానీ, ఇక్క‌డే వైసీపీ యాంటీ ప్ర‌చారం చేస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. ఫ‌లితంగా … చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న ల కంటే కూడా.. గ‌తంలో చేసిన విమ‌ర్శ‌లే ఇప్పుడు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. దీంతో చంద్ర‌బాబు ఇమే జ్‌పై మ‌రోసారి ఇబ్బందులు వ‌చ్చాయి. అస‌లు ఆయ‌న స్పందించ‌కుండా ఉండి ఉంటే స‌రిపోయేది క‌దా! అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

This post was last modified on April 10, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

12 minutes ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

2 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

4 hours ago

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

7 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

10 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

12 hours ago