Political News

నాడు అన్నాక్యాంటీన్లు.. నేడు వ‌లంటీర్లు!

కీల‌క‌మైన ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల వ‌ల‌కు టీడీపీ చిక్కుకుంటోంద‌నే వాద‌న వినిపిస్తోంది. స‌హ‌జంగానే ప్ర‌త్య‌ర్థి పార్టీలు.. ఒక దానిని ఒక‌టి డైల్యూట్ చేసుకునేలా రాజ‌కీయాలు చేస్తుంటాయి. ఇవి కామ‌న్‌. అందుకే రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రించ‌డం.. స్పందించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌ల్పించేలా చేయ‌డం వంటివి రాజ‌కీయంగా ఎప్పుడూ తెర‌మీదికి వ‌స్తుంటాయి. అయితే.. ఇలాంటి స‌మ‌యంలో కాస్త సంయ‌మ నం పాటించి.. ప్ర‌త్య‌ర్థుల ఉచ్చులో చిక్కుకోకుండా.. నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. కానీ, ఈ విష‌యంలో చంద్ర‌బాబు తొంద‌ర‌ప‌డుతున్నారు.

గత 2019లో జ‌రిగిన అసెంబ్లీ.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధికారంలో ఉంది. ఈ స‌మ‌యం లో అన్నా క్యాంటీన్ల వ్య‌వ‌హారాన్ని టీడీపీ నాయ‌కులు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేశారు. అప్ప‌టికి ఆరు మాసాల ముందు మాత్ర‌మే క్యాంటీన్ల‌ను తెరిచిన నేప‌థ్యంలో వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. అన్నా క్యాంటీన్లు ఉండ‌వ‌ని.. పేద‌లు ఆక‌లితో మాడి పోతార‌ని.. టీడీపీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. ఎందుకంటే.. రూ.5 కే ఉద‌యం టిఫిన్‌, రూ.5కే మ‌ధ్యాహ్నాం, రాత్రి భోజ‌నం అందించాయి.

ఇది ప్ర‌జ‌ల‌కు బాగానే క‌నెక్ట్ అయింది. ముఖ్యంగా రోజు వారి ప‌నులు చేసుకునే కార్మికుల‌కు, ఆటో డ్రైవ‌ర్ల కు, నిరుద్యోగుల‌కు, విద్యార్థుల‌కు.. ఉద్యోగుల‌కు కూడా అన్నక్యాంటీన్లు చేరువ‌య్యాయి. దీనిని టీడీపీ కార్న‌ర్ చేస్తూ.. ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి తీసుకుంది. అయితే.. ఎంత రెచ్చ‌గొట్టినా.. వైసీపీ అన్నాక్యాంటీన్ల జోలికి మాత్రం పోలేదు. ఉంచుతామ‌ని కానీ, తీసేస్తామ‌ని కానీ, చెప్ప‌లేదు. ఒక‌రిద్ద‌రు మాత్రం ఉంచుతామ‌ని చెప్పినా.. దీనిపై పార్టీ అధినేత జ‌గ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌మాట మాట్లాడ‌లేదు.

ఇక‌, అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. అన్నా క్యాంటీన్ల‌ను మూసేయించారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ్య‌వ‌హారంలో వైసీపీ ప్ర‌చారం చేస్తోంది. తాము లేక‌పోతే..ఈ వ్య‌వ‌స్థ ఉండ‌ద‌ని.. చంద్ర‌బాబు అధికారంలోకివ‌స్తే.. మూసేస్తార‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌చారంలోకి తెచ్చారు. దీంతో ఆదుర్దా ప‌డిన చంద్ర‌బాబు వెంట‌నే రియాక్ట్ అయిపోయారు. తాము వ‌చ్చినప్ప‌టికీ.. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ఉంటుంద‌ని.. వారి జీతాల‌ను రూ.10 ల‌కు పెంచుతామ‌ని చెప్పారు.

అయితే.. ఇది మంచిదే క‌దా! అని అనుకోవ‌చ్చు. కానీ, ఇక్క‌డే వైసీపీ యాంటీ ప్ర‌చారం చేస్తోంది. గ‌తంలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను విస్తృతంగా ప్ర‌చారం చేస్తోంది. ఫ‌లితంగా … చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న ల కంటే కూడా.. గ‌తంలో చేసిన విమ‌ర్శ‌లే ఇప్పుడు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. దీంతో చంద్ర‌బాబు ఇమే జ్‌పై మ‌రోసారి ఇబ్బందులు వ‌చ్చాయి. అస‌లు ఆయ‌న స్పందించ‌కుండా ఉండి ఉంటే స‌రిపోయేది క‌దా! అంటున్నారు టీడీపీ నాయ‌కులు.

This post was last modified on April 10, 2024 3:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

37 minutes ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

37 minutes ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

2 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

2 hours ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

2 hours ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

2 hours ago