Political News

విరాళాల కోసం బాబు వినతి… ఇదే వెబ్ సైట్

ప్రస్తుత ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుల కోసం పార్టీకి విరాళాలు ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. కుల, మ‌త ప్రాతాలకు అతీతంగా ప్ర‌తి ఒక్క‌రూ ఈ మ‌హా య‌జ్ఞంలో పాలు పంచుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడి నుంచి కాపాడేందుకు తాము చేస్తున్న ప్ర‌య‌త్నానికి ఇతోధికంగా సాయం చేయాల‌ని ఆయ‌న కోరారు. కార్మికుడి నుంచి క‌ర్ష‌కుడి వ‌ర‌కు, ఉద్యోగి నుంచి పారిశ్రామిక వేత్త వ‌ర‌కు ప్ర‌తిఒక్క‌రూ క‌దిలి రావాల‌ని చంద్ర‌బాబు సూచించారు. పార్టీకి ఇచ్చే విరాళం .. తెలుగు నేల‌కు ఇస్తున్న‌ట్టేన‌ని.. తెలుగు జాతిని సంర‌క్షించేందుకు ఇస్తున్న‌ట్టేన‌ని ఆయ‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు టీడీపీ విరాళాల సేక‌ర‌ణ కోసం ప్ర‌త్యేకంగా ఒక వెబ్ సైట్‌ను ప్రారంభించారు. (https://tdpforandhra.com) టీడీపీఫ‌ర్ ఆంధ్రా.కామ్ ద్వారా ప్రాంతాల‌కు అతీతంగా ఎక్క‌డ నుంచి అయినా.. పార్టీకి విరాళాలు ఇవ్వ‌వ‌చ్చ‌న్నారు. రూ.100 నుంచి ఎంతైనా విరాళం ఇచ్చి.. తెలుగు జాతి అభ్యున్న‌తికి కృషి చేయాల‌ని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. విరాళాలు ఇచ్చేవారికి అకౌంట‌బిలిటీ ఉంటుంద‌న్నారు. ఎంత మొత్తం విరాళంగా ఇచ్చినా ర‌సీదులు ఇస్తామ‌న్నారు. దీనిని 80సీ కింద క్లెయిమ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. కాగా, తొలి చందాగా..చంద్ర‌బాబు రూపాయి త‌క్కువ రూ.ల‌క్ష పార్టీకి ఇచ్చారు.

వైసీపీపై విమ‌ర్శ‌లు

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు అధికార పార్టీ వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అధికారికంగా విరాళాలు సేక‌రిస్తున్నామ న్నారు. అంతా వైట్ మ‌నీనే తీసుకుంటున్నామ‌ని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం బ్లాక్ మ‌నీని కూడా విరాళంగా తీసుకుం టోంద‌ని తెలిపారు. పేకాట క్ల‌బ్బులు, గుర్ర‌పు పందేల క్ల‌బ్బులు, క్యాసినోల నుంచి కూడా వైసీపీ దొడ్డిదారిలో విరాళాలు సేక‌రిస్తోం ద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. గ్యాంబ్లింగ్ వాళ్ల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేక‌రించిన వైసీపీ.. దీనిని ఏకంగా అధికారికం చేసేందుకు ప్ర‌య‌త్నించింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. కాగా, అమెరికా స‌హా ప్ర‌పంచంలో ఎక్క‌డ ఉన్న‌వారైనా టీడీపీకి విరాళాలు ఇవ్వ‌వ‌చ్చ‌ని చంద్ర‌బాబు సూచించారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago