ప్రస్తుత ఎన్నికల్లో ఖర్చుల కోసం పార్టీకి విరాళాలు ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుల, మత ప్రాతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహా యజ్ఞంలో పాలు పంచుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఒక దుర్మార్గుడి నుంచి కాపాడేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి ఇతోధికంగా సాయం చేయాలని ఆయన కోరారు. కార్మికుడి నుంచి కర్షకుడి వరకు, ఉద్యోగి నుంచి పారిశ్రామిక వేత్త వరకు ప్రతిఒక్కరూ కదిలి రావాలని చంద్రబాబు సూచించారు. పార్టీకి ఇచ్చే విరాళం .. తెలుగు నేలకు ఇస్తున్నట్టేనని.. తెలుగు జాతిని సంరక్షించేందుకు ఇస్తున్నట్టేనని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు టీడీపీ విరాళాల సేకరణ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ను ప్రారంభించారు. (https://tdpforandhra.com) టీడీపీఫర్ ఆంధ్రా.కామ్ ద్వారా ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ నుంచి అయినా.. పార్టీకి విరాళాలు ఇవ్వవచ్చన్నారు. రూ.100 నుంచి ఎంతైనా విరాళం ఇచ్చి.. తెలుగు జాతి అభ్యున్నతికి కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విరాళాలు ఇచ్చేవారికి అకౌంటబిలిటీ ఉంటుందన్నారు. ఎంత మొత్తం విరాళంగా ఇచ్చినా రసీదులు ఇస్తామన్నారు. దీనిని 80సీ కింద క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కాగా, తొలి చందాగా..చంద్రబాబు రూపాయి తక్కువ రూ.లక్ష పార్టీకి ఇచ్చారు.
వైసీపీపై విమర్శలు
ఈ సందర్భంగా చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై విమర్శలు గుప్పించారు. తాము అధికారికంగా విరాళాలు సేకరిస్తున్నామ న్నారు. అంతా వైట్ మనీనే తీసుకుంటున్నామని తెలిపారు. అయితే.. వైసీపీ మాత్రం బ్లాక్ మనీని కూడా విరాళంగా తీసుకుం టోందని తెలిపారు. పేకాట క్లబ్బులు, గుర్రపు పందేల క్లబ్బులు, క్యాసినోల నుంచి కూడా వైసీపీ దొడ్డిదారిలో విరాళాలు సేకరిస్తోం దని చంద్రబాబు దుయ్యబట్టారు. గ్యాంబ్లింగ్ వాళ్ల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించిన వైసీపీ.. దీనిని ఏకంగా అధికారికం చేసేందుకు ప్రయత్నించిందని విమర్శలు గుప్పించారు. కాగా, అమెరికా సహా ప్రపంచంలో ఎక్కడ ఉన్నవారైనా టీడీపీకి విరాళాలు ఇవ్వవచ్చని చంద్రబాబు సూచించారు.
This post was last modified on April 9, 2024 9:52 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…