ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దూకుడు చూపిస్తున్నారు. న్యాయ యాత్ర పేరుతో బస్సులో పర్యటిస్తున్న ఆమె ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలో వైసీసీ సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిపై విజయమే లక్ష్యంగా పోరాడుతున్నారు. ముఖ్యంగా చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళుతూ.. అవినాష్, సీఎం జగన్పై షర్మిల తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిల జోరు వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కష్టపడ్డ రేవంత్ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు సీఎంగా సాగుతున్నారు. ఇప్పుడు ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకునేలా, వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపేలా షర్మిలతో రేవంత్ మంతనాలు జరుపుతున్నట్లు టాక్. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైసీసీ అధినేత, సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని సాగుతున్నారు. తన అన్న అయినప్పటికీ ప్రజలకు జగన్ చేసిందేమీ లేదంటూ ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ను కాపాడుతున్న జగన్ వైఖరిని షర్మిల ఎండగడుతున్నారు. హత్య వెనుక ఉన్నది అవినాష్ అంటూ, అండగా నిలుస్తోంది జగన్ అని షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే షర్మిల అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికల్లోనూ రేవంత్ పాత్ర ఉందని తెలుస్తోంది. ఎప్పటికప్పుడూ షర్మిలకు రేవంత్ సూచనలు ఇస్తున్నట్లు టాక్. మరి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
This post was last modified on April 8, 2024 2:03 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…