Political News

ఆర్ఆర్ఆర్ తుల‌సి మొక్కే.. పార్ల‌మెంటే చెప్పింది!

వైసీపీ రెబ‌ల్ ఎంపీగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం పొందిన న‌రసాపురం పార్ల‌మెంటు స‌భ్యుడు క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ రాజు.. త‌న‌ను తాను.. గంజాయి వ‌నంలో తుల‌సి మొక్కని అని ప‌దే ప‌దే చెప్పుకొన్నారు. వైసీపీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన 22 మంది ఎంపీలో తాను ఒకడిని కాద‌ని.. తాను ప్ర‌త్యేక‌మ‌ని చెప్పుకొనేవారు. అయితే.. దీనిని కొంద‌రు యాక్సెప్ట్ చేసేవారు.. మ‌రికొంద‌రు తోసిపుచ్చేవారు. అయితే.. ఇప్పుడు పార్ల‌మెంటు రికార్డులు.. ఆర్ ఆర్ ఆర్‌ను ఆకాశానికి ఎత్తేశాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి పార్ల‌మెంటుకు ఎన్నికైన 25 మంది ఎంపీల్లో ఆర్ ఆర్ ఆర్‌.. నెంబ‌ర్ 1 పొజిష‌న్‌లో ఉన్నార‌ని.. పార్ల‌మెంటు స్ప‌ష్టం చేసింది. తాజాగా ఈ ఐదేళ్ల కాలంలో ఎంపీల పెర‌ఫార్మెన్స్‌, పార్లమెంటు కు హాజ‌రైన ప‌నిదినాలు వంటివాటి వివ‌రాల‌ను రాష్ట్రాల వారీగా పార్ల‌మెంటు స‌చివాల‌యం విడుద‌ల చేసింది. దీంతో ఏపీ నుంచి ఆర్ ఆర్ ఆర్ ఒక్క‌రే 98 శాతం అటెండెన్స్‌తో తొలి స్థానంలో నిలిచారు. ఆయ‌న కేవ‌లం రెండు సంద‌ర్భాల్లో మాత్ర‌మే స‌భ‌ల‌కు హాజ‌రు కాలేక పోయార‌ని తెలిపింది.

అంతేకాదు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌ర్వాత‌.. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన ఎంపీల్లోనూ ఆయ‌నే ముందు వ‌రుస‌లో రికార్డు స్థాయి అటెండెన్సును, పెర‌ఫార్మెన్సును సొంతం చేసుకున్నార‌ని పార్ల‌మెంటు స‌చివాల‌యం స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఆర్ ఆర్ ఆర్ త‌ర్వాత‌.. రెండో స్థానంలో గుంటూరు ఎంపీ(టీడీపీని వ‌దిలేశారు) గ‌ల్లా జ‌య‌దేవ్ రెండో స్థానంలో ఉన్న‌ట్టు పార్ల‌మెంటు నివేదిక స్ప‌ష్టం చేసింది. ఈయ‌న 87 శాతం అటెండెన్స్‌తో రెండో ప్లేస్‌లో ఉన్నార‌ని తెలిపింది.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున నిప్పులు చెరిగి.. విప‌క్షాల‌పై విమ‌ర్శ‌లు గుప్పించే బాప‌ట్ల ఎంపీ నందిగం సురేష్ చిట్ట‌చివ‌రి స్థానంలో ఉన్నార‌ని పార్ల‌మెంటు తెలిపింది. ఈయ‌న హాజ‌రు శాతం కేవ‌లం 35 శాతంగా ఉంద‌ని పార్ల‌మెంటు పేర్కొంది. ఇక‌, 22 మంది వైసీపీ ఎంపీల్లో గొట్టేటి మాధ‌వి(అర‌కు) మాత్రం మూడో స్థానంలో ఉన్నార‌ని తెలిపింది. ఈమె 86 శాతం అటెండెన్సును సొంతం చేసుకున్నారు. పిఠాపురం నుంచి ప‌వ‌న్‌పై పోటీ చేస్తున్న కాకినాడ ఎంపీ వంగా గీత 85 శాతం అటెండెన్సు సొంతం చేసుకున్నారు. విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేశినేని నాని హాజ‌రు శాతం 81 శాతంగా ఉంద‌ని పార్ల‌మెంటు పేర్కొంది. ఇక‌, వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి హాజ‌రు శాతం 42 శాతం గా ఉంద‌ని పార్ల‌మెంటు తెలిపింది.

This post was last modified on April 8, 2024 2:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

టాక్సిక్ అయోమయం ఇంకొకరికి వరం

కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…

10 minutes ago

నానిని టార్గెట్ చేయడం రైటేనా

సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…

3 hours ago

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…

4 hours ago

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

4 hours ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

5 hours ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

8 hours ago