Political News

ఏపీ సీఐడీ కీల‌క ప‌త్రాల ద‌హ‌నం..!

ఏపీ సీఐడీకి చెందిన కీల‌క అధికారి ఒక‌రు స్వ‌యంగా కొన్ని ప‌త్రాల‌ను ద‌గ్గ‌రుండి మ‌రీ ద‌హ‌నం చేస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ గ‌త నాలుగేళ్ల‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్రంగానే ప‌నిచేసింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. వారిని అరెస్టు చేసేందుకు ఏవేవో కేసుల‌ను త‌వ్వి తీశార‌ని అప్ప‌ట్లో టీడీపీ కూడా విమ‌ర్శ‌లు గుప్పించింది.

ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబుపై కేసులు బ‌నాయించి.. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం 53 రోజులు రాజ‌మండ్రి జైల్లో ఉంచ‌డం తెలిసిందే. అయితే, కోర్టుల జోక్యంతో ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. ఇక‌, నారా లోకేష్‌పై హెరిటేజ్ కేసులు, ఫైబ‌ర్ నెట్ కేసులు ప‌రిశోధ‌న‌ల జాబితాలో ఉన్నాయి. ఇప్ప‌టికి రెండు మూడు సార్లు లోకేష్ను కూడా విచారించారు. అరెస్టు చేస్తార‌నే చ‌ర్చ కూడా సాగింది. అయితే.. ఆయ‌న‌ను అరెస్టు చేయ‌లేదు.

ఇక‌, ఇప్పుడు సీఐడీ సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలను ఒక అధికారి ద‌హ‌నం చేస్తుండ‌డం.. నిప్పు రాజేయ‌డం.. ద‌గ్గ‌ర‌కు ఎవ‌రినీ రాకుండా.. జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం చూస్తే.. వీటి వెనుక ఏదో కుట్ర జ‌రుగుతోంద‌ని రాజ‌కీయ పార్టీలు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నాయి. గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు, న‌కిలీ ప‌త్రాల‌ను బయట పడకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పత్రాల తగలబెట్టే వ్యవహారం చేస్తున్నార‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఇక‌, ఇవ‌న్నీ.. సీఐడీ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో జ‌రుగుతున్నాయ‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ప‌త్రాల ద‌హ‌నం.. రాష్ట్రంలో సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఎన్నిక‌ల‌కు ముందు ఇది ఎలాంటి దారి మ‌ళ్లిస్తుందో చూడాలి.

This post was last modified on April 8, 2024 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

42 minutes ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

4 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

5 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago