ఏపీ సీఐడీకి చెందిన కీలక అధికారి ఒకరు స్వయంగా కొన్ని పత్రాలను దగ్గరుండి మరీ దహనం చేస్తున్న దృశ్యాలు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో తీవ్ర సంచలనం చోటు చేసుకుంది. ఏపీ సీఐడీ గత నాలుగేళ్లలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ కేంద్రంగానే పనిచేసిందనే విమర్శలు వున్నాయి. వారిని అరెస్టు చేసేందుకు ఏవేవో కేసులను తవ్వి తీశారని అప్పట్లో టీడీపీ కూడా విమర్శలు గుప్పించింది.
ఈ క్రమంలోనే చంద్రబాబుపై కేసులు బనాయించి.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనను అరెస్టు చేయడం 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉంచడం తెలిసిందే. అయితే, కోర్టుల జోక్యంతో ఎన్నికలకు ముందు ఆయనకు బెయిల్ లభించింది. ఇక, నారా లోకేష్పై హెరిటేజ్ కేసులు, ఫైబర్ నెట్ కేసులు పరిశోధనల జాబితాలో ఉన్నాయి. ఇప్పటికి రెండు మూడు సార్లు లోకేష్ను కూడా విచారించారు. అరెస్టు చేస్తారనే చర్చ కూడా సాగింది. అయితే.. ఆయనను అరెస్టు చేయలేదు.
ఇక, ఇప్పుడు సీఐడీ సిట్ కార్యాలయం వద్ద ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్ హెరిటేజ్ ఫుడ్స్ పత్రాలను ఒక అధికారి దహనం చేస్తుండడం.. నిప్పు రాజేయడం.. దగ్గరకు ఎవరినీ రాకుండా.. జాగ్రత్తలు తీసుకోవడం చూస్తే.. వీటి వెనుక ఏదో కుట్ర జరుగుతోందని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గతంలో సృష్టించిన నకిలీ ఆధారాలు, నకిలీ పత్రాలను బయట పడకుండా ఉన్నతాధికారుల ఆదేశాలతో పత్రాల తగలబెట్టే వ్యవహారం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక, ఇవన్నీ.. సీఐడీ ఉన్నతాధికారి కొల్లి రఘురామిరెడ్డి ఆదేశాలతో జరుగుతున్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి ఈ పత్రాల దహనం.. రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరి ఎన్నికలకు ముందు ఇది ఎలాంటి దారి మళ్లిస్తుందో చూడాలి.
This post was last modified on April 8, 2024 1:59 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…