కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. శపథం నెరవేర్చుకున్నారు. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. అవును.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానన్న ఆయన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్లో చేరిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇప్పుడు ఇది కూడా చేజారిపోయింది.
బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి ఇప్పుడు అనుకున్నది సాధించారు. గత తెలంగాణ ఎన్నికలకు ముందు ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ లీడర్ను అసెంబ్లీ గేటు తాకనీయనని పొంగులేటి శపథం చేశారు. ఆ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. దీంతో అక్కడ ఉన్న 10 నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్ గెలిచింది. ఒకటేమో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న సీపీఐ సొంతం చేసుకుంది. ఇక భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలిచారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తెల్లంను కాంగ్రెస్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన పొంగులేటి అనుకున్నది సాధించారు.
నిజానికి పొంగులేటి అనుచరుడైన తెల్లం వెంకట్రావు కూడా ఆయనతో పాటు మొదట కాంగ్రెస్లో చేరారు. కానీ భద్రాచలం కాంగ్రెస్ టికెట్ పోదెం వీరయ్యకు ఇవ్వడంతో తెల్లం తిరిగి బీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి నుంచే కాంగ్రెస్లో చేరేందుకు తెల్లం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు పార్టీ మారారు. అయితే పార్టీ క్యాడర్లో విశ్వాసం నింపి, కార్యకర్తలు, నాయకులు జంప్ కాకుండా చూడటంలో కేసీఆర్ విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ క్రమంగా ఖాళీ అవుతుండటమే అందుకు రుజువని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:29 pm
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…
తమిళనాడులో ఒక రోజు స్ట్రైక్ చేయడానికి నిర్మాతలు పిలుపు ఇవ్వడం అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోలు…
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…