కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. శపథం నెరవేర్చుకున్నారు. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. అవును.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానన్న ఆయన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్లో చేరిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇప్పుడు ఇది కూడా చేజారిపోయింది.
బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి ఇప్పుడు అనుకున్నది సాధించారు. గత తెలంగాణ ఎన్నికలకు ముందు ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ లీడర్ను అసెంబ్లీ గేటు తాకనీయనని పొంగులేటి శపథం చేశారు. ఆ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. దీంతో అక్కడ ఉన్న 10 నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్ గెలిచింది. ఒకటేమో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న సీపీఐ సొంతం చేసుకుంది. ఇక భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలిచారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తెల్లంను కాంగ్రెస్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన పొంగులేటి అనుకున్నది సాధించారు.
నిజానికి పొంగులేటి అనుచరుడైన తెల్లం వెంకట్రావు కూడా ఆయనతో పాటు మొదట కాంగ్రెస్లో చేరారు. కానీ భద్రాచలం కాంగ్రెస్ టికెట్ పోదెం వీరయ్యకు ఇవ్వడంతో తెల్లం తిరిగి బీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి నుంచే కాంగ్రెస్లో చేరేందుకు తెల్లం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు పార్టీ మారారు. అయితే పార్టీ క్యాడర్లో విశ్వాసం నింపి, కార్యకర్తలు, నాయకులు జంప్ కాకుండా చూడటంలో కేసీఆర్ విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ క్రమంగా ఖాళీ అవుతుండటమే అందుకు రుజువని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:29 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…