కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. శపథం నెరవేర్చుకున్నారు. కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకున్నారు. అవును.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను ఖాళీ చేస్తానన్న ఆయన మాటలు ఇప్పుడు నిజమయ్యాయి. ఇప్పుడు ఖమ్మంలో బీఆర్ఎస్కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున భద్రాచలంలో గెలిచిన తెల్లం వెంకట్రావు తాజాగా కాంగ్రెస్లో చేరిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు ఇదే. ఇప్పుడు ఇది కూడా చేజారిపోయింది.
బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని, కేసీఆర్ పై కోపంతో కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి ఇప్పుడు అనుకున్నది సాధించారు. గత తెలంగాణ ఎన్నికలకు ముందు ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ లీడర్ను అసెంబ్లీ గేటు తాకనీయనని పొంగులేటి శపథం చేశారు. ఆ ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. దీంతో అక్కడ ఉన్న 10 నియోజకవర్గాల్లో 8 కాంగ్రెస్ గెలిచింది. ఒకటేమో కాంగ్రెస్తో పొత్తులో ఉన్న సీపీఐ సొంతం చేసుకుంది. ఇక భద్రాచలంలో తెల్లం వెంకట్రావు గెలిచారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తెల్లంను కాంగ్రెస్లోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన పొంగులేటి అనుకున్నది సాధించారు.
నిజానికి పొంగులేటి అనుచరుడైన తెల్లం వెంకట్రావు కూడా ఆయనతో పాటు మొదట కాంగ్రెస్లో చేరారు. కానీ భద్రాచలం కాంగ్రెస్ టికెట్ పోదెం వీరయ్యకు ఇవ్వడంతో తెల్లం తిరిగి బీఆర్ఎస్ లో చేరి పోటీ చేసి గెలిచారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోవడంతో అప్పటి నుంచే కాంగ్రెస్లో చేరేందుకు తెల్లం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు పార్టీ మారారు. అయితే పార్టీ క్యాడర్లో విశ్వాసం నింపి, కార్యకర్తలు, నాయకులు జంప్ కాకుండా చూడటంలో కేసీఆర్ విఫలమవుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ క్రమంగా ఖాళీ అవుతుండటమే అందుకు రుజువని విశ్లేషకులు చెబుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:29 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…