Political News

ప్లాన్ బి : బాబు – పవన్ జంటగా సభలు

సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. షెడ్యూల్ విడులకు కొద్ది నెలల ముందే ఏపీలో రాజకీయం ఎంతలా రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనంతనే అధికార.. విపక్ష అధినేతలతో సహా ముఖ్యనేతలంతా వరుస పెట్టి సభల్ని నిర్వహిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మాటలతో మరింత మంట పుట్టేలా చేస్తున్నారు. ఏపీ అధికార పక్షం ఒంటరిగా పోటీ చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో బీజేపీ.. జనసేనలు కలిసి కూటమిగా మారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కూటమి మధ్య పొత్తు కుదిరిన తర్వాత తమ తొలి బహిరంగ సభను చిలకలూరిపేటలో నిర్వహించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధులంతా హాజరయ్యారు. అయితే.. ఈ సభ ద్వారా ఆశించినంత మైలేజీ కూటమికి రాలేదన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ఎవరికి వారుగా మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఎవరికి వారుగా సభల్ని నిర్వహిస్తున్నారు. సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్నారు.

అయితే.. ఇలా ఒక్కొక్కరిగా ప్రచారం చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని.. మైలేజీని మరింత పెంచేందుకు వీలుగా ఇప్పుడు అనుసరిస్తున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి సభలకు హాజరవుతారని చెబుతున్నారు. సింగిల్ గా ప్రచారం కంటే కూడా కలిసి ప్రచారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఎన్నికలు అధికార పక్షానికి మాత్రమే కాదు విపక్షాలకు అత్యంత కీలకం కావటంతో ప్రచారం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు.. పవన్ లు నిర్వహిస్తున్న సభలకు ఆశించినంతగా స్పందన లేదంటున్నారు. ఆశించినంత ఎఫెక్టు రాకపోవటమే కాదు.. సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలకు భారీగా ప్రజలు వస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. అందుకే.. సింగిల్ గా కాకుండా జంటగా కలిసి ప్రచారం చేయటం ద్వారా ఓటర్లకు మరింత దగ్గర కావొచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. మరెప్పుడు ఆ నిర్ణయం బయటకు వస్తుందో చూడాలి.

This post was last modified on April 8, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

3 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago