సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. షెడ్యూల్ విడులకు కొద్ది నెలల ముందే ఏపీలో రాజకీయం ఎంతలా రాజుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనంతనే అధికార.. విపక్ష అధినేతలతో సహా ముఖ్యనేతలంతా వరుస పెట్టి సభల్ని నిర్వహిస్తూ.. నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. తమ మాటలతో మరింత మంట పుట్టేలా చేస్తున్నారు. ఏపీ అధికార పక్షం ఒంటరిగా పోటీ చేస్తుంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో బీజేపీ.. జనసేనలు కలిసి కూటమిగా మారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
కూటమి మధ్య పొత్తు కుదిరిన తర్వాత తమ తొలి బహిరంగ సభను చిలకలూరిపేటలో నిర్వహించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అతిరథ మహారధులంతా హాజరయ్యారు. అయితే.. ఈ సభ ద్వారా ఆశించినంత మైలేజీ కూటమికి రాలేదన్న వాదన వినిపిస్తోంది. ఆ తర్వాత నుంచి ఎవరికి వారుగా మూడు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఎవరికి వారుగా సభల్ని నిర్వహిస్తున్నారు. సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్నారు.
అయితే.. ఇలా ఒక్కొక్కరిగా ప్రచారం చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండటం లేదని.. మైలేజీని మరింత పెంచేందుకు వీలుగా ఇప్పుడు అనుసరిస్తున్న ప్లాన్ లో కొన్ని మార్పులు చేయాలన్న ఆలోచనకు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు.. పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి సభలకు హాజరవుతారని చెబుతున్నారు. సింగిల్ గా ప్రచారం కంటే కూడా కలిసి ప్రచారం చేస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ ఎన్నికలు అధికార పక్షానికి మాత్రమే కాదు విపక్షాలకు అత్యంత కీలకం కావటంతో ప్రచారం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు.. పవన్ లు నిర్వహిస్తున్న సభలకు ఆశించినంతగా స్పందన లేదంటున్నారు. ఆశించినంత ఎఫెక్టు రాకపోవటమే కాదు.. సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలకు భారీగా ప్రజలు వస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. అందుకే.. సింగిల్ గా కాకుండా జంటగా కలిసి ప్రచారం చేయటం ద్వారా ఓటర్లకు మరింత దగ్గర కావొచ్చన్న ప్లాన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. మరెప్పుడు ఆ నిర్ణయం బయటకు వస్తుందో చూడాలి.
This post was last modified on April 8, 2024 11:20 am
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…