తెలంగాణలో అధికారంలోకి వచ్చిన జోష్తో ఉన్న కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికపైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ప్రకటించింది.
శ్రీగణేష్ ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో గద్దర్ కుటుంబానికి, అద్దంకి దయాకర్కు పార్టీ షాక్ ఇచ్చిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున దివంగత గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలిచారు. అప్పుడు శ్రీగణేష్ బీజేపీ నుంచి పోటీ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో కాంగ్రెస్ నుంచి మరోసారి వెన్నెల పోటీ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు ఈ టికెట్పై అద్దంకి దయాకర్ కూడా ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో తుంగతుర్తి టికెట్ ఆశించిన దయాకర్కు పార్టీ మొండిచేయి చూపించింది. ఎమ్మెల్సీ టికెట్ కావాలనుకున్నా దొరకలేదు. దీంతో కంటోన్మెంట్ టికెట్ కోసం ఇప్పుడు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా మరోసారి పార్టీ ఆయనకు బిగ్ షాక్ ఇచ్చింది. దీంతో అటు గద్దర్ కుటుంబాన్ని గత ఎన్నికల్లో పార్టీ వాడుకుని వదిలేసిందనే విమర్శలు వస్తున్నాయి. దయాకర్కు కూడా అన్యాయం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ సారి కంటోన్మెంట్లో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే శ్రీగణేష్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ కంటోన్మెంట్లో బీజేపీ నుంచి శ్రీగణేష్ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఆయన 41,888 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వెన్నెలకేమో 20 వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఈ సారి మరింతగా కష్టపడితే శ్రీగణేష్ను గెలిపించుకోవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on April 7, 2024 4:46 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…