తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. పీసీసీ అధ్యక్షుడిగా కష్టపడి గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఆయన.. ఇప్పుడు కూడా అదే జోరుతో సాగిపోతున్నారనే చెప్పాలి. ఓ వైపు పాలన వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు, ఆరోపణలకు తనదైన స్టైల్లో బదులిస్తున్నారు. తాజాగా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్ స్పీచ్ మాత్రం మరో లెవల్లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాటలు, ప్రాసలు, పంచ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపాయనే చెప్పాలి.
ఈ సభలో రేవంత్ స్పీచ్తో కాంగ్రెస్ కార్యకర్తల రోమాలు నిక్కబొడుచుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ప్రధాన బలమైన కార్యకర్తల గురించి ప్రస్తావించి రేవంత్ మార్కులు కొట్టేశారు. పార్టీ కోసం పగలు రాత్రి లేకుండా దేనికీ భయపడకుండా క్యాడర్ పని చేస్తుందని, పార్టీ జోలికి వస్తే ఎవరినైనా తరిమి తరిమి కొడతారని రేవంత్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడాలని కార్యకర్తల రక్తం మరిగేలా రేవంత్ మాటలు పేలాయి.
ఇక బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ నిప్పులు చెరిగారు. ఇటీవల పొలం బాట పేరుతో జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో రేవంత్ రెచ్చిపోయారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని హెచ్చరించారు. కేసీఆర్కు జైలు జీవితం తప్పదని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లారని.. అందుకే కేసీఆర్కు కష్టం వచ్చిందని సంయమనం పాటించామని ఇక ఊరుకునేది లేదని రేవంత్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం సృష్టించారని రేవంత్ విమర్శించారు. రేవంత్ ఇదే దూకుడుతో సాగితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 7, 2024 4:42 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…