తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. పీసీసీ అధ్యక్షుడిగా కష్టపడి గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఆయన.. ఇప్పుడు కూడా అదే జోరుతో సాగిపోతున్నారనే చెప్పాలి. ఓ వైపు పాలన వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు, ఆరోపణలకు తనదైన స్టైల్లో బదులిస్తున్నారు. తాజాగా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్ స్పీచ్ మాత్రం మరో లెవల్లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాటలు, ప్రాసలు, పంచ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపాయనే చెప్పాలి.
ఈ సభలో రేవంత్ స్పీచ్తో కాంగ్రెస్ కార్యకర్తల రోమాలు నిక్కబొడుచుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ప్రధాన బలమైన కార్యకర్తల గురించి ప్రస్తావించి రేవంత్ మార్కులు కొట్టేశారు. పార్టీ కోసం పగలు రాత్రి లేకుండా దేనికీ భయపడకుండా క్యాడర్ పని చేస్తుందని, పార్టీ జోలికి వస్తే ఎవరినైనా తరిమి తరిమి కొడతారని రేవంత్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడాలని కార్యకర్తల రక్తం మరిగేలా రేవంత్ మాటలు పేలాయి.
ఇక బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ నిప్పులు చెరిగారు. ఇటీవల పొలం బాట పేరుతో జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో రేవంత్ రెచ్చిపోయారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని హెచ్చరించారు. కేసీఆర్కు జైలు జీవితం తప్పదని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లారని.. అందుకే కేసీఆర్కు కష్టం వచ్చిందని సంయమనం పాటించామని ఇక ఊరుకునేది లేదని రేవంత్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం సృష్టించారని రేవంత్ విమర్శించారు. రేవంత్ ఇదే దూకుడుతో సాగితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…