తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మామూలుగా లేదు. పీసీసీ అధ్యక్షుడిగా కష్టపడి గత ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చిన ఆయన.. ఇప్పుడు కూడా అదే జోరుతో సాగిపోతున్నారనే చెప్పాలి. ఓ వైపు పాలన వ్యవహారాలు చూసుకుంటూనే.. మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు, ఆరోపణలకు తనదైన స్టైల్లో బదులిస్తున్నారు. తాజాగా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ జన జాతర సభలో రేవంత్ స్పీచ్ మాత్రం మరో లెవల్లో ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాటలు, ప్రాసలు, పంచ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లో సరికొత్త జోష్ నింపాయనే చెప్పాలి.
ఈ సభలో రేవంత్ స్పీచ్తో కాంగ్రెస్ కార్యకర్తల రోమాలు నిక్కబొడుచుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీకి ప్రధాన బలమైన కార్యకర్తల గురించి ప్రస్తావించి రేవంత్ మార్కులు కొట్టేశారు. పార్టీ కోసం పగలు రాత్రి లేకుండా దేనికీ భయపడకుండా క్యాడర్ పని చేస్తుందని, పార్టీ జోలికి వస్తే ఎవరినైనా తరిమి తరిమి కొడతారని రేవంత్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం కష్టపడాలని కార్యకర్తల రక్తం మరిగేలా రేవంత్ మాటలు పేలాయి.
ఇక బీఆర్ఎస్పై, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై రేవంత్ నిప్పులు చెరిగారు. ఇటీవల పొలం బాట పేరుతో జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. ఎండిన పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశం పెట్టి రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో సభలో రేవంత్ రెచ్చిపోయారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని హెచ్చరించారు. కేసీఆర్కు జైలు జీవితం తప్పదని రేవంత్ పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందని, కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లారని.. అందుకే కేసీఆర్కు కష్టం వచ్చిందని సంయమనం పాటించామని ఇక ఊరుకునేది లేదని రేవంత్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వందేళ్ల విధ్వంసం సృష్టించారని రేవంత్ విమర్శించారు. రేవంత్ ఇదే దూకుడుతో సాగితే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్కు మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 7, 2024 4:42 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…