Political News

పింఛ‌ను సొమ్ముతో ఉద్యోగి ప‌రార్‌.. ఇది కూడా రాజ‌కీయం!

ప్ర‌స్తుతం ఏపీలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారిన విష‌యం తెలిసిందే. పింఛన్లను ఇంటింటికీ తీసుకువెళ్లి ఇవ్వ‌కుండా టీడీపీ అడ్డు ప‌డుతోంద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తుంటే.. అదేంలేదు.. వైసీపీనే ఉద్దేశ పూర్వ‌కంగా ఆల‌స్యం చేస్తూ.. టీడీపీపై నెడుతోంద‌ని తెలుగుదేశం త‌మ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇలాసాగుతుంటూ.. ఇప్పుడు మ‌రో విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. పింఛ‌న్ల పంపిణీ కోసం.. బ్యాంకు నుంచి తీసుకువ‌చ్చిన సొమ్మును స‌చివాల‌య ఉద్యోగి ఒక‌రు త‌స్క‌రించారు.

ఈ ఉద్యోగి టీడీపీ సానుభూతిప‌రుడ‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తే.. టీడీపీ నేత‌లు..కాదు.. ఆయ‌న అన్న వైసీపీలో కార్య‌క‌ర్త‌గా ఉన్నాడంటూ.. టీడీపీ నాయ‌కులు ఎదురు దాడి చేస్తున్నారు. ఈ దొంగ‌త‌నం కూడా రాజ‌కీయంగా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రిగిందంటే.. పింఛ‌న్ల సొమ్ము పంపిణీ కోసం.. బ్యాంకుల నుంచి సచివాల‌యాల‌కు.. పింఛ‌ను దారుల జాబితా ఆధారంగా సెర్ప్ విభాగం నిధుల‌ను పంపిణీ చేస్తోంది. ఈ నిధుల‌ను బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

దీంతో విజ‌య‌వాడ, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన స‌చివాల‌య ఉద్యోగి నాగ మ‌ల్లేశ్వ‌ర‌రావు.. శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకుకు వెళ్లి సొమ్ము తెచ్చుకుని.. అటు నుంచి అటే ఉడాయించాడు. దీంతో పింఛ‌న్ల కోసం వేచి చూసిన ల‌బ్ధిదారులు ఎంత‌కీ.. మ‌ల్లేశ్వ‌ర‌రావు రాక‌పోవ‌డంతో ఉన్న‌తాధికారుల ముందు గోడు వెళ్ల‌బోసుకున్నారు. దీంతో మ‌ల్లేశ్వ‌ర‌రావుకు ఫోన్ చేయ‌గా.. స్విచ్ఛాఫ్ అని వ‌చ్చింది. అప్ప‌టికి బ్యాంకు నుంచి సొమ్ము తీసుకున్నాడ‌ని.. బ్యాంకు అధికారులు కూడా చెప్పారు. దీంతో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు డ‌బ్బుతో ఉడాయించాడ‌ని పేర్కొంటూ అధికారులు కేసు పెట్టారు.

ఇదిలావుంటే, మ‌ల్లేశ్వ‌ర‌రావు.. టీడీపీ సానుభూతిప‌రుడ‌ని వైసీపీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి వెల్లంపల్లి శ్రీనివాస‌రావు ఆరోపించారు. దీనివెనుక కుట్ర ఉంద‌ని.. చంద్ర‌బాబే ఇలా చేయించాడని .. ఆయ‌న ప్ర‌ధాన మ‌ద్ద‌తు దారు.. స‌చివాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. దీంతో టీడీపీ నేత‌లు ఎదురు దాడి చేశారు. నాగ‌మ‌ల్లేశ్వ‌రావు సోద‌రుడు వైసీపీ నాయ‌కుడ‌ని.. అందుకే ఇంత ధైర్యంగా సొమ్ము దోచేశాడ‌ని ఆరోపించారు. ఇదీ.. సంగ‌తి. వీరిద్ద‌రి ఘ‌ర్ష‌ణ‌ల‌తో పింఛ‌న్ దారులు మండుటెండ‌లో అవ‌స్థ‌లు ప‌డ్డారు.

Satya

Recent Posts

పెహల్వాన్ అసలు కుస్తీ ఇప్పుడు మొదలు

పెద్ది మొదటి వారాంతం ఘనంగా పూర్తి చేసుకుంది. రెండు వందల యాభై కోట్లకు కొంచెం అటు ఇటు నెంబర్ నమోదు…

6 minutes ago

రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి… హీటెక్కిపోయింది!

తెలంగాణ రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో మరోమారు వేడి రాజుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్…

1 hour ago

భాగ్యరేఖ మార్చాల్సిన బాధ్యత ‘లెనిన్’దే

అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. కాకపోతే బ్యాడ్ లక్ భుజాన వేసుకుని తిరుగుతోంది. ఆఫర్లకు లోటు…

2 hours ago

పవన్ కన్నెర్ర చేస్తే…

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేనలో ఇప్పుడు ప్రక్షాళన మొదలైందని చెప్పక తప్పదు. తన మాట నమ్మి…

2 hours ago

మంగ‌ళ‌గిరి ఆద‌ర్శం.. త‌మ్ముళ్లు ఫాలో అవుతారా… ?

స‌హ‌జంగా టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు ఒక‌రిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని పెద్ద‌గా చెప్ప‌రు. ఆయ‌న ఏదైనా చెప్పారంటే ఖ‌చ్చితంగా దానిలో…

3 hours ago

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు చంద్ర‌బాబు అదిరిపోయే వ్యూహం!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. వ‌చ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్న‌ర పాటు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఆ…

5 hours ago