Political News

పింఛ‌ను సొమ్ముతో ఉద్యోగి ప‌రార్‌.. ఇది కూడా రాజ‌కీయం!

ప్ర‌స్తుతం ఏపీలో సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారిన విష‌యం తెలిసిందే. పింఛన్లను ఇంటింటికీ తీసుకువెళ్లి ఇవ్వ‌కుండా టీడీపీ అడ్డు ప‌డుతోంద‌ని వైసీపీ ప్ర‌చారం చేస్తుంటే.. అదేంలేదు.. వైసీపీనే ఉద్దేశ పూర్వ‌కంగా ఆల‌స్యం చేస్తూ.. టీడీపీపై నెడుతోంద‌ని తెలుగుదేశం త‌మ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం ఇలాసాగుతుంటూ.. ఇప్పుడు మ‌రో విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. పింఛ‌న్ల పంపిణీ కోసం.. బ్యాంకు నుంచి తీసుకువ‌చ్చిన సొమ్మును స‌చివాల‌య ఉద్యోగి ఒక‌రు త‌స్క‌రించారు.

ఈ ఉద్యోగి టీడీపీ సానుభూతిప‌రుడ‌ని వైసీపీ నాయ‌కులు ఆరోపిస్తే.. టీడీపీ నేత‌లు..కాదు.. ఆయ‌న అన్న వైసీపీలో కార్య‌క‌ర్త‌గా ఉన్నాడంటూ.. టీడీపీ నాయ‌కులు ఎదురు దాడి చేస్తున్నారు. ఈ దొంగ‌త‌నం కూడా రాజ‌కీయంగా మారిపోవ‌డం గ‌మ‌నార్హం. ఏం జ‌రిగిందంటే.. పింఛ‌న్ల సొమ్ము పంపిణీ కోసం.. బ్యాంకుల నుంచి సచివాల‌యాల‌కు.. పింఛ‌ను దారుల జాబితా ఆధారంగా సెర్ప్ విభాగం నిధుల‌ను పంపిణీ చేస్తోంది. ఈ నిధుల‌ను బ్యాంకుల నుంచి తెచ్చుకునేందుకు స‌చివాల‌య ఉద్యోగుల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

దీంతో విజ‌య‌వాడ, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన స‌చివాల‌య ఉద్యోగి నాగ మ‌ల్లేశ్వ‌ర‌రావు.. శుక్ర‌వారం ఉద‌యం బ్యాంకుకు వెళ్లి సొమ్ము తెచ్చుకుని.. అటు నుంచి అటే ఉడాయించాడు. దీంతో పింఛ‌న్ల కోసం వేచి చూసిన ల‌బ్ధిదారులు ఎంత‌కీ.. మ‌ల్లేశ్వ‌ర‌రావు రాక‌పోవ‌డంతో ఉన్న‌తాధికారుల ముందు గోడు వెళ్ల‌బోసుకున్నారు. దీంతో మ‌ల్లేశ్వ‌ర‌రావుకు ఫోన్ చేయ‌గా.. స్విచ్ఛాఫ్ అని వ‌చ్చింది. అప్ప‌టికి బ్యాంకు నుంచి సొమ్ము తీసుకున్నాడ‌ని.. బ్యాంకు అధికారులు కూడా చెప్పారు. దీంతో నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు డ‌బ్బుతో ఉడాయించాడ‌ని పేర్కొంటూ అధికారులు కేసు పెట్టారు.

ఇదిలావుంటే, మ‌ల్లేశ్వ‌ర‌రావు.. టీడీపీ సానుభూతిప‌రుడ‌ని వైసీపీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి వెల్లంపల్లి శ్రీనివాస‌రావు ఆరోపించారు. దీనివెనుక కుట్ర ఉంద‌ని.. చంద్ర‌బాబే ఇలా చేయించాడని .. ఆయ‌న ప్ర‌ధాన మ‌ద్ద‌తు దారు.. స‌చివాల‌యం ముందు ధ‌ర్నాకు దిగారు. దీంతో టీడీపీ నేత‌లు ఎదురు దాడి చేశారు. నాగ‌మ‌ల్లేశ్వ‌రావు సోద‌రుడు వైసీపీ నాయ‌కుడ‌ని.. అందుకే ఇంత ధైర్యంగా సొమ్ము దోచేశాడ‌ని ఆరోపించారు. ఇదీ.. సంగ‌తి. వీరిద్ద‌రి ఘ‌ర్ష‌ణ‌ల‌తో పింఛ‌న్ దారులు మండుటెండ‌లో అవ‌స్థ‌లు ప‌డ్డారు.

This post was last modified on April 6, 2024 9:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

48 minutes ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

2 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago