Political News

వైసీపీకి భారీ షాక్‌: ఆమంచి రాజీనామా

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మో హ‌న్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఈ ప‌రిణామం వైసీపీ ముందుగానే ఊహించిన అంశ‌మే. ఎందుకంటే.. ఆమంచి అభీష్టం వైసీపీలో నెర‌వేర‌లేదు. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న చీరాల స్తానాన్ని ఆశించారు. కానీ, వైసీపీ ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. పైగా.. ఆమంచి బ‌ద్ధ శ‌త్రువుకు అప్ప‌గించింది. దీంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఆమంచి.. ఇక‌, తాజాగా బ‌య‌టకు వ‌చ్చారు.

రాజీనామా అనంత‌రం.. ఆమంచి త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ను ఈ నెల 9న వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. అయితే .. ఆయ‌న ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1) కాంగ్రెస్‌లో చేర‌డం. 2) స్వ‌తంత్రంగా పోటీ చేయ‌డం. ఈ రెండు అంశాల్లో ఒక దానిని ఆయ‌న ఎంచుకునే అవ‌కాశం ఉంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆయ‌న స్వ‌తంత్రంగా కంటే కాంగ్రెస్ పార్టీ ప‌క్షాన పోటీ చేసే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అది కూడా చీరాల అసెంబ్లీ స్థానం నుంచే కావ‌డం గ‌మ‌నార్హం.

అస‌లు ఏం జ‌రిగింది?

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కాపు నాయ‌కుడు. దివంగ‌త రోశ‌య్య‌కు అనుచ‌రుడిగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. ఇలా ఆయ‌న ప్రోత్సాహంతోనే 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆమంచి పోటీ చేశారు. అప్ప‌ట్లో విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. రోశ‌య్య శిష్యుడిగా వైఎస్ ద‌గ్గ‌ర కూడా మార్కు లు వేయించుకున్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఆయ‌న కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. 2014లో ఏ పార్టీ త‌ర‌ఫున కాకుండా.. స్వ‌తంత్రంగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

అనంత‌రం.. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఇక‌, 2019 ఎన్నికల నాటికి.. చంద్ర బాబుతో విభేదించిన ఆమంచి వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేశా రు. ఇదేస‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం.. ఇక్క‌డ పోటీ చేసి.. పెద్ద ఎత్తున క‌నిపించిన వైసీపీ హ‌వాలోనూ.. క‌ర‌ణం గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఆమంచి ఓడిపోయా రు. ఆ త‌ర్వాత‌.. మ‌రోసారి రాజ‌కీయంగా ఆమంచికి దెబ్బ త‌గిలింది.

టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం.. వైసీపీలోకి వ‌చ్చారు. ఆయ‌న కుమారుడికి ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక ల్లో చీరాల టికెట్ ఇచ్చింది.. వైసీపీ. అంతేకాదు.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంతో సంబందం లేని… ప‌రుచూ రుకు ఆమంచిని పంపించింది. దీంతో కొన్నాళ్లు అక్క‌డే ప‌నిచేసిన ఆమంచి.. ఇక‌, అక్క‌డి రాజ‌కీయాలు  పొక‌గ‌క పోవ‌డంతో రెండు నెల‌ల నుంచి చీరాల టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, జ‌గ‌న్ క‌రుణ ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.

This post was last modified on April 4, 2024 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పందెం కోళ్లు: `అంద‌రూ` క‌లిసిపోయారు …!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచ‌క్కా చేతులు క‌లిపారు. సంక్రాంతి పుణ్య‌మా అని.. రాష్ట్రంలోని ఉభ‌య‌గోదావ‌రి…

2 hours ago

‘మనుషుల ప్రాణాల కంటే కుక్కలకు విలువ ఎక్కువా ?’

దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…

2 hours ago

బాబీది టీజర్… అనిల్‌ది ట్రైలర్

ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…

3 hours ago

ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి

రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…

3 hours ago

చూపు లేకపోయినా చిరంజీవి కోసం

అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…

5 hours ago

మారుతి అడ్రస్ ఛాలెంజ్… టోల్ మెటీరియల్ ఐపోయింది

సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్‌ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…

6 hours ago