Political News

వైసీపీకి భారీ షాక్‌: ఆమంచి రాజీనామా

ఏపీ అధికార పార్టీ వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మో హ‌న్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే.. ఈ ప‌రిణామం వైసీపీ ముందుగానే ఊహించిన అంశ‌మే. ఎందుకంటే.. ఆమంచి అభీష్టం వైసీపీలో నెర‌వేర‌లేదు. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న చీరాల స్తానాన్ని ఆశించారు. కానీ, వైసీపీ ఆయ‌న‌కు ఇవ్వ‌లేదు. పైగా.. ఆమంచి బ‌ద్ధ శ‌త్రువుకు అప్ప‌గించింది. దీంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన ఆమంచి.. ఇక‌, తాజాగా బ‌య‌టకు వ‌చ్చారు.

రాజీనామా అనంత‌రం.. ఆమంచి త‌న భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ను ఈ నెల 9న వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. అయితే .. ఆయ‌న ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. 1) కాంగ్రెస్‌లో చేర‌డం. 2) స్వ‌తంత్రంగా పోటీ చేయ‌డం. ఈ రెండు అంశాల్లో ఒక దానిని ఆయ‌న ఎంచుకునే అవ‌కాశం ఉంది. సాధ్య‌మైనంత వ‌ర‌కు ఆయ‌న స్వ‌తంత్రంగా కంటే కాంగ్రెస్ పార్టీ ప‌క్షాన పోటీ చేసే అవ‌కాశ‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అది కూడా చీరాల అసెంబ్లీ స్థానం నుంచే కావ‌డం గ‌మ‌నార్హం.

అస‌లు ఏం జ‌రిగింది?

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కాపు నాయ‌కుడు. దివంగ‌త రోశ‌య్య‌కు అనుచ‌రుడిగా ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. ఇలా ఆయ‌న ప్రోత్సాహంతోనే 2009లో చీరాల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై ఆమంచి పోటీ చేశారు. అప్ప‌ట్లో విజ‌యం కూడా ద‌క్కించుకున్నారు. రోశ‌య్య శిష్యుడిగా వైఎస్ ద‌గ్గ‌ర కూడా మార్కు లు వేయించుకున్నారు. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఆయ‌న కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. 2014లో ఏ పార్టీ త‌ర‌ఫున కాకుండా.. స్వ‌తంత్రంగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.

అనంత‌రం.. చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తో టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఇక‌, 2019 ఎన్నికల నాటికి.. చంద్ర బాబుతో విభేదించిన ఆమంచి వైసీపీ కండువా క‌ప్పుకొన్నారు. ఆ పార్టీ టికెట్‌పై చీరాల నుంచి పోటీ చేశా రు. ఇదేస‌మ‌యంలో టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రాం.. ఇక్క‌డ పోటీ చేసి.. పెద్ద ఎత్తున క‌నిపించిన వైసీపీ హ‌వాలోనూ.. క‌ర‌ణం గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో ఆమంచి ఓడిపోయా రు. ఆ త‌ర్వాత‌.. మ‌రోసారి రాజ‌కీయంగా ఆమంచికి దెబ్బ త‌గిలింది.

టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం.. వైసీపీలోకి వ‌చ్చారు. ఆయ‌న కుమారుడికి ఇప్పుడు జ‌రుగుతున్న ఎన్నిక ల్లో చీరాల టికెట్ ఇచ్చింది.. వైసీపీ. అంతేకాదు.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంతో సంబందం లేని… ప‌రుచూ రుకు ఆమంచిని పంపించింది. దీంతో కొన్నాళ్లు అక్క‌డే ప‌నిచేసిన ఆమంచి.. ఇక‌, అక్క‌డి రాజ‌కీయాలు  పొక‌గ‌క పోవ‌డంతో రెండు నెల‌ల నుంచి చీరాల టికెట్ కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, జ‌గ‌న్ క‌రుణ ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.

This post was last modified on April 4, 2024 6:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ ‘దక్షిణాది గళం’ బలమెంత..?

నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…

60 minutes ago

ఓజీ-2 ప‌నిలో సుజీత్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక‌, ఆయ‌న చేసిన చిత్రాల్లో అభిమానుల‌ను అత్యంత అల‌రించింది ఓజీనే. సినిమా…

2 hours ago

రాముడు రావణుడు కలవడం లేదు

ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…

2 hours ago

పార్టీలోని పెద్ద పదవి ఇప్పుడు లోకేష్ సొంతం

ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…

2 hours ago

నమ్మొచ్చా… టైటిల్ కోసం 112 కోట్లు

ఇటీవలే విడుదలైన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ తమిళంలో ఓ మోస్తరుగా, తెలుగులో నీరసంగా రన్ అవుతోంది. ఫైనల్ గా ప్రదీప్…

3 hours ago

ఎమ్మెస్ రాజు… మళ్లీ వచ్చారూ

శత్రువు, దేవి, దేవిపుత్రుడు, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిర్మాత..…

4 hours ago