Political News

కేంద్రంలో వైసీపీకి మ‌రింత పెరిగిన ప‌ర‌ప‌తి..

కేంద్రంలో ఏర్ప‌డే ఏ ప్ర‌భుత్వాన్న‌యినా.. అంతో ఇంతో ప్ర‌భావితం చేయ‌గ‌లిగితే.. అది త‌మ‌కు మాత్ర‌మే కాద‌ని.. ఆ ప్ర‌యోజ‌నం ఏపీకి, ఏపీ ప్ర‌జ‌ల‌కు ద‌క్కుతుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. గ‌త ఐదేళ్ల కాలంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసింది లేదు. కానీ.. ఇప్పుడు మ‌రోసారి వైసీపీకి భారీ అవ‌కాశ‌మే ద‌క్కింది. కేంద్రంలో వైసీపీ ప‌ర‌ప‌తి మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం 9 మంది మాత్ర‌మే ఉన్న రాజ్య‌స‌భ బ‌లం 11కి చేరింది.

తాజాగా కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా.. గొల్ల బాబూ రావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది.

రాజ్యసభలో 97 మంది స‌భ్యుల‌తో బీజేపీ అగ్ర స్థానంలో ఉండగా… 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో 11 మంది స‌భ్యుల‌తో వైసీపీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. దీంతో కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం ఏర్పడినా.. వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. వైసీపీ మ‌ద్ద‌తు లేకుండా.. అడుగులు ముందుకు వేసే ప‌రిస్థితి కూడా రాక‌పోవ‌చ్చు. మ‌రి ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌న‌కు ద‌క్కిన ఈ ప‌రప‌తిని రాష్ట్రానికి ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డేలా చేస్తారు? అనేది చూడాలి.

రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తేనే ప‌ట్టించుకుం టామ‌ని చెప్పి చేతులు దులుపుకొంటారా? లేక‌.. ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే గీటురాయిగా .. పెద్దల‌ స‌భ‌లో ప‌నిచేస్తారా? అనేది వేచి చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. ఈ త‌ర‌హాలో వైసీపీ ప‌నిచేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 4, 2024 3:01 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

4 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

8 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

10 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

14 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

15 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

15 hours ago