Political News

కేంద్రంలో వైసీపీకి మ‌రింత పెరిగిన ప‌ర‌ప‌తి..

కేంద్రంలో ఏర్ప‌డే ఏ ప్ర‌భుత్వాన్న‌యినా.. అంతో ఇంతో ప్ర‌భావితం చేయ‌గ‌లిగితే.. అది త‌మ‌కు మాత్ర‌మే కాద‌ని.. ఆ ప్ర‌యోజ‌నం ఏపీకి, ఏపీ ప్ర‌జ‌ల‌కు ద‌క్కుతుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. గ‌త ఐదేళ్ల కాలంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసింది లేదు. కానీ.. ఇప్పుడు మ‌రోసారి వైసీపీకి భారీ అవ‌కాశ‌మే ద‌క్కింది. కేంద్రంలో వైసీపీ ప‌ర‌ప‌తి మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం 9 మంది మాత్ర‌మే ఉన్న రాజ్య‌స‌భ బ‌లం 11కి చేరింది.

తాజాగా కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా.. గొల్ల బాబూ రావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది.

రాజ్యసభలో 97 మంది స‌భ్యుల‌తో బీజేపీ అగ్ర స్థానంలో ఉండగా… 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో 11 మంది స‌భ్యుల‌తో వైసీపీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. దీంతో కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం ఏర్పడినా.. వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. వైసీపీ మ‌ద్ద‌తు లేకుండా.. అడుగులు ముందుకు వేసే ప‌రిస్థితి కూడా రాక‌పోవ‌చ్చు. మ‌రి ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌న‌కు ద‌క్కిన ఈ ప‌రప‌తిని రాష్ట్రానికి ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డేలా చేస్తారు? అనేది చూడాలి.

రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తేనే ప‌ట్టించుకుం టామ‌ని చెప్పి చేతులు దులుపుకొంటారా? లేక‌.. ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే గీటురాయిగా .. పెద్దల‌ స‌భ‌లో ప‌నిచేస్తారా? అనేది వేచి చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. ఈ త‌ర‌హాలో వైసీపీ ప‌నిచేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 4, 2024 3:01 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

అఫీషియల్ – అఖండ 2 ఆగమనం

రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…

11 minutes ago

హార్దిక్ దెబ్బకు పవర్ఫుల్ విక్టరీ

టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్‌లోని…

28 minutes ago

ఏఐ కోసం రూ. 1.5 లక్షల కోట్లు… మైక్రోసాఫ్ట్ భారీ ప్లాన్!

టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…

31 minutes ago

అల్లూ వారి పుష్ప కథ బెడిసికొట్టిందా?

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…

41 minutes ago

అన్నగారికి అసలు టెన్షనే లేదు

అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…

41 minutes ago

ముందు జాగ్రత్త పడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్

ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…

2 hours ago