Political News

కేంద్రంలో వైసీపీకి మ‌రింత పెరిగిన ప‌ర‌ప‌తి..

కేంద్రంలో ఏర్ప‌డే ఏ ప్ర‌భుత్వాన్న‌యినా.. అంతో ఇంతో ప్ర‌భావితం చేయ‌గ‌లిగితే.. అది త‌మ‌కు మాత్ర‌మే కాద‌ని.. ఆ ప్ర‌యోజ‌నం ఏపీకి, ఏపీ ప్ర‌జ‌ల‌కు ద‌క్కుతుంద‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. గ‌త ఐదేళ్ల కాలంలో ఇలాంటి ప్ర‌య‌త్నం చేసింది లేదు. కానీ.. ఇప్పుడు మ‌రోసారి వైసీపీకి భారీ అవ‌కాశ‌మే ద‌క్కింది. కేంద్రంలో వైసీపీ ప‌ర‌ప‌తి మ‌రింత పెరిగింది. ప్ర‌స్తుతం 9 మంది మాత్ర‌మే ఉన్న రాజ్య‌స‌భ బ‌లం 11కి చేరింది.

తాజాగా కొత్తగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథ్ రెడ్డిలతో ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ ప్రమాణం చేయించారు. వీరిలో వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా.. గొల్ల బాబూ రావు హిందీలో ప్రమాణం చేశారు. కొత్త సభ్యులతో కలిపి ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీ సభ్యుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ క్రమంలో రాజ్యసభలో నాలుగో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది.

రాజ్యసభలో 97 మంది స‌భ్యుల‌తో బీజేపీ అగ్ర స్థానంలో ఉండగా… 29 మంది సభ్యులతో కాంగ్రెస్, 13 మంది సభ్యులతో టీఎంసీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక‌, ఇప్పుడు రాజ్య‌స‌భ‌లో 11 మంది స‌భ్యుల‌తో వైసీపీ అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించింది. దీంతో కేంద్రంలో ఏ ప్ర‌భుత్వం ఏర్పడినా.. వైసీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం అవుతుంది. వైసీపీ మ‌ద్ద‌తు లేకుండా.. అడుగులు ముందుకు వేసే ప‌రిస్థితి కూడా రాక‌పోవ‌చ్చు. మ‌రి ఈ నేప‌థ్యంలో వైసీపీ త‌న‌కు ద‌క్కిన ఈ ప‌రప‌తిని రాష్ట్రానికి ఏమేర‌కు ఉప‌యోగ‌ప‌డేలా చేస్తారు? అనేది చూడాలి.

రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వ‌స్తేనే ప‌ట్టించుకుం టామ‌ని చెప్పి చేతులు దులుపుకొంటారా? లేక‌.. ప్ర‌జా ప్ర‌యోజ‌న‌మే గీటురాయిగా .. పెద్దల‌ స‌భ‌లో ప‌నిచేస్తారా? అనేది వేచి చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే.. ఈ త‌ర‌హాలో వైసీపీ ప‌నిచేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 4, 2024 3:01 pm

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

సోషల్ మీడియాలో పాయల్ ఆవేదన

పరిశ్రమలో అంతర్గతంగా వేధింపుల పర్వాలు రకరకాల రూపాల్లో ఉంటాయి. కొన్ని బయటపడితే మరికొన్ని పరువు కోసం గుట్టుగా దాగుండిపోతాయి. ఆరెక్స్…

54 mins ago

వైఎస్ ఘ‌ట‌న‌ను గుర్తు చేసిన… ఇరాన్ అధ్య‌క్షుడి ప్ర‌మాదం!

2009 సెప్టెంబ‌రులో ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో చనిపోయిన విష‌యం తెలిసిందే. ప్ర‌తికూల వాతావర‌ణ…

2 hours ago

మ‌రో వివాదంలో టీడీపీ ఫైర్ బ్రాండ్.. దెందులూరు హాట్ హాట్‌!

టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ మ‌రో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నిక‌ల అనంతరం ప‌శ్చిమ…

3 hours ago

నోరు జారిన కేటీఆర్‌.. క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఈసీ ఆదేశం!

తెలంగాణ ప్ర‌తిప‌క్షం.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం కొన్ని వారాల కింద‌ట క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం…

5 hours ago

దేశం విడిచి పారిపోతున్న మంత్రి పెద్దిరెడ్డి… ఇదిగో క్లారిటీ!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దేశం విడిచి పారిపోతున్నార‌ని.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం లేద‌ని..…

7 hours ago

మూడో భారతీయుడు షాక్ ఇస్తాడా

అసలు భారతీయుడు 2 ఎప్పుడు రిలీజనేది తేలలేదు కానీ అప్పుడే మూడో భాగానికి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. కమల్ హాసన్…

14 hours ago