జనసేన కార్యకలాపాల కోసం షూటింగులకు బ్రేక్ ఇచ్చి తన దర్శకులను ఇతర సినిమాలు చేసుకోమని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రయాణం వైపు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం కనక ఏర్పడితే వేల కోట్ల పెట్టుబడులతో ముడిపడిన ప్యాన్ ఇండియా సినిమాలకు మేలు జరుగుతుందనే ఆశ బలంగా కనిపిస్తోంది. అదెలాగో చూద్దాం. ప్రస్తుతం ఏపీలో టికెట్ రేట్ల పెంపుకి సంబంధించిన ప్రహసనం క్లిష్టంగా ఉంది. అందుకే మరీ తప్పదనుకుంటే తప్ప నిర్మాతలు హైక్ కోసం అప్లై చేయడం లేదు. తెలంగాణలో అలాంటి ఇబ్బందులు లేవు.
ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి రేంజ్ సినిమాలకు తప్ప మిగిలినవాటికి పెంపు ఇవ్వడానికి ఏపీలో సవాలక్ష అడ్డంకులు వస్తున్నాయి. అంత సలార్ కే కేవలం 50 రూపాయలతో సర్దుకోవాల్సి వచ్చింది. పెంచిన ఏపీ సినిమా టికెట్ కంటే తెలంగాణ సాధారణ రోజుల్లో ఉండే మల్టీప్లెక్స్ టికెట్ వంద రూపాయలు ఎక్కువగా ఉండటం దానికి నిదర్శనం. పొత్తు ధర్మంలో భాగంగా పవన్ ముఖ్యమంత్రి కాకపోయినా తన మాటకు ఎంతో విలువిచ్చే చంద్రబాబునాయుడు నిర్ణయాలు ఖచ్చితంగా ఇండస్ట్రీకి మేలు కలిగేలా ఉంటాయి. సో అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ధరలు ఉండొచ్చు.
ప్రొడ్యూసర్లు కోరుకుంటున్నది ఇలాంటి పరిణామమే. ఇందులో లోతైన రాజకీయం లేదు కానీ గత రెండు మూడేళ్ళుగా కలెక్షన్ల కోణంలో నిర్మాతలు ఏపీ నుంచి సరైన రెవిన్యూ అందుకోవడం లేదు. ఈ సమస్య వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ల నుంచి మొదలై ఇతరులను కూడా వెంటాడుతూనే ఉంది. సంక్రాంతికి మినహాయించి మిగిలిన రోజుల్లో టికెట్ల పెంపు అడిగే సాహసం చేయలేకపోతున్నారు. తెలంగాణ తరహాలో గరిష్ట ధరను పెంచాలని ఎదురు చూస్తున్నారు. పవన్ వల్ల ఈ సమస్య పరిష్కారమయ్యేదే కానీ అది తేల్చాల్సింది ఓటర్లు, నిర్ణయించబడేది ఎన్నికల ఫలితాల తర్వాత.
This post was last modified on April 4, 2024 9:40 am
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…