సినిమాలయందు పొలిటికల్ సినిమాలు వేరయా.! ఔను, ఈ సినిమా నిజంగానే వేరే లెవల్.! ఇది పొలిటికల్ సినిమా.! పేరు ‘వివేకం’. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆధారంగా తీసిన సినిమా ఇది. ఈ కేసుని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సీబీఐ విచారణ ఆధారంగా ‘వివేకం’ సినిమాని తెరకెక్కించారు.
దర్శకుడెవరో తెలీదు, నిర్మాత ఎవరో తెలీదు. నటీనటలెవరో తెలీదు.! తెలీదు.. అంటే, అన్ని వివరాలూ తెలుసు.. కాకపోతే, సినిమాలకీ రాజకీయాలకీ పరిచయం వున్నవారెవరికీ వీళ్ళు పెద్దగా తెలియదని అర్థం.
సినిమా థియేటర్లలో విడుదల కాలేదు. నేరుగా వెబ్ సైట్లో, యూ ట్యూబ్లో విడుదల చేశారు. ఆ తర్వాత ట్విట్టర్లో కూడా అందుబాటులోకి వచ్చింది. వస్తూనే, లక్షలాదిగా వ్యూస్ సంపాదించింది. బహుశా ఇటీవలి కాలంలో ఇలాంటి సినిమా ఇంకోటి రాలేదేమో.!
వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు.? ఎవరు చంపించారు.? అన్నదే ఈ సినిమా మూల కథ. ఇది కథ కాదు, నిజమే.. అని సాక్షాత్తూ బాధిత కుటుంబానికి చెందిన వైఎస్ సునీతా రెడ్డి తాజాగా సర్టిఫై చేశారు. ఇది ఇంకా ఆసక్తికరం.
మామూలుగా ఈ తరహా సినిమాల్ని సెన్సార్ దగ్గరే అడ్డుకుంటుంది రాజకీయం. కానీ, ‘వివేకం’ సినిమాకి అలాంటి ఇబ్బందులేమీ రాలేదు. ఎందుకంటే, ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయలేదు. ఓటీటీ వైపు కూడా దృష్టి సారించలేదు మేకర్స్.
టార్గెట్ చేసింది వైసీపీనే.. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ, వైసీపీ కూడా ఏమీ చేయలేకపోయింది. ఎన్నికల వేళ వైసీపీకి ఈ ‘వివేకం’ సినిమా చాలా చాలా డ్యామేజ్ చేస్తోంది రాజకీయంగా. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది. రికార్డు స్థాయిలో ఇంకా ఈ సినిమాకి వ్యూస్ దక్కుతూనే వున్నాయ్.
This post was last modified on April 2, 2024 11:09 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…