Political News

ఏపీ ఎన్నికలపై నరేష్ హాట్ కామెంట్


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సరిగ్గా ఇంకో 40 రోజుల సమయమే ఉంది. ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రచారాన్ని ఆయా పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో అధికార వైసీపీ ఉంటే.. కూటమి అధికారంలోకి రావడం పక్కా అని టీడీపీ, జనసేన, భాజపా పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. మామూలుగా ఎన్నికల సమయంలో సినిమా వాళ్లు కూడా ప్రచారంలో హడావుడి చేస్తారు. నే

రుగా రంగంలోకి దిగకపోయినా ఒక పార్టీకి అనుకూలంగానో, ప్రతికూలంగానో మాట్లాడతారు. ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేస్తుంటారు. కానీ రకరకాల కారణాల వల్ల ఈసారి రాజకీయ రంగు పులుముకోవడానికి సినీ జనాలు సిద్ధంగా లేరు. చాలా వరకు వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నారు.

ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు నరేష్.. ఏపీ ఎన్నికలపై ఒక ఆసక్తికర ట్వీట్ వేశారు. ‘‘ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేలోపు రక్తపాతం జరగడానికి చాలా మెండుగా అవకాశాలు ఉన్నది నా నమ్మకం’’ అని ఆయన ఈ రోజు ట్వీట్ వేశారు. ఈసారి ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తాయనే అంచనా రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. అధికారం పోతే వైసీపీకి, ఈసారి అధికారం చేపట్టకపోతే టీడీపీ, జనసేనలకు చాలా చాలా కష్టమవుతుంది. కాబట్టి విజయం కోసం ప్రాణాలొడ్డి పోరాడాల్సిన పరిస్థితి తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేష్ ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

అలాగే గత ఎన్నికలకు ముందు వివేకా హత్య, కోడికత్తి దాడి లాంటి ఘటనలు ఈసారి కూడా రిపీట్ కావచ్చన్న ఉద్దేశంతో కూడా ఆయన ఈ కామెంట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే అధికార మార్పిడి జరగబోతోందని నరేష్ అంచనా వేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

This post was last modified on April 2, 2024 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

17 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

49 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

55 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

1 hour ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago