Political News

జ‌న‌సేన‌లో ‘గ్లాస్’ క‌ల‌క‌లం.. షాక్ త‌ప్ప‌దా!

కొన్ని కొన్ని విష‌యాలు చాలా కుదిపేస్తాయి. అవి వ్య‌క్తుల‌నైనా, వ్య‌వ‌స్థ‌లనైనా.. పార్టీల‌నైనా. ఇప్పుడు జ‌న‌సేన కూడా ఇదే జాబితాలో ప‌డిపోయింది. తాజాగా పార్టీ గుర్తుపై మ‌రో సారి తీవ్ర క‌ల‌క‌లం రేగింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో “జ‌న‌సేన ఎన్నిక‌ల గుర్తుగా ఉన్న గ్లాస్‌”ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ‘ఫ్రీ సింబ‌ల్’గా ప్ర‌క‌టించేసింది. అంటే.. ఈ గుర్తును ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల్లో ఎవ‌రైనా కోరుకునే అవ‌కాశం ఉంది. అంతేకాదు.. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సంఘం.. ఎవ‌రు ముందు వ‌స్తే వారికి ఫ్రీసింబ‌ల్ కేటాయిస్తోంది.

దీంతో ఇప్పుడు క‌నుక‌.. జ‌న‌సేన త‌క్ష‌ణం స్పందించ‌క‌పోతే.. ఈ గుర్తును మ‌రోపార్టీ కోరుకుంటే.. దానికి ఎన్నిక‌ల సంఘం కేటాయించేస్తుంది. అది కూడా ఏపీలో అయితే.. మ‌రింత ఇబ్బంది త‌ప్ప‌దు. త‌ర్వాత‌.. ఏ న్యాయ పోరాటం చేసినప్ప‌టికీ ఫ‌లితం లేదు. ఇప్ప‌టికే త‌మిళ‌నాడుకు చెందిన ఒక పార్టీ గుర్తును కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌రోపార్టీకి ఎవ‌రు ముందు వ‌స్తే వారికి అన్న ప్రాతిప‌దిక‌న కేటాయించేసింది. దీంతో ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరింది. అంతేకాదు.. దీనిపై విచార‌ణ వ‌చ్చే నెల‌కు వాయిదా ప‌డింది.

ఇప్పుడు జ‌న‌సేన గుర్తు గ్లాస్‌ను ఎవ‌రైనా క్లెయిమ్ చేసుకుంటే.. జ‌న‌సేన సుప్రీంకోర్టును ఆశ్ర‌యించినా.. ఇప్ప‌టికిప్పుడు త‌క్ష‌ణ ఊర‌డింపు దొర‌క‌డం సాధ్యం కాదు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. జ‌న‌సేనకు గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీగా ఎలాంటి గుర్తింపులేదు. కేవ‌లం ఇది రిజిస్ట‌ర్డ్ పార్టీనే. ఏపీలో వైసీపీ, టీడీపీలు మాత్రమే.. గుర్తింపు పొందిన‌ ప్రాంతీయ పార్టీలు. దీంతో జ‌న‌సేనకు ఎప్ప‌టిక‌ప్పుడు గుర్తుపై వివాదం వ‌స్తూనే ఉంది. గ‌త తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆప‌శోపాలు ప‌డ్డారు.

ఇక‌, ఇప్పుడు కూడా కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. గ్లాస్ గుర్తును ఫ్రీ సింబ‌ల్‌(అంటే.. ఎవ‌రు ముందు వ‌స్తే.. వారికి కేటాయించే ప్ర‌తిపాద‌న‌)గా పేర్కొంది. ఇదే జ‌రిగితే.. జ‌న‌సేన‌కు భారీ డ్యామేజీ ఖాయం. అయితే.. జ‌న‌సేన ఇప్పుడే న్యాయ వాదుల‌ను సంప్ర‌దిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం చేస్తారో చూడాలి. కానీ, ఆన్‌లైన్ లేదా.. ఆఫ్‌లైన్‌లో ఇత‌ర పార్టీలు కోరుకుంటే.. మాత్రం ఇది జ‌న‌సేన‌కు మైన‌స్‌గా మార‌నుంది.

This post was last modified on April 2, 2024 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

30 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago