Political News

ఈ నియోజ‌క‌వ‌ర్గాలు చాలా ట‌ఫ్ గురూ!

పార్టీ ఏదైనా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు చాలా చాలా ట‌ఫ్‌గా మారిపోయాయి. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేత‌లే.. త‌మ‌ను తాము అభ్య‌ర్థులుగా నిర్ణ‌యించుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ పొందిన వారికంటే. కూడా పార్టీల అధినేత‌లే ఎక్కువ‌గా మ‌ధ‌న ప‌డుతున్నారు. ప్ర‌చారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక్క‌డ అభ్య‌ర్థుల పేర్లు టెక్నిక‌ల్ అయినా.. నిజ‌మైన పోటీ పార్టీ అధినేతల మ‌ధ్యే ఉంద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఏ ఎన్నిక‌లైనా.. అభ్య‌ర్థుల‌కు క‌త్తిమీద సామే. అభివృద్ది చేశామ‌ని, అభివృద్ధి చేస్తామ‌ని చెబుతున్నపార్టీ ఒక‌వైపు. ఇప్ప‌టి వ‌ర‌కు వేల కోట్లు సంక్షేమం రూపంలో అందించామ‌ని చెబుతున్న పార్టీ మ‌రోవైపు. ఈ రెండు పార్టీల మ‌ధ్యే పోరు ఘోరంగా సాగ‌నుంది. దీంతో అభ్య‌ర్థులు చ‌మ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే.. ఇది 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాదు. ఎందుకంటే.. అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా పార్టీల గెలుపును అధినేత‌లే ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. పుంగ‌నూరు, మంగ‌ళ‌గిరి, క‌డ‌ప‌, పులివెందుల‌, టెక్క‌లి, పిఠాపురం, హిందూపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చిల‌క‌లూరిపేట‌, పెద్దకూర‌పాడు, న‌ర‌స‌రావుపేట‌, మ‌చిలీప‌ట్నం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, ప‌లాస‌, తాడికొండ‌, స‌ర్వేప‌ల్లి, నెల్లూరు రూర‌ల్‌, ఉద‌య‌గిరి, కుప్పం, ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి, విశాఖ ఎంపీ, న‌ర‌సాపురం ఎంపీ, విజ‌య‌వాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాలు ఇరు పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్నాయి.

ఇక్క‌డ వైసీపీ గెలిచి తీరాల‌ని.. టీడీపీకి చుక్క‌లు చూపించాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో ఆయ‌నే స్వ‌యంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక్క‌డ షెడ్యూల్ ప్ర‌కారం.. ఒక రోజు కాకుండా.. మూడు రోజులు ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఇక‌, టీడీపీ వైపు కూడా ఇంతే ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు ఉన్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ సత్తా నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌న కూడా చూస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు కూడా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు.

దీంతో స్వ‌యంగా బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ సమ‌యం కేటాయించి.. ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో ఇక్క‌డి అభ్య‌ర్థులు చేసుకునే ప్ర‌చారం క‌న్నా.. అధినేత ప్ర‌చారానికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీంతో వారు ఎలా ప్ర‌చారం చేసుకున్నా.. అధినేత‌లే సీరియ‌స్‌గా తీసుకున్న నేప‌థ్యంలో త‌మ‌కు దిగుల్లేద‌నే వాద‌న వినిపిస్తోంది. అయినా.. అభ్య‌ర్థులు సీరియ‌స్‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనికి అధినేతల స‌హ‌కారం మ‌రింత తోడు కానుంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాలే చాలా ట‌ఫ్‌గా మార‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 1, 2024 2:28 pm

Share
Show comments

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

1 hour ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

7 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

8 hours ago