Political News

ఈ నియోజ‌క‌వ‌ర్గాలు చాలా ట‌ఫ్ గురూ!

పార్టీ ఏదైనా.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాలు చాలా చాలా ట‌ఫ్‌గా మారిపోయాయి. దీనికి కార‌ణం.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇటు వైసీపీ, అటు టీడీపీ అధినేత‌లే.. త‌మ‌ను తాము అభ్య‌ర్థులుగా నిర్ణ‌యించుకుని ముందుకు సాగుతున్నారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ పొందిన వారికంటే. కూడా పార్టీల అధినేత‌లే ఎక్కువ‌గా మ‌ధ‌న ప‌డుతున్నారు. ప్ర‌చారానికి శ్రీకారం చుడుతున్నారు. ఇక్క‌డ అభ్య‌ర్థుల పేర్లు టెక్నిక‌ల్ అయినా.. నిజ‌మైన పోటీ పార్టీ అధినేతల మ‌ధ్యే ఉంద‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఏ ఎన్నిక‌లైనా.. అభ్య‌ర్థుల‌కు క‌త్తిమీద సామే. అభివృద్ది చేశామ‌ని, అభివృద్ధి చేస్తామ‌ని చెబుతున్నపార్టీ ఒక‌వైపు. ఇప్ప‌టి వ‌ర‌కు వేల కోట్లు సంక్షేమం రూపంలో అందించామ‌ని చెబుతున్న పార్టీ మ‌రోవైపు. ఈ రెండు పార్టీల మ‌ధ్యే పోరు ఘోరంగా సాగ‌నుంది. దీంతో అభ్య‌ర్థులు చ‌మ‌టోడ్చాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. అయితే.. ఇది 175 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాదు. ఎందుకంటే.. అటు టీడీపీ అయినా.. ఇటు వైసీపీ అయినా. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా పార్టీల గెలుపును అధినేత‌లే ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. పుంగ‌నూరు, మంగ‌ళ‌గిరి, క‌డ‌ప‌, పులివెందుల‌, టెక్క‌లి, పిఠాపురం, హిందూపురం, విజ‌య‌వాడ వెస్ట్‌, చిల‌క‌లూరిపేట‌, పెద్దకూర‌పాడు, న‌ర‌స‌రావుపేట‌, మ‌చిలీప‌ట్నం, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, ప‌లాస‌, తాడికొండ‌, స‌ర్వేప‌ల్లి, నెల్లూరు రూర‌ల్‌, ఉద‌య‌గిరి, కుప్పం, ఆత్మ‌కూరు, వెంక‌ట‌గిరి, విశాఖ ఎంపీ, న‌ర‌సాపురం ఎంపీ, విజ‌య‌వాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఇలా చాలా నియోజ‌క‌వ‌ర్గాలు ఇరు పార్టీల‌కూ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉన్నాయి.

ఇక్క‌డ వైసీపీ గెలిచి తీరాల‌ని.. టీడీపీకి చుక్క‌లు చూపించాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు. దీంతో ఆయ‌నే స్వ‌యంగా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేయ‌నున్నారు. ఇక్క‌డ షెడ్యూల్ ప్ర‌కారం.. ఒక రోజు కాకుండా.. మూడు రోజులు ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఇక‌, టీడీపీ వైపు కూడా ఇంతే ప‌ట్టుద‌ల‌తో చంద్ర‌బాబు ఉన్నారు. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ సత్తా నిల‌బెట్టుకోవాల‌ని ఆయ‌న కూడా చూస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు కూడా ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌పై నిత్యం ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నారు.

దీంతో స్వ‌యంగా బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ సమ‌యం కేటాయించి.. ప్ర‌చారం చేయ‌నున్నారు. దీంతో ఇక్క‌డి అభ్య‌ర్థులు చేసుకునే ప్ర‌చారం క‌న్నా.. అధినేత ప్ర‌చారానికే ఎక్కువ‌గా ప్రాధాన్యం ఏర్ప‌డింది. దీంతో వారు ఎలా ప్ర‌చారం చేసుకున్నా.. అధినేత‌లే సీరియ‌స్‌గా తీసుకున్న నేప‌థ్యంలో త‌మ‌కు దిగుల్లేద‌నే వాద‌న వినిపిస్తోంది. అయినా.. అభ్య‌ర్థులు సీరియ‌స్‌గానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీనికి అధినేతల స‌హ‌కారం మ‌రింత తోడు కానుంది. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గాలే చాలా ట‌ఫ్‌గా మార‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on April 1, 2024 2:28 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

1 hour ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

3 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago