రాజకీయాల్లో శాశ్వత శత్రువులు లేరు.. శాశ్వత మిత్రులు కూడా లేరు. అవకాశం-అవసరం ఈ రెండు చాలు. నాయకులు, పార్టీలు కూడా.. సర్దుకు పోతాయి. ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లోనూ ఇదే జరుగుతోంది. రెండు నెలల కిందట మాజీ మంత్రి , అగ్రనేత కేటీఆర్ను తిట్టిపోసిన నాయకుడికి ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి చేర్చుకునేందుకు రెడీ అయింది. దీంతో అందరూ అవాక్కవుతున్నారు.
ఎస్సీలకు విలువ లేదు. కేటీఆర్ మాయలోడు. కనీసం నాకు విలువ ఇవ్వకుండా దూషించాడు. అనేక అవమానాలు చేశాడు. అందుకే పార్టీలో ఉండలేక పోతున్నా. రాజీనామా చేస్తున్నా అంటూ రెండు మాసాల కిందట సంచలన వ్యాఖ్యలు చేసి.. బీఆర్ ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మరోసారి బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది. వచ్చేయ్ ఆ మాటలు మేం పట్టించుకోం అంటూ.. బీఆర్ఎస్ నుంచి రాజయ్యకు ఆహ్వానం అందింది. దీంతో రాజయ్య కూడా.. బీఆర్ఎస్ కండువా కప్పుకొనేందుకు రెడీ అయిపోయారు.
ఏం జరిగింది?
బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య 2 నెలల కిందట బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీని వీడారు. అయితే రాజయ్య కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమైనప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈలోపు రాజయ్యకు రాజకీయ శత్రువు, సొంత నియోజకవర్గం నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇక రాజయ్య చేరిక కష్టంగా మారింది.
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీకి వరంగల్ పార్లమెంటుకు అభ్యర్థులు కరువు కావడంతో బీఆర్ఎస్ అధిష్టానం తాటికొండ రాజయ్యను పార్టీలోకి ఆహ్వానించింది. పార్టీ అధినేత, ముఖ్య నేతలు రాజయ్యకు ఫోన్ చేసి పార్టీలోకి పిలవడంతోపాటు వరంగల్ పార్లమెంటు టికెట్ కేటాయిస్తామని రాజయ్యతో చర్చించినట్లు సమాచారం. అందుకు రాజయ్య సైతం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
వరంగల్ పార్లమెంటు టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఒకరిద్దరు నేతలు తప్ప తాటికొండ రాజయ్యను వ్యతిరేకించేవారు ఎవరూ లేరు దీంతో తాటికొండ రాజయ్య టీఆర్ఎస్ లో చేరిక దాదాపు ఖరారు అయినట్టే తెలుస్తుంది. ఈ వ్యూహం వెనుక.. తాము టికెట్ ఇచ్చి, గెలిపించుకున్న కడియం కుటుంబం తమకు ద్రోహం చేసిందని.. ఆయనకు చెక్ పెట్టాలన్నదే బీఆర్ ఎస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…