“నా దగ్గర ఎన్నికల్లో పోటీచేసేంత డబ్బులేదు. అందుకే ఎన్నికలకు దూరంగా దూరంగా ఉంటున్నా”- ఇదీ.. కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ చెప్పిన మాట. అంటే.. టికెట్ ఇవ్వడానికి డబ్బు కూడా ఒక కొలమానం అని ఆమె చెప్పకనే చెప్పారు కదా! మరి ఈ విసయంలో రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఏం పాపం చేశారు? ఆయన దగ్గర డబ్బుకు కొదవ లేదని.. ఆయన సమర్పించిన అఫిడవిట్లలోనే(2019) స్పష్టంగా ఉందికదా! ఇదే విషయాన్ని తాజాగా ఏడీఆర్ నివేదిక కూడా స్పష్టం చేసింది కదా! మరి ఇంత డబ్బున్నా రఘురామకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
నరసాపురం పార్లమెంటు సభ్యుడు.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ రాలేదని ఆయన, ఆయనతోపాటు ఆయన అభిమానులు కూడా తెగ ఫీలవుతున్నారు. నిజమే. టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకు న్నాక.. రాకపోతే ఇబ్బందే కదా! పైగా సీఎం జగన్పై కారాలు మిరియాలు నూరడడమే కాదు.. ఏకంగా కేసులు కూడా పెట్టారు. మరింతగా సీఎం జగన్పై పోరాటం చేసిన ఆయనకు టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో రఘురామ అభిమానులు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు.
ఇలాంటి సమయంలో టికెట్ విషయాన్ని పక్కన పెడితే.. మరో సంచలన వార్త తెరమీదికి వచ్చింది. అది కూడా రఘురామ గురించే కావడం గమనార్హం. దేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీల్లో రఘురామ కూడా ఒకరని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ముగ్గురు ఎంపీల ఆస్తులు.. రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని.. వీరిలో తొలి రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మూడో స్తానంలో రఘురామ ఉన్నారని లెక్కలతోసహా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మరి ఇలాంటి నాయకుడికి బీజేపీ మొండి చేయి చూపించడం ఏంటి? అనేది ఆసక్తికర ప్రశ్న. మరి దీనివెనుక రఘురామ చెబుతున్నట్టుగా సీఎం జగన్ ఒత్తిడి ఉందా? లేక.. ఇంకేదైనా కారణమా? అనేది చూడాలి.
ఇదిలావుంటే, దేశంలో ఎంపీలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని కూడా ఏడీఆర్ ప్రస్తావించింది. లోక్సభలోని 514 మంది ఎంపీల్లో 225(44%) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు స్పష్టమైంది. వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఇక, వీరిలో 5 శాతం మంది ఎంపీలు రూ.100 కోట్లకు పైబడి ఆస్తులు కలిగినట్టు తెలిపింది.
This post was last modified on March 31, 2024 7:25 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…