Political News

మూకుమ్మ‌డి రాజీనామాలు పెద్ద డ్రామా: ష‌ర్మిల

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. “ప్ర‌త్యేక మోదా కోసం.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు మూకుమ్మ‌డి రాజీనామాలు చేయాల‌న్న జ‌గ‌న్ పిలుపు పెద్ద‌డ్రామా” అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువ‌చ్చే విషయంలో జ‌గ‌న్‌.. నాటకాలాడారని విమర్శించారు. స్పెషల్ స్టేటస్ కోసం మూకుమ్మడి రాజీనామాలు అని చెప్పి డ్రామాలాడారని దుయ్యబట్టారు. వైసీపీ తరపున గెలుపొందిన 22 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్ల పాటు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ష‌ర్మిల పేర్కొన్నారు. దీనిపైనే రాహుల్ గాంధీ ఫ‌స్ట్ సంత‌కం చేస్తార‌న్నారు. ఈ ప్ర‌భుత్వానికి ఏపీ ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని ష‌ర్మిల విమర్శించారు. విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో కాంగ్రెస్ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం జ‌గ‌న్ తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీకి తెర‌చాటున అమ్ముడు పోయార‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారని షర్మిల దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పెద్దలతో ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాపై సోమ‌వారం స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని ష‌ర్మిల చెప్పారు. ఆ రోజే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. కాగా, ఏపీలో పోటీ చేసే అభ్య‌ర్థుల‌కు సంబంధించిన జాబితా సిద్ధమయినట్టు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 1,500 దరఖాస్తులు వచ్చినట్టు షర్మిల వెల్లడించారు. అభ్యర్థుల పనితీరుపై సర్వే చేయించి తుది జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. అయితే.. టికెట్ వ‌చ్చినా.. రాకున్నా.. పార్టీకోసం ప‌నిచేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. పార్టీని నిల‌బెట్టుకుంటే.. త‌ర్వాత ప‌ద‌వులు అవే వ‌స్తాయ‌న్నారు.

This post was last modified on March 30, 2024 10:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

53 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

60 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago