Political News

‘ఏపీని ఎంత నాశ‌నం చేయాలో అంతా చేశాడు’

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో అవినీతి పెరిగిపోయింద‌ని.. అందుకే తాను ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాన‌ని ఆయ‌న చెప్పారు. అవినీతి ప్ర‌భుత్వాన్ని అంతం చేయాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని.. ప‌రోక్షంగా వైసీపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ను రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నిర్ణయించిందని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాజంపేట పార్లమెంట్ స్థానంతోపాటు దాని పరిధిలోని ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడానికి ఉమ్మ‌డిగా క‌ష్ట‌ప‌డ‌తామ‌ని చెప్పారు.

“రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఐదేళ్లలో ఏం జరిగిందో నా కంటే మీకే బాగా తెలుసు. 2014 తర్వాత మళ్లీ నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం అవినీతిని మట్టి కరిపించడానికి. ఏపీలో అవినీతి పెరిగిపోయింది. నేను త‌ర‌చుగా ఇక్క‌డ‌కు(చిత్తూరు జిల్లా) వ‌స్తుంటాను. అనేక మంది నాయ‌కులు నాకు చెప్పారు. అవినీతి పెరిగిపోయింద‌ని.. పేద‌ల‌కు రూ.10 ఇచ్చి వారి నుంచి రూ.100 దోచుకుంటున్నార‌ని చెప్పారు. నేను కూడా ప్ర‌త్య‌క్షంగా చూశా. అందుకే రాజ‌కీయంగా మ‌రోసారి పుంజుకుని అవినీతి ప్ర‌భుత్వాన్ని అంతం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా” అని కిర‌ణ్ వ్యాఖ్యానించారు.

“గత ఐదు సంవత్సరాల నుంచి ఏపీ ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసింది. ప్రతి నెల ఆర్బీఐ, కేంద్రం నుంచి అప్పు తీసుకోకపోతే రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాన్ని గ‌త ఐదేళ్ల‌లో ఆయ‌న‌(ప‌రోక్షంగా జ‌గ‌న్‌) ఎంత నాశ‌నం చేయాలో అంతా చేశాడు. దీనిని అభివృద్ధిలో న‌డిపించాల‌న్న ప్ర‌ధాన ఉద్దేశంతోనే మేము(టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ) కలిశాం. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో గల ప్రజలు మాకు పూర్తి మద్దతు ఇవ్వాలి” అని కిర‌ణ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మోడీపై ప్ర‌శంస‌లు

కాగా, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌సంశ‌లు గుప్పించారు. “మోడీ 10 సంవత్సరాలు ప్రధానిగా, 12 సంవత్సరాలు గుజరాత్ సీఎంగా మచ్చలేని నేతగా ప‌నిచేశారు. ప్రజల కోసం ఈ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం దేశ ప్రజల కోసం కృషి చేస్తున్న శ్రమజీవి. ఐదు ఇస్లామిక్ దేశాలలో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న వ్యక్తి మోడీ. విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతుందని మోడీ ముందే చెప్పార”ని అన్నారు.

Satya

Recent Posts

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

60 minutes ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

1 hour ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

2 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

4 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

5 hours ago