ఏపీ సీఎం జగన్ పర్యటనలో ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే కర్నూలులో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటించిన సీఎం జగన్కు మహిళలు ఖాళీ బిందెలతో ఎదురొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న హై సెక్యూరిటీ బస్సుపైకి ఆగంతుకుడు చెప్పులు విసిరాడు.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గుంతకల్లు లోని ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఇక్కడి నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రయాణం చేస్తున్న బస్సును ఆపి.. పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోయారు. తొలుత ఆయన ఈ ప్రచారానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో అనూహ్యంగా సీఎం జగన్ను కార్నర్ చేసుకుని గుంపులోని ఓ వ్యక్తి రెండు చెప్పులు బలంగా విసిరాడు.
దీంతో ఆ రెండు చెప్పుల్లొ ఒకటి బస్సు సైడ్ అద్దాన్ని తాకి కింద పడిపోగా.. రెండో మాత్రం జగన్ కుడి పక్కగా దూసుకుంటూ వెళ్లి సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కానీ, చెప్పులు విసిరిన వ్యక్తిని మాత్రం గుర్తించలేక పోయారు. ఇదిలావుంటే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం .. జొన్నగిరిలోనూ జగన్ యాత్రకు నిరసన సెగ భారీగా తగిలింది.
ఇక్కడ వందల సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు.. తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలతో వచ్చిన మహిళలను పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. అయినప్పటికీ మహిళలు పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని సీఎం ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
This post was last modified on March 30, 2024 9:55 pm
టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమని అన్నా కొణిదెల ఇటీవల కాలంలో తరచుగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. తన…
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…
మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…
ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…
ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…