ఏపీ సీఎం జగన్ పర్యటనలో ఘోర అవమానం ఎదురైంది. ఇప్పటికే కర్నూలులో ఎన్నికల ప్రచారం నిమిత్తం పర్యటించిన సీఎం జగన్కు మహిళలు ఖాళీ బిందెలతో ఎదురొచ్చి తీవ్ర నిరసన తెలిపారు. తాజాగా మరో ఘోరం చోటు చేసుకుంది. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న హై సెక్యూరిటీ బస్సుపైకి ఆగంతుకుడు చెప్పులు విసిరాడు.
అనంతపురం జిల్లాలో సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గుంతకల్లు లోని ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఇక్కడి నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రయాణం చేస్తున్న బస్సును ఆపి.. పైకి ఎక్కి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోయారు. తొలుత ఆయన ఈ ప్రచారానికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో అనూహ్యంగా సీఎం జగన్ను కార్నర్ చేసుకుని గుంపులోని ఓ వ్యక్తి రెండు చెప్పులు బలంగా విసిరాడు.
దీంతో ఆ రెండు చెప్పుల్లొ ఒకటి బస్సు సైడ్ అద్దాన్ని తాకి కింద పడిపోగా.. రెండో మాత్రం జగన్ కుడి పక్కగా దూసుకుంటూ వెళ్లి సెక్యూరిటీ సిబ్బందికి తగిలింది. దీంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కానీ, చెప్పులు విసిరిన వ్యక్తిని మాత్రం గుర్తించలేక పోయారు. ఇదిలావుంటే, కర్నూలు జిల్లా తుగ్గలి మండలం .. జొన్నగిరిలోనూ జగన్ యాత్రకు నిరసన సెగ భారీగా తగిలింది.
ఇక్కడ వందల సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు.. తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖాళీ బిందెలతో వచ్చిన మహిళలను పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు. అయినప్పటికీ మహిళలు పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను దాటుకుని సీఎం ప్రయాణిస్తున్న బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు.
This post was last modified on March 30, 2024 9:55 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…