Political News

కూట‌మి పార్టీలు త‌ప్పు చేశాయి: ర‌ఘురామ

టికెట్ ఇవ్వ‌లేదు. ఇస్తార‌నే సంకేతాలు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయినా కూడా.. న‌ర‌సాపురం రెబల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం న‌మ్మ‌కం పోగొట్టుకోవ‌డం లేదు. తాజాగా కూడా మ‌రోసారి ర‌ఘురామ త‌న‌కు టికెట్ ఇస్తార‌ని, వ‌స్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాజాగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. కూట‌మి పార్టీలు త‌ప్పులు చేశాయ‌ని చెప్పారు.

“కూట‌మిగా ఏర్ప‌డిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో నాకున్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదు. అందుకే నా గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చు” అని అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన వారి గురించి మాట్లాడుతూ.. పొత్తుల కార‌ణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని.. ఈ విష‌యం వారికి కూడా తెలుస‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. అయితే.. భావోద్వేగంతోనే కొంద‌రు నాయ‌కులు ఇలా చేస్తు్న్నార‌ని అంటున్నారు. ఇక‌, కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు.

నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ర‌ఘురామ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

This post was last modified on March 30, 2024 12:11 pm

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

20 minutes ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

55 minutes ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

2 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

3 hours ago

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

5 hours ago