Political News

కూట‌మి పార్టీలు త‌ప్పు చేశాయి: ర‌ఘురామ

టికెట్ ఇవ్వ‌లేదు. ఇస్తార‌నే సంకేతాలు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయినా కూడా.. న‌ర‌సాపురం రెబల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం న‌మ్మ‌కం పోగొట్టుకోవ‌డం లేదు. తాజాగా కూడా మ‌రోసారి ర‌ఘురామ త‌న‌కు టికెట్ ఇస్తార‌ని, వ‌స్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాజాగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. కూట‌మి పార్టీలు త‌ప్పులు చేశాయ‌ని చెప్పారు.

“కూట‌మిగా ఏర్ప‌డిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో నాకున్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదు. అందుకే నా గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చు” అని అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన వారి గురించి మాట్లాడుతూ.. పొత్తుల కార‌ణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని.. ఈ విష‌యం వారికి కూడా తెలుస‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. అయితే.. భావోద్వేగంతోనే కొంద‌రు నాయ‌కులు ఇలా చేస్తు్న్నార‌ని అంటున్నారు. ఇక‌, కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు.

నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ర‌ఘురామ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

This post was last modified on March 30, 2024 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago