టికెట్ ఇవ్వలేదు. ఇస్తారనే సంకేతాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. అయినా కూడా.. నరసాపురం రెబల్ ఎంపీ.. రఘురామకృష్ణ రాజు మాత్రం నమ్మకం పోగొట్టుకోవడం లేదు. తాజాగా కూడా మరోసారి రఘురామ తనకు టికెట్ ఇస్తారని, వస్తుందని చెప్పడం గమనార్హం. తాజాగా రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. కూటమి పార్టీలు తప్పులు చేశాయని చెప్పారు.
“కూటమిగా ఏర్పడిన బీజేపీ-జనసేన-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో నాకున్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదు. అందుకే నా గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చు” అని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించి భంగపడిన వారి గురించి మాట్లాడుతూ.. పొత్తుల కారణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుందని.. ఈ విషయం వారికి కూడా తెలుసని రఘురామ వ్యాఖ్యానించారు. అయితే.. భావోద్వేగంతోనే కొందరు నాయకులు ఇలా చేస్తు్న్నారని అంటున్నారు. ఇక, కూటమి విజయం ఖాయమని చెప్పిన ఆయన.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు.
నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని రఘురామ ఆశాభావం వ్యక్తం చేశారు.
This post was last modified on March 30, 2024 12:11 pm
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…