Political News

కూట‌మి పార్టీలు త‌ప్పు చేశాయి: ర‌ఘురామ

టికెట్ ఇవ్వ‌లేదు. ఇస్తార‌నే సంకేతాలు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయినా కూడా.. న‌ర‌సాపురం రెబల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం న‌మ్మ‌కం పోగొట్టుకోవ‌డం లేదు. తాజాగా కూడా మ‌రోసారి ర‌ఘురామ త‌న‌కు టికెట్ ఇస్తార‌ని, వ‌స్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాజాగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. కూట‌మి పార్టీలు త‌ప్పులు చేశాయ‌ని చెప్పారు.

“కూట‌మిగా ఏర్ప‌డిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో నాకున్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదు. అందుకే నా గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చు” అని అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన వారి గురించి మాట్లాడుతూ.. పొత్తుల కార‌ణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని.. ఈ విష‌యం వారికి కూడా తెలుస‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. అయితే.. భావోద్వేగంతోనే కొంద‌రు నాయ‌కులు ఇలా చేస్తు్న్నార‌ని అంటున్నారు. ఇక‌, కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు.

నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ర‌ఘురామ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

This post was last modified on March 30, 2024 12:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాకా… ఈ కథ ఇప్పటిది కాదు

రాకా.. ఈ రోజు సోషల్ మీడియాను ఊపేస్తున్న పేరు. ఎక్స్‌ సహా అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఈ పేరు టాప్‌లో…

33 minutes ago

40 కోట్ల స్కాం… రోజా ‘ఆట’కట్టు?

‘‘ఆడుదాం ఆంధ్రా’’ అంటూ వైసీపీ హయాంలో ఓ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఆటల పేరుతో మాజీ మంత్రి…

3 hours ago

రాధాకృష్ణను స్టేషన్ల చుట్టూ తిప్పుతా: జగన్

వైసీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులనుద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు…

4 hours ago

బుచ్చిబాబు వేట ఇంకా పూర్తవ్వలేదా

ఏప్రిల్ 30 నుంచి తప్పుకున్నాక పెద్ది కొంచెం రిలాక్స్ మోడ్ లోకి వచ్చేసింది కానీ దర్శకుడు బుచ్చిబాబుకి మాత్రం ఇటెమ్…

5 hours ago

క్యామియోల కోసం జైలర్ 2 తిప్పలు?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అద్భుతమైన కంబ్యాక్ గా నిలిచిన జైలర్ కొనసాగింపు జైలర్ 2 షూటింగ్ చివరి…

6 hours ago

పాలిటిక్స్ లోకి వచ్చాకే బీపీ షుగర్: రోజా

రాజకీయ నాయకులు సవాలక్ష పనులతో బిజీబిజీగా ఉంటారు. అనేక ఒత్తిళ్లు, తీరిక లేని షెడ్యూళ్లు..వెరసి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అనేది…

7 hours ago