Political News

కూట‌మి పార్టీలు త‌ప్పు చేశాయి: ర‌ఘురామ

టికెట్ ఇవ్వ‌లేదు. ఇస్తార‌నే సంకేతాలు కూడా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అయినా కూడా.. న‌ర‌సాపురం రెబల్ ఎంపీ.. ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం న‌మ్మ‌కం పోగొట్టుకోవ‌డం లేదు. తాజాగా కూడా మ‌రోసారి ర‌ఘురామ త‌న‌కు టికెట్ ఇస్తార‌ని, వ‌స్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. తాజాగా ర‌ఘురామ‌కృష్ణ‌రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. కూట‌మి పార్టీలు త‌ప్పులు చేశాయ‌ని చెప్పారు.

“కూట‌మిగా ఏర్ప‌డిన బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీలు.. సీట్ల కేటాయింపుల్లో కొన్ని తప్పులు చేశాయి. అయితే.. వాటిని సరిదిద్దుకుంటే మరిన్ని ఎక్కువ సీట్లను కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి తరపున నాకు టికెట్ వస్తుందనే నమ్మకం ఉంది. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశమే లేదు. ఢిల్లీలోని బీజేపీ నేతలతో నాకున్న సాన్నిహిత్యం జిల్లాలోని బీజేపీ నేతలతో లేదు. అందుకే నా గురించి ఢిల్లీకి వ్యతిరేక సంకేతాలు వెళ్లి ఉండవచ్చు” అని అన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ టికెట్లు ఆశించి భంగ‌ప‌డిన వారి గురించి మాట్లాడుతూ.. పొత్తుల కార‌ణంగా కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వ‌స్తుంద‌ని.. ఈ విష‌యం వారికి కూడా తెలుస‌ని ర‌ఘురామ వ్యాఖ్యానించారు. అయితే.. భావోద్వేగంతోనే కొంద‌రు నాయ‌కులు ఇలా చేస్తు్న్నార‌ని అంటున్నారు. ఇక‌, కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌ని చెప్పిన ఆయ‌న‌.. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబేనని, ఈ విషయాన్ని బల్లగుద్ది చెపుతున్నానని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలవాల్సి ఉందని చెప్పారు.

నరసాపురం బీజేపీ అభ్యర్థి శ్రీనివాసవర్మ తనకు మంచి మిత్రుడని రఘురాజు చెప్పారు. గత 30 ఏళ్లుగా పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తించి, పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చి ఉండొచ్చని తెలిపారు. ఢిల్లీ పెద్దలు ఇంకా ఆరా తీస్తున్నారని, సర్వేలు చేయిస్తున్నారని, ఏదైనా జరిగే అవకాశం ఉందని చెప్పారు. తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ర‌ఘురామ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

This post was last modified on March 30, 2024 12:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

3 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

3 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

5 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

5 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

10 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

12 hours ago