Political News

ఆర్థిక దిగ్బంధ‌నంలో కాంగ్రెస్.. 1700 కోట్లు క‌ట్టాల‌ని నోటీసులు

దేశ‌వ్యాప్తంగా తిరిగి పుంజుకుని.. అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న జాతీయ పార్టీ కాంగ్రెస్‌.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ఆ పార్టీ పునాదులు క‌దిలిపోతున్నాయి. ఒక‌వైపు నేత‌లు పోతున్నారు. మ‌రో వైపు కేసుల ఉచ్చు బిగుసు కుంటోంది. తాజాగా  ఆదాయపు పన్నుకు సంబంధించి కాంగ్రెస్‌కు మరోసారి ఐటీ నుంచి నోటీసులు అందాయి. 2017-18 నుంచి 2020-21 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీతో సహా దాదాపు రూ.1700 కోట్ల నోటీసును ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అందజేసింది.

నాలుగు అసెస్‌మెంట్ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో చేసిన అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చిన గంటల వ్యవధిలోనే ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్తంభించిన బ్యాంకు ఖాతాల వల్ల నగదు కొరత ఏర్పడింది. మరోవైపు తాజా నోటీసులతో కాంగ్రెస్‌ ఇరకాటంలో పడ్డట్లైంది. దెబ్బ మీద దెబ్బ పడటంతో కాంగ్రెస్‌ నేతల్లో ఆందోళన నెలకొంది. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే  ఐటీ నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ లాయర్, రాజ్యసభ ఎంపీ వివేక్ తంఖా ఆరోపించారు.

ఇది అప్రజాస్వామిక చర్య అని, అసమంజసమైనదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ఇదంతా చేస్తుందని ఆయన దుయ్యబట్టారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్‌ చేస్తామ న్నారు. కాగా, 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్‌ గత వారం ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌లో కాంగ్రెస్ పార్టీ 2014-15 నుంచి 2016-17 అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు సంబంధించిన రీఅసెస్‌మెంట్ ప్రొసీడింగ్‌లను నిలిపివేయాలని కోరుతూ సవాలు చేసింది.

ఈ పిటిషన్ల విచారణ సమయంలో ఈ మూడేళ్లలో దాదాపు రూ.520 కోట్లు మదింపు నుంచి తప్పించుకున్నట్లు పన్ను శాఖ వాదించింది. ఐటీ శాఖ ఖచ్చితమైన సాక్ష్యాలను సమర్పించినందున న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషైంద్ర కుమార్ కౌరవ్‌లతో కూడిన ధర్మాసనం  ఈ పిటీషన్లను కొట్టేసింది. 2014-15 నుంచి 2016-17 వరకు ఐటీ పన్నులకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు తాజా పిటిషన్‌కు కూడా వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొంది. ఇక 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను బకాయిలు, వడ్డీలకు సంబంధించి కాంగ్రెస్ ఢిల్లీ బ్యాంక్ ఖాతాల నుంచి ఇప్పటికే రూ.135 కోట్లను ఆదాయ పన్ను శాఖ రికవరీ చేసింది. దీంతో కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ కాంగ్రెస్ ఆర్థికంగా దిగ్బంధ‌నంలో చిక్కుకు పోయింది. 

Satya

Recent Posts

ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఎలా ఉన్నారు..?

2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి గురువారానికి సరిగ్గా రెండేళ్లు పూర్తి అయ్యింది. ఆ ఎన్నికల్లో కేంద్రంలో వరుసగా మూడో…

53 minutes ago

మాట నిలబెట్టుకున్న AR రెహమాన్

అనిరుధ్, తమన్, అజనీష్, సాయి అభ్యంక్కర్ లాంటి న్యూ ఏజ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇంత మంది ఉండగా ముప్పై సంవత్సరాల…

3 hours ago

బండ్ల గణేష్ ఫైర్.. ప్రకాష్ రాజ్‌కు స్ట్రాంగ్ కౌంటర్

సినీ నిర్మాతల్లో బండ్ల గణేష్ డిఫరెంట్. సినీ రంగంలో మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రత్యేకించి…

4 hours ago

దేశంలో ఒకే ఒక్కడు… మోడీ రికార్డ్‌!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా స‌రికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాలించిన ప్ర‌ధాన మంత్రిగా ఇప్ప‌టి వ‌ర‌కు…

4 hours ago

పది మెట్లు ఎక్కేసిన రామ్ చరణ్

పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…

5 hours ago

కాంగ్రెస్ కు ఎంపీ సీటు… విజయ్ వ్యూహం అదుర్స్?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…

6 hours ago