ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కరు కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ముద్రపడిన తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జైలు విధించింది. ఈ క్రమంలో కవిత మూడు రోజులు గా జైల్లోనే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆమె జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు.
తీహార్ జైలు అధికారులు తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని, కోర్టు ఆదేశాలేవీ పాటంచడం లేదని కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ప్రత్యేకంగా గురువారం సాయంత్రం రౌస్ అవెన్యూ కోర్టులోనే ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేశారు. “జైలు అధికారులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. కోర్టు ఆదేశాలను ఏమాత్రం పాటించ డం లేదు” అని తన అఫిడవిట్లో కవిత పేర్కొన్నారు. అంతేకాదు.. కోర్టు తనకు ఇంటి భోజనం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్స్, బుక్స్, కళ్లజోడు, మందులు ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
అయితే.. కోర్టు ఆదేశించినట్టు పోలీసులు తనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. “కనీసం కళ్ళజోడు కూడా ఇవ్వలేదు. పెన్ను… పేపర్లు అడిగితే.. నీకెందుకంటూ.. అగౌరవంగా మాట్లాడుతు న్నారు. ఇంటి నుంచి భోజనం కూడా తెచ్చుకోనివ్వడం లేదు“ అని కవిత తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తనను అగౌరవ పరిచిన జైలు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాదు.. సూపరింటెండెంట్పై నా చర్యలకు ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ శనివారం విచారణకు రానుంది.
This post was last modified on March 29, 2024 11:23 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…