Political News

పోలీసులు నా హక్కులు కాలరాస్తున్నారు: క‌విత

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌రు కుంభ‌కోణంలో ప్ర‌ధాన నిందితురాలిగా ముద్ర‌ప‌డిన తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత ప్ర‌స్తుతం తీహార్ జైల్లో ఉన్న విష‌యం తెలిసిందే. 14 రోజుల పాటు ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జైలు విధించింది. ఈ క్ర‌మంలో క‌విత మూడు రోజులు గా జైల్లోనే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆమె జైలు అధికారుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తీహార్ జైలు అధికారులు త‌న‌ హక్కులకు భంగం కలిగిస్తున్నారని, కోర్టు ఆదేశాలేవీ పాటంచడం లేదని క‌విత పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఆమె ప్ర‌త్యేకంగా గురువారం సాయంత్రం రౌస్ అవెన్యూ కోర్టులోనే ప్ర‌త్యేక అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. “జైలు అధికారులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. క‌నీస గౌర‌వం కూడా ఇవ్వ‌డం లేదు. కోర్టు ఆదేశాల‌ను ఏమాత్రం పాటించ డం లేదు” అని త‌న అఫిడ‌విట్‌లో క‌విత పేర్కొన్నారు. అంతేకాదు.. కోర్టు త‌న‌కు ఇంటి భోజ‌నం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్స్‌, బుక్స్‌, క‌ళ్ల‌జోడు, మందులు ఇవ్వాల‌ని ఆదేశించిన విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించారు.

అయితే.. కోర్టు ఆదేశించిన‌ట్టు పోలీసులు త‌న‌కు ఒక్కటంటే ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేద‌ని క‌విత పేర్కొన్నారు. “క‌నీసం క‌ళ్ళ‌జోడు కూడా ఇవ్వ‌లేదు. పెన్ను… పేప‌ర్లు అడిగితే.. నీకెందుకంటూ.. అగౌర‌వంగా మాట్లాడుతు న్నారు. ఇంటి నుంచి భోజ‌నం కూడా తెచ్చుకోనివ్వ‌డం లేదు“ అని క‌విత త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. త‌న‌ను అగౌర‌వ ప‌రిచిన జైలు అధికారుల‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును కోరారు. అంతేకాదు.. సూప‌రింటెండెంట్‌పై నా చ‌ర్య‌ల‌కు ఆదేశించాల‌ని అభ్య‌ర్థించారు. ఈ పిటిష‌న్ శ‌నివారం విచార‌ణ‌కు రానుంది. 

This post was last modified on March 29, 2024 11:23 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

40 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago