ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కరు కుంభకోణంలో ప్రధాన నిందితురాలిగా ముద్రపడిన తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. 14 రోజుల పాటు ఆమెకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు జైలు విధించింది. ఈ క్రమంలో కవిత మూడు రోజులు గా జైల్లోనే ఉంటున్నారు. అయితే.. తాజాగా ఆమె జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు.
తీహార్ జైలు అధికారులు తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని, కోర్టు ఆదేశాలేవీ పాటంచడం లేదని కవిత పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ప్రత్యేకంగా గురువారం సాయంత్రం రౌస్ అవెన్యూ కోర్టులోనే ప్రత్యేక అఫిడవిట్ దాఖలు చేశారు. “జైలు అధికారులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. కోర్టు ఆదేశాలను ఏమాత్రం పాటించ డం లేదు” అని తన అఫిడవిట్లో కవిత పేర్కొన్నారు. అంతేకాదు.. కోర్టు తనకు ఇంటి భోజనం, పరుపు, చెప్పులు, దుస్తులు, బెడ్ షీట్స్, బుక్స్, కళ్లజోడు, మందులు ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
అయితే.. కోర్టు ఆదేశించినట్టు పోలీసులు తనకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని కవిత పేర్కొన్నారు. “కనీసం కళ్ళజోడు కూడా ఇవ్వలేదు. పెన్ను… పేపర్లు అడిగితే.. నీకెందుకంటూ.. అగౌరవంగా మాట్లాడుతు న్నారు. ఇంటి నుంచి భోజనం కూడా తెచ్చుకోనివ్వడం లేదు“ అని కవిత తన అఫిడవిట్లో పేర్కొన్నారు. తనను అగౌరవ పరిచిన జైలు అధికారులపై తక్షణమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అంతేకాదు.. సూపరింటెండెంట్పై నా చర్యలకు ఆదేశించాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ శనివారం విచారణకు రానుంది.
This post was last modified on March 29, 2024 11:23 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…