Political News

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం- అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మన్ భ‌ర్త.. ప్ర‌ముఖ విశ్లేష‌కుడు పర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఇవి పార్లమెం టు ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని అన్నారు. ఓట్ల‌ను కొనేందుకు, అభ్య‌ర్థుల‌ను తారు మారు చేసేందుకు ఈ నిధులు దోహ‌ద ప‌డ‌తాయ‌ని ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్ప‌టికే దేశంలో ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం తెలిసిందే.

2019లో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్స్ ద్వారా.. ఎవ‌రైనా స‌రే.. త‌మ పేరును వెల్ల‌డించ‌కుండా.. పార్టీల‌కు విరాళాలు ఇవ్వొచ్చు. ఇదే  ఇప్పుడు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ విష‌యాన్ని కార్న‌ర్ చేసుకుని..  పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.  ఇది ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని చెప్పారు.

అంతేకాదు.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందన్నారు. ఎల క్టోరల్ బాండ్స్ ఇష్యూ రోజురోజుకూ పెరుగుతోందని… అదొక కుంభకోణమనే సంగతి ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ పెద్ద సమస్యగా మారుతుందని ప్ర‌భాక‌ర్ చెప్పారు. ఇది రాజ‌కీయ దుమారం క‌న్నా.. కూడా.. ఓట‌ర్ల దుమారంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఎట్ట‌కేల‌కు గుట్టు ర‌ట్టు!

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌ను జాతీయ బ్యాంకైన ఎస్‌బీఐ సేక‌రించింది.(విక్ర‌యించింది) అయితే..ఇది అత్యంత గోప్యంగా ఉంచారు కానీ, మ‌హిళా జ‌ర్న‌లిస్టు వేసిన పిటిష‌న్‌తో క‌దిలిన ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యే వ‌ర‌కు సాగింది. ఎట్ట‌కేల‌కు.. అతి క‌ష్టం మీద ఈగుట్టును ఎస్‌బీఐ బ‌య‌ట పెట్టింది. అంతేకాదు.. ఎవ‌రెవ‌రు ఏయే పార్టీల‌కు ఎంతెంత ఇచ్చార‌నే విష‌యం కూడా వెలుగు చూసింది. బీజేపీలో ఉండి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి.. వైసీపీలో ఉండి టీడీపీకి విరాళాలు ఇచ్చిన నాయ‌కులు కూడా ఉన్నారు.

ఇవీ పార్టీలకు అందిన విరాళాలు

బీజేపీ- రూ. 6,986.5 కోట్లు
టీఎంసీ- రూ. 1,397 కోట్లు
కాంగ్రెస్ – రూ. 1,334 కోట్లు
బీఆర్ఎస్ – రూ. 1,322 కోట్లు
వైసీపీ – రూ.1250 కోట్లు
టీడీపీ – రూ. 850 కోట్లు

This post was last modified on March 28, 2024 11:54 pm

Share

Recent Posts

పిఠాపురంలో ఎవ్వ‌రికి ఛాన్స్ లేద‌బ్బా.. !

సామాజికంగా.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ప‌రంగా.. నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క‌…

40 minutes ago

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

1 hour ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

2 hours ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

2 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

3 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

4 hours ago