Political News

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం- అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మన్ భ‌ర్త.. ప్ర‌ముఖ విశ్లేష‌కుడు పర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఇవి పార్లమెం టు ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని అన్నారు. ఓట్ల‌ను కొనేందుకు, అభ్య‌ర్థుల‌ను తారు మారు చేసేందుకు ఈ నిధులు దోహ‌ద ప‌డ‌తాయ‌ని ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్ప‌టికే దేశంలో ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం తెలిసిందే.

2019లో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్స్ ద్వారా.. ఎవ‌రైనా స‌రే.. త‌మ పేరును వెల్ల‌డించ‌కుండా.. పార్టీల‌కు విరాళాలు ఇవ్వొచ్చు. ఇదే  ఇప్పుడు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ విష‌యాన్ని కార్న‌ర్ చేసుకుని..  పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.  ఇది ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని చెప్పారు.

అంతేకాదు.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందన్నారు. ఎల క్టోరల్ బాండ్స్ ఇష్యూ రోజురోజుకూ పెరుగుతోందని… అదొక కుంభకోణమనే సంగతి ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ పెద్ద సమస్యగా మారుతుందని ప్ర‌భాక‌ర్ చెప్పారు. ఇది రాజ‌కీయ దుమారం క‌న్నా.. కూడా.. ఓట‌ర్ల దుమారంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఎట్ట‌కేల‌కు గుట్టు ర‌ట్టు!

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌ను జాతీయ బ్యాంకైన ఎస్‌బీఐ సేక‌రించింది.(విక్ర‌యించింది) అయితే..ఇది అత్యంత గోప్యంగా ఉంచారు కానీ, మ‌హిళా జ‌ర్న‌లిస్టు వేసిన పిటిష‌న్‌తో క‌దిలిన ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యే వ‌ర‌కు సాగింది. ఎట్ట‌కేల‌కు.. అతి క‌ష్టం మీద ఈగుట్టును ఎస్‌బీఐ బ‌య‌ట పెట్టింది. అంతేకాదు.. ఎవ‌రెవ‌రు ఏయే పార్టీల‌కు ఎంతెంత ఇచ్చార‌నే విష‌యం కూడా వెలుగు చూసింది. బీజేపీలో ఉండి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి.. వైసీపీలో ఉండి టీడీపీకి విరాళాలు ఇచ్చిన నాయ‌కులు కూడా ఉన్నారు.

ఇవీ పార్టీలకు అందిన విరాళాలు

బీజేపీ- రూ. 6,986.5 కోట్లు
టీఎంసీ- రూ. 1,397 కోట్లు
కాంగ్రెస్ – రూ. 1,334 కోట్లు
బీఆర్ఎస్ – రూ. 1,322 కోట్లు
వైసీపీ – రూ.1250 కోట్లు
టీడీపీ – రూ. 850 కోట్లు

Satya

Recent Posts

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

28 minutes ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

48 minutes ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

2 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

3 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

3 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

4 hours ago