Political News

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం- అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మన్ భ‌ర్త.. ప్ర‌ముఖ విశ్లేష‌కుడు పర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఇవి పార్లమెం టు ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని అన్నారు. ఓట్ల‌ను కొనేందుకు, అభ్య‌ర్థుల‌ను తారు మారు చేసేందుకు ఈ నిధులు దోహ‌ద ప‌డ‌తాయ‌ని ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్ప‌టికే దేశంలో ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం తెలిసిందే.

2019లో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్స్ ద్వారా.. ఎవ‌రైనా స‌రే.. త‌మ పేరును వెల్ల‌డించ‌కుండా.. పార్టీల‌కు విరాళాలు ఇవ్వొచ్చు. ఇదే  ఇప్పుడు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ విష‌యాన్ని కార్న‌ర్ చేసుకుని..  పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.  ఇది ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని చెప్పారు.

అంతేకాదు.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందన్నారు. ఎల క్టోరల్ బాండ్స్ ఇష్యూ రోజురోజుకూ పెరుగుతోందని… అదొక కుంభకోణమనే సంగతి ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ పెద్ద సమస్యగా మారుతుందని ప్ర‌భాక‌ర్ చెప్పారు. ఇది రాజ‌కీయ దుమారం క‌న్నా.. కూడా.. ఓట‌ర్ల దుమారంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఎట్ట‌కేల‌కు గుట్టు ర‌ట్టు!

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌ను జాతీయ బ్యాంకైన ఎస్‌బీఐ సేక‌రించింది.(విక్ర‌యించింది) అయితే..ఇది అత్యంత గోప్యంగా ఉంచారు కానీ, మ‌హిళా జ‌ర్న‌లిస్టు వేసిన పిటిష‌న్‌తో క‌దిలిన ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యే వ‌ర‌కు సాగింది. ఎట్ట‌కేల‌కు.. అతి క‌ష్టం మీద ఈగుట్టును ఎస్‌బీఐ బ‌య‌ట పెట్టింది. అంతేకాదు.. ఎవ‌రెవ‌రు ఏయే పార్టీల‌కు ఎంతెంత ఇచ్చార‌నే విష‌యం కూడా వెలుగు చూసింది. బీజేపీలో ఉండి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి.. వైసీపీలో ఉండి టీడీపీకి విరాళాలు ఇచ్చిన నాయ‌కులు కూడా ఉన్నారు.

ఇవీ పార్టీలకు అందిన విరాళాలు

బీజేపీ- రూ. 6,986.5 కోట్లు
టీఎంసీ- రూ. 1,397 కోట్లు
కాంగ్రెస్ – రూ. 1,334 కోట్లు
బీఆర్ఎస్ – రూ. 1,322 కోట్లు
వైసీపీ – రూ.1250 కోట్లు
టీడీపీ – రూ. 850 కోట్లు

This post was last modified on March 28, 2024 11:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

11 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

11 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

12 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

12 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

14 hours ago