Political News

విశాఖ‌ను అందుకే రాజ‌ధానిగా కావాలంటున్నారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ‌ప‌ట్నా న్ని వైసీపీ రాజ‌ధానిగా ఎందుకు చేసుకోవాల‌ని అనుకుంటోందో ఆమె వివ‌రించారు. “ఇటీవ‌ల విశాఖ ప‌ట్నా నికి.. 25 వేల కిలోల డ్ర‌గ్స్‌తో కూడిన కంటైన‌ర్ వ‌చ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వ‌చ్చింద‌ని అంటున్నారు. విశాఖ‌లో తీర ప్రాంతం ఉండడం.. బ‌ల‌మైన పోర్టు ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి ఇలాంటి గంజాయి.. డ్ర‌గ్స్‌ను ర‌వాణా చేసుకునేందుకు సుల‌భంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్క‌డ రాజధాని కావాల‌ని అంటోంది” అని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. త‌ప్పుడు ప‌నులు చేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వానికి తెలివి ఎక్కువ‌గా ఉంద‌ని, గంజాయి వ్యాపా రంతో వాళ్ల పొట్ట‌లు, జేబులు నింపుకొంటార‌ని నారా భువనేశ్వ‌రి విమ‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నాన్ని గంజాయి కేపిట‌ల్ గా తీర్చిదిద్దుతున్నార‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. తాజాగా నిజం గెల‌వాలి యాత్ర చేస్తున్న నారా భువ నేశ్వ‌రి.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు అరెస్టును త‌ట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌రు.

ఈ సంద‌ర్భంగా భ‌వ‌నేశ్వ‌రి మాట్లాడుతూ… రాష్ట్రంలో 31 వేల 196కుపైగా మ‌హిళ‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని .. ఇప్ప‌టికీ వారు ఎక్క‌డున్నారో తెలియ‌డం లేద‌ని, క‌నీసం ఈ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు కూడా లేద‌న్నారు. ఇదీ వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ల‌భిస్తున్న భ‌ద్రత అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి, క‌ల్తీమ‌ద్యంతో నింపేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

గంజాయి కార‌ణంగా అసాంఘిక శ‌క్తులు పేట్రేగిపోతున్నాయ‌న్నారు. అనేక మంది మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని చెప్పారు. ఐదేళ్ల‌లో ఏమైనా ప‌రిశ్రమ వ‌చ్చిందా?  ఒక్క మంచి ప‌ని అయిన వైసీపీ నేత‌లు చేశారా? అని భువ‌నేశ్వ‌రి ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌జ‌లే స‌మాధానం చెప్పాల‌న్నారు. 

This post was last modified on March 28, 2024 11:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

17 minutes ago

ప్రేక్షకులు మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

2 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

2 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

3 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

4 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

6 hours ago