టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నా న్ని వైసీపీ రాజధానిగా ఎందుకు చేసుకోవాలని అనుకుంటోందో ఆమె వివరించారు. “ఇటీవల విశాఖ పట్నా నికి.. 25 వేల కిలోల డ్రగ్స్తో కూడిన కంటైనర్ వచ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వచ్చిందని అంటున్నారు. విశాఖలో తీర ప్రాంతం ఉండడం.. బలమైన పోర్టు ఉండడంతో ఇక్కడ నుంచి ఇలాంటి గంజాయి.. డ్రగ్స్ను రవాణా చేసుకునేందుకు సులభంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్కడ రాజధాని కావాలని అంటోంది” అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తప్పుడు పనులు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి తెలివి ఎక్కువగా ఉందని, గంజాయి వ్యాపా రంతో వాళ్ల పొట్టలు, జేబులు నింపుకొంటారని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని గంజాయి కేపిటల్ గా తీర్చిదిద్దుతున్నారని ఆమె దుయ్యబట్టారు. తాజాగా నిజం గెలవాలి యాత్ర చేస్తున్న నారా భువ నేశ్వరి.. నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించరు.
ఈ సందర్భంగా భవనేశ్వరి మాట్లాడుతూ… రాష్ట్రంలో 31 వేల 196కుపైగా మహిళలు కనిపించకుండా పోయారని .. ఇప్పటికీ వారు ఎక్కడున్నారో తెలియడం లేదని, కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఇదీ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న భద్రత అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి, కల్తీమద్యంతో నింపేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గంజాయి కారణంగా అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. అనేక మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఎంతో మంది చనిపోతున్నారని చెప్పారు. ఐదేళ్లలో ఏమైనా పరిశ్రమ వచ్చిందా? ఒక్క మంచి పని అయిన వైసీపీ నేతలు చేశారా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. దీనిపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…