Political News

విశాఖ‌ను అందుకే రాజ‌ధానిగా కావాలంటున్నారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ‌ప‌ట్నా న్ని వైసీపీ రాజ‌ధానిగా ఎందుకు చేసుకోవాల‌ని అనుకుంటోందో ఆమె వివ‌రించారు. “ఇటీవ‌ల విశాఖ ప‌ట్నా నికి.. 25 వేల కిలోల డ్ర‌గ్స్‌తో కూడిన కంటైన‌ర్ వ‌చ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వ‌చ్చింద‌ని అంటున్నారు. విశాఖ‌లో తీర ప్రాంతం ఉండడం.. బ‌ల‌మైన పోర్టు ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి ఇలాంటి గంజాయి.. డ్ర‌గ్స్‌ను ర‌వాణా చేసుకునేందుకు సుల‌భంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్క‌డ రాజధాని కావాల‌ని అంటోంది” అని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. త‌ప్పుడు ప‌నులు చేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వానికి తెలివి ఎక్కువ‌గా ఉంద‌ని, గంజాయి వ్యాపా రంతో వాళ్ల పొట్ట‌లు, జేబులు నింపుకొంటార‌ని నారా భువనేశ్వ‌రి విమ‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నాన్ని గంజాయి కేపిట‌ల్ గా తీర్చిదిద్దుతున్నార‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. తాజాగా నిజం గెల‌వాలి యాత్ర చేస్తున్న నారా భువ నేశ్వ‌రి.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు అరెస్టును త‌ట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌రు.

ఈ సంద‌ర్భంగా భ‌వ‌నేశ్వ‌రి మాట్లాడుతూ… రాష్ట్రంలో 31 వేల 196కుపైగా మ‌హిళ‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని .. ఇప్ప‌టికీ వారు ఎక్క‌డున్నారో తెలియ‌డం లేద‌ని, క‌నీసం ఈ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు కూడా లేద‌న్నారు. ఇదీ వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ల‌భిస్తున్న భ‌ద్రత అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి, క‌ల్తీమ‌ద్యంతో నింపేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

గంజాయి కార‌ణంగా అసాంఘిక శ‌క్తులు పేట్రేగిపోతున్నాయ‌న్నారు. అనేక మంది మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని చెప్పారు. ఐదేళ్ల‌లో ఏమైనా ప‌రిశ్రమ వ‌చ్చిందా?  ఒక్క మంచి ప‌ని అయిన వైసీపీ నేత‌లు చేశారా? అని భువ‌నేశ్వ‌రి ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌జ‌లే స‌మాధానం చెప్పాల‌న్నారు. 

This post was last modified on March 28, 2024 11:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago