టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖపట్నా న్ని వైసీపీ రాజధానిగా ఎందుకు చేసుకోవాలని అనుకుంటోందో ఆమె వివరించారు. “ఇటీవల విశాఖ పట్నా నికి.. 25 వేల కిలోల డ్రగ్స్తో కూడిన కంటైనర్ వచ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వచ్చిందని అంటున్నారు. విశాఖలో తీర ప్రాంతం ఉండడం.. బలమైన పోర్టు ఉండడంతో ఇక్కడ నుంచి ఇలాంటి గంజాయి.. డ్రగ్స్ను రవాణా చేసుకునేందుకు సులభంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్కడ రాజధాని కావాలని అంటోంది” అని భువనేశ్వరి వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. తప్పుడు పనులు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి తెలివి ఎక్కువగా ఉందని, గంజాయి వ్యాపా రంతో వాళ్ల పొట్టలు, జేబులు నింపుకొంటారని నారా భువనేశ్వరి విమర్శించారు. విశాఖపట్నాన్ని గంజాయి కేపిటల్ గా తీర్చిదిద్దుతున్నారని ఆమె దుయ్యబట్టారు. తాజాగా నిజం గెలవాలి యాత్ర చేస్తున్న నారా భువ నేశ్వరి.. నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించరు.
ఈ సందర్భంగా భవనేశ్వరి మాట్లాడుతూ… రాష్ట్రంలో 31 వేల 196కుపైగా మహిళలు కనిపించకుండా పోయారని .. ఇప్పటికీ వారు ఎక్కడున్నారో తెలియడం లేదని, కనీసం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఇదీ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు లభిస్తున్న భద్రత అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి, కల్తీమద్యంతో నింపేస్తున్నారని వ్యాఖ్యానించారు.
గంజాయి కారణంగా అసాంఘిక శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. అనేక మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని, ఎంతో మంది చనిపోతున్నారని చెప్పారు. ఐదేళ్లలో ఏమైనా పరిశ్రమ వచ్చిందా? ఒక్క మంచి పని అయిన వైసీపీ నేతలు చేశారా? అని భువనేశ్వరి ప్రశ్నించారు. దీనిపై ప్రజలే సమాధానం చెప్పాలన్నారు.
This post was last modified on March 28, 2024 11:45 pm
ప్రస్తుతం వైసీపీ పెట్టుకున్న లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ తో రాజీనామా చేయించడం. గత వారం రోజులుగా ఈ విషయాన్ని…
నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపేయ్.. లేకుంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతానంటూ ఒక భార్య ప్రియుడికి వాట్సాప్ మెసేజ్…
సక్సెస్ పరంగా అటు బాలీవుడ్లో జాన్వీ కపూర్, ఇటు టాలీవుడ్ లో శ్రీలీల ఇంచుమించు ఒకే ఫేజ్ లో ఉన్నారు.…
కొత్త సినిమాలు చాలా వచ్చాయి కదా, గత వారం రిలీజైన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే జోరు బాగా…
అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం.…
సూర్య హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పేరుకి కోలీవుడ్ మూవీ అయినప్పటికీ దర్శకుడు, నిర్మాత ఇద్దరూ…