Political News

విశాఖ‌ను అందుకే రాజ‌ధానిగా కావాలంటున్నారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ‌ప‌ట్నా న్ని వైసీపీ రాజ‌ధానిగా ఎందుకు చేసుకోవాల‌ని అనుకుంటోందో ఆమె వివ‌రించారు. “ఇటీవ‌ల విశాఖ ప‌ట్నా నికి.. 25 వేల కిలోల డ్ర‌గ్స్‌తో కూడిన కంటైన‌ర్ వ‌చ్చింది. ఇది బ్రెజిల్ నుంచి వ‌చ్చింద‌ని అంటున్నారు. విశాఖ‌లో తీర ప్రాంతం ఉండడం.. బ‌ల‌మైన పోర్టు ఉండ‌డంతో ఇక్క‌డ నుంచి ఇలాంటి గంజాయి.. డ్ర‌గ్స్‌ను ర‌వాణా చేసుకునేందుకు సుల‌భంగా ఉంటుంది. అందుకే వైసీపీ ఇక్క‌డ రాజధాని కావాల‌ని అంటోంది” అని భువ‌నేశ్వ‌రి వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. త‌ప్పుడు ప‌నులు చేయ‌డానికి వైసీపీ ప్ర‌భుత్వానికి తెలివి ఎక్కువ‌గా ఉంద‌ని, గంజాయి వ్యాపా రంతో వాళ్ల పొట్ట‌లు, జేబులు నింపుకొంటార‌ని నారా భువనేశ్వ‌రి విమ‌ర్శించారు. విశాఖ‌ప‌ట్నాన్ని గంజాయి కేపిట‌ల్ గా తీర్చిదిద్దుతున్నార‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు. తాజాగా నిజం గెల‌వాలి యాత్ర చేస్తున్న నారా భువ నేశ్వ‌రి.. నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు అరెస్టును త‌ట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌రు.

ఈ సంద‌ర్భంగా భ‌వ‌నేశ్వ‌రి మాట్లాడుతూ… రాష్ట్రంలో 31 వేల 196కుపైగా మ‌హిళ‌లు క‌నిపించ‌కుండా పోయార‌ని .. ఇప్ప‌టికీ వారు ఎక్క‌డున్నారో తెలియ‌డం లేద‌ని, క‌నీసం ఈ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు కూడా లేద‌న్నారు. ఇదీ వైసీపీ ప్ర‌భుత్వంలో మ‌హిళ‌ల‌కు ల‌భిస్తున్న భ‌ద్రత అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రాన్ని గంజాయి, క‌ల్తీమ‌ద్యంతో నింపేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

గంజాయి కార‌ణంగా అసాంఘిక శ‌క్తులు పేట్రేగిపోతున్నాయ‌న్నారు. అనేక మంది మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని, ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని చెప్పారు. ఐదేళ్ల‌లో ఏమైనా ప‌రిశ్రమ వ‌చ్చిందా?  ఒక్క మంచి ప‌ని అయిన వైసీపీ నేత‌లు చేశారా? అని భువ‌నేశ్వ‌రి ప్ర‌శ్నించారు. దీనిపై ప్ర‌జ‌లే స‌మాధానం చెప్పాల‌న్నారు. 

This post was last modified on March 28, 2024 11:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

38 minutes ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

44 minutes ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

46 minutes ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

3 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

5 hours ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

6 hours ago