తన సొంత చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక విమర్శలు వచ్చినా.. కోర్టుల్లో కేసు సుదీర్ఘ కాలం సాగినా.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్కమాట కూడా మాట్లాడని సీఎం జగన్ .. తాజాగా వివేకానందరెడ్డి హత్యపై సంచలన విమర్శలు చేశారు.
“బాబాయ్ను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ఆ దేవుడికి కడప జిల్లా ప్రజలకు బాగా తెలుసు. వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి.. అతిహీనంగా బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడు. ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు” అని అన్నారు.
అంతేకాదు, “ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో.. నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన వారే. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు నా వాళ్లు కూడా హంతకుడికి సమకరిస్తున్నారు. చిన్నాన్నను అన్యాయంగా చంపారు. ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు, ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి?” అని జగన్ ప్రశ్నించారు.
“ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. నేను మాత్రం ప్రజల పక్షం అని గర్వంగా చెబుతున్నా” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన “మేం సిద్ధం” పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన బస్సు నుంచే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే.. ఫస్ట్ టైం ఆయన వివేకా హత్యపై(సీఎం హోదాలో) స్పందించడం గమనార్హం.
This post was last modified on March 27, 2024 9:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…
సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…