Political News

సీఎంగా నా ఫ‌స్ట్ సంత‌కం ఆ ఫైల్ పైనే..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. తాను నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే తొలి సంత‌కం దేనిపై పెడ‌తానో అనే విష‌యాన్ని చెప్పుకొచ్చారు. తాను సీఎంగా నాలుగోసారి ప్ర‌మాణం స్వీకారం చేసిన వెంట‌నే  మెగా డీఎస్సీపై తొలి సంత‌కం చేస్తాన‌న్నారు. “మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇస్తున్నా. ఎన్డీయే కూటమి అధికారం లోకి వచ్చాక తొలి రోజే తొలి సంత‌కం డీఎస్సీపై చేస్తా.  అధికారం చేపట్టిన 60 రోజుల్లో డీఎస్సీ ఉంటుంది” అని అన్నారు. రాష్ట్రం లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్నీ ఖాళీలతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

“మీరు (యువత) వెళ్లి  ఎన్నికల సంఘాన్ని కలవండి. ఇప్పుడు డీఎస్సీ వద్దు అని చెప్పండి. ఎన్నికలు అయ్యాకే డీఎస్సీ జరపాలని కోరండి. మేం కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి డీఎస్సీ గురించి మాట్లాడతాం” అని చంద్ర‌బాబు పేర్కొన్నారు. గ‌తంలో టీడీపీ 1.50 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిందని చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు అదే రికార్డ్ అని, మళ్లీ అలాంటి రికార్డునే సృష్టిస్తామని చెప్పారు. తాము మెగా డీఎస్సీనే జరుపుతామని, గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో డీఎస్సీ నిర్వహిస్తామని  ప్రకటించారు.

ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్కసారి కూడా డీఎస్సీ నిర్వహించలేదని మండిపడ్డారు. మీ జీవితాలను అంధకారం చేసిన జలగ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. “యువ‌త‌ను నాశ‌నం చేశాడు. గంజాయి, మ‌ద్యానికి, క‌డాన డ్ర‌గ్స్‌కు కూడా యువ‌త‌ను బానిస‌ల‌ను చేసిన ఏకైక ముఖ్య‌మంత్రి ఈ జ‌గ‌న్‌. ఈయ‌న జ‌గ‌న్ కాదు.. యువ‌త ర‌క్తం పీల్చే జ‌ల‌గ‌. ఈయ‌న‌ను ఇంటికి పంపించేందుకు యువ‌త అంతా ఏకం కావాలి. వారి త‌ర‌ఫున పోరాడేందుకు నేనున్నారు. నేను అధికారం చేప‌ట్టిన వెంట‌నే తొలి సంత‌కం డీఎస్సీపైనే చేస్తాన‌ని మీకు హామీ ఇస్తున్నా“ అని చంద్ర‌బాబు యువ‌త‌కు తెలిపారు. కుప్పంలో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

This post was last modified on March 27, 2024 12:07 am

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

16 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

21 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago