Political News

చిన్న‌మ్మ‌కు సెగ‌.. కీల‌క స‌మావేశానికి సీనియ‌ర్లు డుమ్మా!

కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ.. టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తులు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీని ఏపీలో ప‌రుగులు పెట్టించ‌డ‌మో.. క‌నీసం నాలుగు పార్ల‌మెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం ద‌క్కేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువెళ్ల‌డ‌మో చేయాల‌ని బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి భావించారు. ఇది చిన్నమ్మ రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ప‌రీక్ష‌. రెండు కీల‌క పార్టీల‌తో పొత్తులు పెట్టుకున్న త‌ర్వాత కూడా బీజేపీ ముందుకు సాగ‌క‌పోతో అది ఆమె రాజ‌కీయ నాయ‌క‌త్వంపై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో అంద‌రినీ క‌లుపుకొని పోయేలా చిన్న‌మ్మ గ‌ట్టి ప్లానే వేశారు. ఇప్ప‌టికే దాదాపు సీట్లు ఖ‌రారైన నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల‌ను ముందుకు న‌డిపించేందుకు ఆమె ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా విజ‌య‌వాడ‌లో బీజేపీ ప‌దాదికారుల స‌మావేశం ఏర్పాటు చేశారు. అంద‌రికీ ఆహ్వానాలు పంపించారు. దీనిలో పార్టీ ఎలా ముందుకు సాగాలి?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో చేయాల్సిన ప్ర‌చారం..?  అధిష్టానం ఏం చెప్పింది? అనే అనేక విష‌యాల‌ను చ‌ర్చించాల‌ని భావించారు. కానీ, ఇక్క‌డే చిన్న‌మ్మ‌కు భారీ సెగ త‌గిలింది.

విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు.  పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు.  సాధారణంగా పొత్తుల్లో పరిమితంగా పోటీ  చేయాల్సి వచ్చినప్పుడు… పార్టీ సీనియర్ నేతలకు ప్రాధాన్యమిస్తారు. లేకపోతే క్యాడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్ప‌డింది. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో  పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.  దీంతో సీనియ‌ర్లు తాజాగా చిన్న‌మ్మ పెట్టిన కీల‌క స‌మావేశానికి డుమ్మా కొట్టి.. పోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.

బీజేపీ కోసం ప్రాణం పెట్టే సీనియర్లు అంతా మౌనం పాటిస్తున్నారు. వారికి ఏ విషయంలోనూ పార్టీ వ్యవహారాల్లో తగినంత ప్రాధాన్యం లభించడం లేదు.  పార్టీ విజయం కోసం వారికి సరైన బాధ్యతలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న  పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరవం కాపాడుకోవడానికి అయినా మౌనంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  బీజేపీలో ఈ పరిస్థితిని సీనియర్లు లేఖ ద్వారా  హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. అందుకే కీలక సమావేశాలకు వారు దూర‌మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.              

This post was last modified on March 26, 2024 11:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

2 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

9 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

10 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

10 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

12 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 hours ago