Political News

చిన్న‌మ్మ‌కు సెగ‌.. కీల‌క స‌మావేశానికి సీనియ‌ర్లు డుమ్మా!

కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ.. టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తులు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీని ఏపీలో ప‌రుగులు పెట్టించ‌డ‌మో.. క‌నీసం నాలుగు పార్ల‌మెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం ద‌క్కేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువెళ్ల‌డ‌మో చేయాల‌ని బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి భావించారు. ఇది చిన్నమ్మ రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ప‌రీక్ష‌. రెండు కీల‌క పార్టీల‌తో పొత్తులు పెట్టుకున్న త‌ర్వాత కూడా బీజేపీ ముందుకు సాగ‌క‌పోతో అది ఆమె రాజ‌కీయ నాయ‌క‌త్వంపై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో అంద‌రినీ క‌లుపుకొని పోయేలా చిన్న‌మ్మ గ‌ట్టి ప్లానే వేశారు. ఇప్ప‌టికే దాదాపు సీట్లు ఖ‌రారైన నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల‌ను ముందుకు న‌డిపించేందుకు ఆమె ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా విజ‌య‌వాడ‌లో బీజేపీ ప‌దాదికారుల స‌మావేశం ఏర్పాటు చేశారు. అంద‌రికీ ఆహ్వానాలు పంపించారు. దీనిలో పార్టీ ఎలా ముందుకు సాగాలి?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో చేయాల్సిన ప్ర‌చారం..?  అధిష్టానం ఏం చెప్పింది? అనే అనేక విష‌యాల‌ను చ‌ర్చించాల‌ని భావించారు. కానీ, ఇక్క‌డే చిన్న‌మ్మ‌కు భారీ సెగ త‌గిలింది.

విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు.  పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు.  సాధారణంగా పొత్తుల్లో పరిమితంగా పోటీ  చేయాల్సి వచ్చినప్పుడు… పార్టీ సీనియర్ నేతలకు ప్రాధాన్యమిస్తారు. లేకపోతే క్యాడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్ప‌డింది. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో  పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.  దీంతో సీనియ‌ర్లు తాజాగా చిన్న‌మ్మ పెట్టిన కీల‌క స‌మావేశానికి డుమ్మా కొట్టి.. పోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.

బీజేపీ కోసం ప్రాణం పెట్టే సీనియర్లు అంతా మౌనం పాటిస్తున్నారు. వారికి ఏ విషయంలోనూ పార్టీ వ్యవహారాల్లో తగినంత ప్రాధాన్యం లభించడం లేదు.  పార్టీ విజయం కోసం వారికి సరైన బాధ్యతలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న  పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరవం కాపాడుకోవడానికి అయినా మౌనంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  బీజేపీలో ఈ పరిస్థితిని సీనియర్లు లేఖ ద్వారా  హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. అందుకే కీలక సమావేశాలకు వారు దూర‌మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.              

This post was last modified on March 26, 2024 11:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago